మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన వోడితల ప్రణవ్

హుజురాబాద్ ఏప్రిల్ 6:బోర్లపల్లి లో జరిగిన పెద్దమ్మ జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతున్న తరుణంలో మొరం టిప్పర్ లారీ ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై బోల్తా పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు.ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు గంట విజయ్, గంట వర్ష తో పాటు సింధుజలు మృతి చెందారు. బోర్నపల్లి ముదిరాజ్ బోనాల జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ … Read more

పెద్దంపల్లిలో శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ,నాగమ్మ దేవతల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు

జమ్మికుంట ఏప్రిల్ 05:జమ్మికుంట మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామంలో శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ ,నాగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది.పెద్దంపల్లి  గ్రామంలో శుక్రవారం రోజు తెల్లవారుజామున వినాయక హోమం తో మొదలై ఆదివారం వనభోజనాలతో ఈ ప్రతిష్టాపన పూర్తవుతుందని అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండలం ఎంపీపీ దొడ్డే మమత,పెద్దంపల్లి సర్పంచ్ ఇల్లందుల అన్నపూర్ణ,వార్డ్ నెంబర్లు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

జగ్గయ్యపల్లిలో చిరుతల రామాయణం ప్రదర్శన ప్రారంభం

జమ్మికుంట ఏప్రిల్ 04:మానవ సంబంధాలను గుర్తు చేసేదే చిరుతల రామాయణమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు  అన్నారు.బుధవారం జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో శ్రీ చిరుతల రామాయణ నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  జమ్మికుంట మున్సిపల్ చైర్మన్  తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు,జగ్గయ్యపల్లి మాజీ సర్పంచ్ వంశీధర్ రావు,రామాయణ కళా గురువు కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య ఉపాధ్యక్షుడు బోళ్ళ కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ చేతుల మీదుగా జ్యోతి … Read more

దుద్దేనపల్లీ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్

సైదాపూర్ ఏప్రిల్ 03:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లీ గ్రామంలో బుధవారం  రోజున సిఎస్ఎఫ్ పోలీస్ బృందంతో  గ్రామంలో కవాత్ నిర్వహించడం జరిగిందని సైదాపూర్ ఎస్సై జున్ను ఆరోగ్యం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పి వెంకట్ మాట్లాడుతూ ఎలక్షన్లను ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని,ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియపరిచారు.ప్రస్తుత పరిస్థితులను సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని గాని మతం పేరుతో గాని కులం పేరుతో గాని వివాదాస్పరమైన ఎలాంటి … Read more

రైతులకు నీళ్లు ఇస్తారా గేట్లు ఎత్తమంటారా తేల్చుకోండి

కమలాపూర్ ఏప్రిల్ 03:తెలంగాణ రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే హుజురాబాద్ నియోజకవర్గం లోని 106 గ్రామాలకు మరో తడి కోసం నీళ్లు అందించాలని, నీళ్లు ఇవ్వకపోతే స్వయంగా తానే గేట్లు ఎత్తుతానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో మొక్కజొన్న ఎండుతున్న తీరును చూసి రైతుల పక్షాన మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు వేసుకున్నప్పటికీ … Read more

సర్వాయి పాపన్న గుట్టని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

సైదాపూర్ ఏప్రిల్ 2:సర్వాయిపేట పరిసర ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గుట్ట ను పర్యాటక కేంద్రం కోసంసీఎం దృష్టి కి తీసుకెళ్ళి అభివృద్ధి కోసం కృషి చేస్తానని బిసి,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా సర్వాయిపేట మహ్మదాపూర్ గ్రామల నడుమ ఉన్న సర్వాయి పాపన్న గుట్ట మీద ఉన్న పాపన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.సర్దార్ … Read more

నల్లానితండాలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నేడు ఐకేపీ,పౌరసరఫరాల శాఖ ల ఆధ్వర్యం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నల్లాని తండా లో ప్రారంబిస్తున్నామని సెర్ప్ ఏపిఎం చెన్నబోయిన కుమారస్వామి తెలిపారు.రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని,ఘనపూర్, ఆకునూరు,వెంకేపల్లి లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సులోచనాదేవి దంపతులు శేషజీవితం హాయిగా గడపాలి

జమ్మికుంట మార్చ్ 31:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి టీచర్ చదువు సులోచనాదేవి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. జెడ్పీహెచ్ఎస్ పొత్కపల్లి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్య కమిటీ, హెచ్ఎంలు,స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు విద్యార్థులు,పుర ప్రముఖులు,రాజకీయ నాయకులు,విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 37 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన … Read more

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం

హుజురాబాద్ మార్చ్ 31:హుజురాబాద్ ప్రధాన తపాల కార్యాలయంలో పోస్ట్ మేన్ గా విధులు నిర్వర్తిస్తున్న ముంజాల సంపత్ పదవి విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సంపత్,రమాదేవి దంపతులను బంధువులు, సహచర ఉద్యోగులు పూల మాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.హుజురాబాద్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఊకంటి మహేందర్ మాట్లాడుతూ పోస్టల్ కార్యాలయంలో సంపత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ మంచి పేరు … Read more

జగ్గయ్యపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

జమ్మికుంట మార్చ్ 31:చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాలా వ్వాప్తిలో ఉంది.ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం.పల్లెల్లోని యువకులు,కళా అభిమానులు కలిసి ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.అలాంటి కళారూపాన్ని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు తెలిపారు.రామాయణ కళాకారుడు,కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బోల్ల కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ … Read more