జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు కరీంనగర్/ధనాధన్ న్యూస్:ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తునోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని … Read more

సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి
రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం

హుజురాబాద్ /ధనాధన్ న్యూస్:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరిని రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఆయన అందిస్తున్న నిస్వార్థ, విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలు … Read more

ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో ప్రజా ప్రతిభ క్యాలెండర్‌ను హుజురాబాద్ ఆర్.సి రిపోర్టర్ ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కె.సారపు సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్రికా విలేకరులు ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల శ్రేయస్సు దిశగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత వహించాలని పేర్కొన్నారు.అలాగే ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ సమాజంలో పత్రికలు కీలక పాత్ర … Read more

సొంత గూటికి మద్దుల ప్రశాంత్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ సొంత గూటికి చేరారు. బుధవారం హుజురాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా మద్దుల ప్రశాంత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.గతంలో బీజేపీలో … Read more

మన వార్త దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జనవరి 07 :మన వార్త దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలండర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జమ్మికుంటలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ,పత్రిక ప్రజలకు–అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. సమాజానికి అవసరమైన వార్తలు, సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేరవేస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అనతికాలంలోనే విశేష ప్రాచుర్యం పొందిన మన వార్త దినపత్రిక యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు.ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో … Read more

కబ్జాకు గురైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కాపాడాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విలువైన భూమిని కొంతమంది అక్రమంగా కబ్జా చేశారని, ఆ స్థలాన్ని తిరిగి కళాశాల పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీపీడీసీ సభ్యుడు టంగుటూరి రాజకుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.బుధవారం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంత్రి బండి సంజయ్‌ను కలిసిన రాజకుమార్, కళాశాల భూకబ్జా అంశంపై గత 23 … Read more

ఘనంగా వీకేఎస్పీ జమ్మికుంట వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారం మహోత్సవం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వికేఎస్పి జమ్మికుంట క్లబ్ కు 2026 సంవత్సరానికి అధ్యక్షులుగా గుండా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి  చిదురాల పూర్ణచందర్, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాలుగా సిరిపురం రాజేష్, గవర్నర్ పుల్లూరి బాలమోహన్, ఎల్లంకి ప్రదీప్,లతోపాటు వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, రివిజన్ చైర్ పర్సన్ రామిడి శ్రీనివాస్, జోన్ చైర్ పర్సన్ అయితు రమేష్, వాసవి క్లబ్ అధికారులు కె … Read more

రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:మండలంలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో నూతన సంవత్సర ఆరాధన మరియు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి గుంటూరు నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెండ్ డాక్టర్ చెల్లీ అశోక్ కుమార్ ప్రత్యేక వాక్య సందేశం అందిస్తూ స్తుతి ఆరాధన నిర్వహించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం గణాంకాల ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర క్యాలెండర్లు అమల్లోకి … Read more

బోగస్ ఓట్లను తొలగించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఓటరు జాబితాలోని అక్రమాలపై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు మాట్లాడుతూ, కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తుల … Read more