జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు కరీంనగర్/ధనాధన్ న్యూస్:ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తునోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని … Read more

మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి అమానుషం

కొమ్మెర తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు కుడితాడు బాపూరావు, జిల్లా కార్యదర్శి కరీంనగర్/ధనాధన్ న్యూస్: మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న మీడియాకు జవాబుదారిగా ఉండాల్సిన వ్యక్తులు అసహనంతో బౌతికదాడులకు పాల్పడడం సరైంది కాదని ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్మెర తిరుపతిరెడ్డి, కుడితాడు బాపురావు లు  పేర్కొన్నారు.సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో … Read more

జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జీవో 1395 ను సవరించాలి

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డులకు సంబంధించి నియమ నిబంధనల మార్పు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 1395 లోపభూయిష్టంగా,ఏకపక్షంగా ఉందని, ఈ జీవోను వెంటనే సవరించి ప్రభుత్వం వేసిన అన్ని జర్నలిస్టు సంఘాలకు, చిన్న పత్రికలకు, మహిళా జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్,ఎల్గొయి ప్రభాకర్, … Read more

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

జగిత్యాల/ధనాధన్ న్యూస్:జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా ఒక జర్నలిస్టు యూనియన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులను మభ్యపెట్టి పక్కదారి పట్టించేందుకు ఆ యూనియన్ చేస్తున్న చర్యలను ఫెడరేషన్ నాయకులు వ్యతిరేకించారు. యూనియన్ చేస్తున్న అనధికారిక కార్యకలాపాలకు మీడియా అకాడమి ఛైర్మన్ మద్దతు ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు.  ఆదివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు … Read more

టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హుజురాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో ముస్లీం పాత్రికేయులు,అధికారులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పాత్రికేయులు అంటే కేవలం సమాజంలోని సమస్యల పట్ల జవాబుదారిగా ఉండటమే కాకుండా అన్నీ మతాలను గౌరవిస్తూ ఉంటామని జమ్మికుంట జర్నలిస్టులు ఈ సందర్భంగా వెల్లడించారు.ఇఫ్తార్ విందుకు … Read more

పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి

కోల్ కత,ధనాధన్ న్యూస్: దేశవ్యాప్తంగా పాత్రికేయులకు,పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పలు జాతీయ జర్నలిస్టు సంఘాలు  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. నూతన వేజ్ బోర్డులో ప్రింట్ మీడియా జర్నలిస్టుతో పాటు ఎలక్ట్రానిక్, వెబ్, సోషల్ మీడియా జర్నలిస్టులను చేర్చాలని డిమాండ్ చేశాయి. సోమవారం కోల్ కతాలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) రెండు రోజుల జాతీయ వర్కింగ్ కమిటీ  సమావేశాలు ముగింపు సందర్భంగా ఇండియన్ … Read more

సిరిసేడు శివాలయం చైర్మన్ గా కొండ విజయ్ ఏకగ్రీవ ఎన్నిక

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామనికి చెందిన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా కొండ విజయ్ ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నిక చేస్తూ నియామకపు పత్రాన్ని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అందజేశారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిటీకి సూచించారు.అనంతరం … Read more