సొంతగూటికి చేరిన ఏఐఎస్బి నాయకుడు

పార్టీ కండువా కప్పుకున్న సాయి కిరణ్ హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే30:హుజరాబాద్ పట్టణానికి చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర మాజీ కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ గురువారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీలేని పోరాటాలతో ఉద్యమాలు నిర్మించి పార్టీలో విద్యార్థి విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించిన  ఆల్ … Read more

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే29:జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి యొక్క ముఖ్య డిమాండ్ అయిన హెల్త్ కార్డు,నివేషణ స్థలాలు,రైల్వే పాసులను పునరుద్దించలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఫోర్త్ స్టేట్ అని చెప్పుకునే జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోతుందని ప్రజలకు ప్రభుత్వానికి … Read more

ఇల్లందకుంట రామాలయానికి వెలిచాల విరాళం

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే28:కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని రామాలయానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు  విరాళం ప్రకటించారు. అపర భద్రాద్రిగా పేరు గాంచిన సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ నాయకుడు వెలిచాల రూ.2 లక్షల నగదును మంగళవారం అందజేశారు.

ప్రభుత్వ భూమి కబ్జా పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలోని సర్వే నెం. 368 కుంట శిఖం భూమి 0-33 గుంటలు కబ్జాదారుల బారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి జమ్మికుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న ఫిర్యాదు చేశారు.ధర్మారం గ్రామంలోని సర్వే నెం 368 లో 0-33 గుంటల కుంట శిఖం భుమి ఉండగా మధ్యలో నుండి 1965లో  ఆర్&బి రోడ్డు జమ్మికుంట నుండి వావిలాల వరకు పోయింది.అప్పటి నుండి ఆ కుంట ఖాళీగా … Read more

యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయండి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫార్మ్స్ కుట్టు కేంద్రాలను సోమవారం మెప్మా పిడి స్వరూప రాణి, కమీషనర్ మొహమ్మద్ అయాజ్,డిఎంసి శ్రీవాణి, ఏడిఎంసి మల్లీశ్వరిలు పరిశీలించారు.అనంతరం పలు కేంద్రాలను పరిశీలించి,యూనిఫార్మ్స్ నాణ్యతగా ఉండేలా ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో కుట్టాలని,యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు సతీష్,సీఎల్ఆర్పీలు జ్యోతి, మంజుల,ఆర్పీలు,కుట్టు మిషన్ నిర్వాహుకురాలు అభేద భాను లతో పలువురు పాల్గొన్నారు.

నూజివీడు సీడ్స్  పుష్కలు వరి విత్తనాలతో అధిక దిగుబడి

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే27:సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో  నూజివీడు సీడ్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్లు  ఆర్ఎంజె శ్రీకాంత్ రెడ్డి ఈ సంద్భంగా మాట్లాడుతూ నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ వరి రకం విత్తనాలు అన్ని రకాల రోగాలకు తట్టుకొని ఎక్కువ ఎత్తు పెరగకుండా,గాలి దుమారాలకు పడిపోకుండా,ఎక్కువ దిగుబడులు వస్తుందని వివరించారు.ఈ వంగడాన్ని రైతుల కోసం ప్రత్యేకించి తయారు చేయడం జరిగిందన్నారు.ఇప్పటివరకు నూజివీడు సీడ్స్ కంపెనీ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని చేసుకొని … Read more

ఖబర్దార్ కేటీఆర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే25:మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లి బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు … Read more

భూ ఆక్రమణలపై కలెక్టర్ కు పిర్యాదు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన  భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ  లో సుమారు … Read more

విత్తన డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఏ జీ.సునిత మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ కూడా అనుమతి ఉన్న విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని,విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకి బిల్లు తప్పనిసరిగా అన్ని వివరాలతో ఇవ్వాలని,విత్తన అమ్మకాల వివరాలు రైతు వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.రైతుకు నష్టం కలిగేలా ఎలాంటి విత్తన అమ్మకాలు,ఎరువులు,పురుగుమందుల అమ్మకాలు చేయకూడదని,ఏదైనా … Read more

నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే24:వర్షాకాలం వస్తుండడంతో రైతులు దుక్కి దున్ని పంట సాగుచేయడానికి విత్తనాలు ఎప్పుడు వస్తాయా పంట ఎప్పుడు వేయాలా అని ఎదురుచూస్తూ ఉంటారని,రైతుల అవసరాన్ని ఆసరా చేసుకునే కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారని రైతులు జాగ్రత్తగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు.హుజురాబాద్ లోని ఏసీపీ కార్యాలయం లో డివిజన్ లోని పోలీస్ అధికారులతో కలిసి జై కిసాన్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ జీ … Read more