కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో ఈరోజు శాంతి చర్చలను కోరుతూ సదస్సు జరిగింది. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యా, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, శాంతికాముకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఉద్ఘటించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ … Read more

పార్టీ కార్యకర్తలను కాపడుకుంటాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా వచ్చిన నమిండ్ల శ్రీనివాస్,రఘునాథ్ రెడ్డి తెలిపారు.శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్స్ లో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నిర్మాణ,సంస్థాగత సమావేశానికి వారు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్,పీసీసీ అధ్యక్షుడు … Read more

ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గ్లోబల్ షో టో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ పర్యవేక్షణలో ఈ తరగతులు స్థానిక న్యూ కాకతీయ మోడల్ స్కూల్‌లో ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి.పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ఆటల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కరాటే ఒక చక్కని ప్రత్యామ్నాయమని కరాటే మాస్టర్ జలీల్ అభిప్రాయపడ్డారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, … Read more

రాజ్యాంగ విలువలు బీజేపీ కాలరాస్తుంది

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ,రాజ్యాంగ విలువలను కాలరాస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.బుదవారం రోజున జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గల 13,14 వార్డులో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని వీధి,వీధిలా నిర్వహించారు.రాజ్యాంగం అంటే దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని,అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానపరుస్తూ,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచారని వెంటనే కేంద్ర హోం మంత్రి … Read more

మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా తోట స్వప్న 

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణం మోత్కులగూడెం కు చెందిన తోట స్వప్న ను జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా నియమించినట్లు మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్ర సత్య ప్రసన్న నియామక పత్రాన్ని పత్రాన్ని జారీ చేశారు. నియామక పత్రాన్ని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి  వొడతల ప్రణవ్ బాబు తోట స్వప్నకు అందజేశారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  నాపై నమ్మకంతో జమ్మికుంట మండల అధ్యక్షులుగా నియమించినందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ … Read more

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు గ్రామ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలనీ బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కానీ విని ఎరుగని రీతిలో జరగనుందని రవీందర్ పటేల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా … Read more

పేదవారి కడుపునింపేలా కాంగ్రెస్ పాలన

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ లోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతుల శ్రీవాణి-శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణవ్ వెళ్ళారు.ప్రణవ్ రాకతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా తమ ఇంటికి ఎ రాజకీయ … Read more

నీటి విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు

కమలాపూర్/ధనాధన్ న్యూస్: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ,ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వంగపల్లి,నేరెళ్ళ,శనిగరం,గోపాల్ పూర్ గ్రామాల్లో ఉన్న రైతులు సాగునీరుకు ఇబ్బంది పడుతున్నారని ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ప్రణవ్ అక్కడికి స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు.చేతికొచ్చిన పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఆ విషయాన్ని ప్రణవ్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి సంభందిత ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేసిన ప్రణవ్ … Read more