మోడల్ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలి

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం సోమవారం  మోడల్ స్కూల్  లో బుదవారం రోజున అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్ డిఎస్) అధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఉమ్మడి జిల్లా  ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ సభ్యత్వం నమోదు చేయించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వర్షాకాల సమయంలో వర్షాలు భారీగా కురిస్తే క్లాస్ రూమ్ లోకి వర్షపు నీరు వస్తుందని,పాములు,తేళ్లు కప్పలు స్కూల్ లోపలికి వస్తూన్నాయని,చుట్టుపక్కల గడ్డి బాగా పెరిగిందని,రాత్రి సమయంలో గర్ల్స్ హాస్టల్లో చీకటిగా ఉందని స్కూల్ కు ఇరువైపులు లైట్లు వేయాలంటూ,మధ్యాహ్నం భోజనం వంట రూములో కాకుండా బయటనే వండుతున్నారని,స్కూలుకి ప్రహరి గోడ లేకపోవడంతో వర్షాకాల సమయంలో వర్షపు నీరుతో చెత్తాచెదారం కొట్టుకొచ్చి స్కూల్ గ్రౌండ్ లో చెత్తాచెదారం ఉంటుంది,  స్కూల్ పక్కనే స్మశాన వాటిక ఉండడంతో దుర్వాసన వస్తుందని విద్యార్థిని విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారని,వెంటనే అధికారులు స్పందించి ప్రహరీ గోడను నిర్మించాలి అంటూ విద్యార్థిని విద్యార్థులు కోరుతున్నారని ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చందు,నరేష్, విద్యార్థులు శివమణి,అక్షిత్,అశ్విన్,అజయ్,నవదీప్, యుగంధర్,మహేందర్ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.