అలరించిన బాలసభ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి లో జరిగిన బాలసభ సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి.తెలంగాణ ప్రభుత్వము విద్యాశాఖ వారు విద్యార్థులను సాంస్కృతికంగా సాహిత్య పరంగా అభివృద్ధిపరిచేందుకై ప్రతినెల నాలుగవ శనివారము ‘నో బ్యాగు డే’ను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్న సృజణాత్మకత శక్తులను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమము ఉపకరిస్తుందని విద్యార్థిని విద్యార్థులు బాలసభను ఉపయోగించుకొని చక్కటి సాంస్కృతిక నిర్వహించాలని కవితలు,గేయాలు,పాటలు వినిపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు చేసిన దేశభక్తి … Read more

ఘనంగా లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎంపిఆర్ గార్డెన్స్ లో లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమం ప్రారంభించారు.విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ డా.పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు.తల్లితండ్రులు కూడా వారికి ఎన్ని పనులు ఉన్న కొంత సమయాన్ని పిల్లలతో కూడా గడుపుతూ ఉన్నట్లయితే తల్లిదండ్రులపై సమాజంపై … Read more

బాల్యంలోనే చట్టాలపై అవగాహన అవసరం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: బాల్యంలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వెన్కేపల్లి ఎంపిటిసి సభ్యులు, న్యాయవాది జంపాల సంతోష్ తెలిపారు.సురక్షిత బాల్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా స్నేహిత కార్యక్రమం మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమంలో బాలికా,మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.లింగ సమానత్వం, బాలికా శిశు రక్షణ,పిల్లల విద్య, రక్షణ చర్యలపై హింస ప్రభావం,పిల్లలలో డ్రగ్ దుర్వినియోగం నివారణ,సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం,పిల్లల లైంగిక వేధింపుల నివారణ,పోక్సో చట్టం,జీవణా నైపుణ్యాలు,ఆత్మగౌరవం,రక్షణ,శరీర మూల్యాంకనం, ప్రవర్తనా మార్పులు,శరీర సానుకూలత,చైల్డ్ … Read more

ఢిల్లీ ధర్నాకు బయలుదేరిన డి.టి.ఎఫ్.నాయకులు.

కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న జాతీయ విద్యావిధానాన్ని నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత విద్యా హక్కు ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర,జిల్లా నాయకత్వం శుక్రవారం రోజున బయలుదేరివెల్లింది.శుక్రవారం ఉదయం 46 మంది సభ్యులతో కూడిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ బృందం రామగుండం లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ రైల్లో వెళ్లారు.డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి,రాష్ట్ర … Read more