నీటి విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు

కమలాపూర్/ధనాధన్ న్యూస్: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ,ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వంగపల్లి,నేరెళ్ళ,శనిగరం,గోపాల్ పూర్ గ్రామాల్లో ఉన్న రైతులు సాగునీరుకు ఇబ్బంది పడుతున్నారని ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ప్రణవ్ అక్కడికి స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు.చేతికొచ్చిన పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఆ విషయాన్ని ప్రణవ్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి సంభందిత ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేసిన ప్రణవ్ … Read more

అనాధ పిల్లలతో ఉగాది వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్ రావు- లక్ష్మీ దంపతులు ఆదివారం ఉగాది వేడుకలను జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు లక్ష్మీ దపతులు సుమారు 30 మంది అనాధ పిల్లలకు బట్టలు అందజేసి పండ్లు పంపిణీ చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా అనాధ పిల్లలకు మధ్య ఉగాది వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తల్లి తండ్రి … Read more

షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో  నిర్వహించిన  గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కే తారకరామారావు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 29న 12:00 గంటలకు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 29న ఉదయం 10: 00 గంటల వరకు రూ. 5000 చిన్న షెటర్ గాను 10000 పెద్ద షెటర్ గాను డిపాజిట్ చెల్లించాలని … Read more

ఇళ్ళందకుంటలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ మండల స్థాయి సన్నాహక సమావేశం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ రెండు నుండి జరిగే రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.గురువారం రోజున ఇళ్ళందకుంట మండల కేంద్రంలో పాదయాత్రకు సంబంధించిన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ బీజేపీ నాయకులు పార్లమెంట్ సాక్షిగా అమిత్ … Read more

జమ్మికుంట మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షునిగా దాసారపు మహేందర్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: బహుజన్ సమాజ్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు గా తనుగుల గ్రామానికి చెందిన దాసరపు మహేందర్ ఎన్నికయ్యారు.బీఎస్పీ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు మంద సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మహేందర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోనల్ కోఆర్డినేటర్ మారేపల్లి మొగిలయ్య,జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రశాంత్ గౌడ్,జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈదునూరి రమేష్,అసెంబ్లీ ఉపాధ్యక్షుడు పెరుక శ్రీనివాస్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మంతెన సంపత్,కార్యదర్శి రేణిగుంట్ల రంజిత్,కోశాధికారి రాచపల్లి … Read more

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: వరల్డ్ యాంటీ స్మోకింగ్ డే సందర్భంగా జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి మీడియాతో మాట్లాడుతూ సిగరెట్ తాగే అలవాటు వల్ల అనేక ప్రాణాంతకమైన వ్యాధుల పాలు అయ్యే  అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత సిగరెట్లకు,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్నేహితులతో సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారి జీవితాలను నాశనం అయ్యే స్థితికి మత్తు పదార్థాలు చేరుస్తాయని కాబట్టి వాటికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తన పట్ల … Read more

ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ లో  సెయింట్ జోసెఫ్ విద్యార్థినికి స్టేట్ 5వ ర్యాంక్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు  ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ వారు నిర్వహించిన వివిధ  ప్రామాణిక పరీక్షల్లో పోటీపడి జమ్మికుంట సెయింట్ జోసెఫ్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నిహా తన్నజ్ స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. ఇదే స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని కే. విశ్వశ్రీ జోనల్ లెవల్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ ఫైనల్ … Read more

నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన దాతలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ నివాసులు పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ దగ్గర గల ప్రతాప్ వెంకటమ్మ- ఆదిరెడ్డి ల రెండవ కుమారుడు ప్రతాపు నాగరాజు వయసు 40 సంవత్సరాలు జీవనోపాధి నిమిత్తం హైదరాబాదుకు వెళ్లి సుతారిగా పనిచేస్తుండగా  రెండు కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల గత శుక్రవారం రోజున మరణించాడు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు డైరెక్ట్ గా  స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.ఇప్పుడు 11 రోజుల కార్యక్రమం చేయలేని పరిస్థితిలో ఉండగా ఇంటి దగ్గరలో ఉన్న మునుగంటి రవీందర్ రిటైర్డ్ … Read more

ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట లోకల్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మారపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా  జక్కే  సుమన్  (సాయి), శనిగరపు దేవేందర్, సెక్రటరీగా దండ వేన మధు, జాయింట్ సెక్రటరీగా జీడి కుమార్, లను ఎన్నుకున్నట్టు జమ్మికుంట లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మారేపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

సగర సంఘ సేవలు అభినందనీయం

వీణవంక/ధనాధన్ న్యూస్: సగర సంఘం సేవలు అభినందనీయమని హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గుండేటి గణేష్ అన్నారు.సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు కోరిక మేరకు మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని సగర సంఘ కార్యాలయంలో సగర సంఘం నేతృత్వంలో హన్మకొండలోని గణేస్ ఐ కేర్ అండ్ ఆఫ్టికల్స్,సాయితేజ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ … Read more