అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజురాబాద్ పట్టణానికి  చెందిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ ని ఆయన  నివాసంలో సోదరి అశ్విని, తదితర సోదరీమణులు రాఖీలు కట్టారు. ముందుగా హారతి ఇచ్చి తిలకం దిద్ది రాఖీ కట్టిన అనంతరం నోరు తీపి చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎల్ వి అర్జున్ మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ కులమతాలకు అతీతంగా సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక. ఈ పండుగ మనసుల్లో ప్రేమ, … Read more

కౌశిక్ రెడ్డి దృష్టి చిల్లర రాజకీయాల మీద-మా దృష్టి అభివృద్ధి మీద

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కేసీఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని,అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య,వైద్య … Read more

దుద్దెనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో శనివారం రోజున ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు,విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయకంగా చీరలు కట్టి, నెత్తిన బోనం ఎత్తి, శివసత్తులు,పోతరాజు వేషం కట్టి విద్యార్థులు ఆటపాటలతో అలరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బోనాల పండుగను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో, బోనం వండి,గ్రామ దేవతలను స్మరిస్తూ ప్రసాదం సమర్పించారు.ప్రైమరీ స్కూల్ హెచ్ఎం విజయ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులతో మరియు పిల్లలతో కలిసి బోనాల పండుగను … Read more

నిరుద్యోగుల యువతి యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో తేదీ జూలై  21 2025 సోమవారం రోజున  హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా  జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఓ ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ నియోజవర్గం లో ఉన్నటువంటి నిరుద్యోగులు టెన్త్, ఇంటర్మీడియట్,డిగ్రీ,పీజీ,బీటెక్, చదువుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం  చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది వారు తెలిపారు. అదేరోజు రిక్రూట్మెంట్ కూడా … Read more

తప్పుడు పత్రాలతో అధికారులను మోసం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తప్పుడు పత్రాలు సృష్టిస్తూ అధికారులను మోసం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న భూ కబ్జాదారులపై  ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్యఅన్నారు .మంగళవారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా హింసిస్తున్నారని, ప్రజల్లో తనను ఒక తప్పుడు వ్యక్తిగా సూచిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళితుడైన తనను కొంతమంది కావాలని … Read more

నాకు ప్రాణహాని ఉంది

శంకరపట్నం/ధనాధన్ న్యూస్: శంకరపట్నం మండలం, మొలంగూర్ (గుడాటిపల్లె) గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భూ వివాదాల నేపథ్యంలో గుర్రం సంజీవ్ రెడ్డి, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి తమకు న్యాయం కావాలని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. శ్రీధర్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, 2006లో గుర్రం కిషన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి తమ తండ్రి పెద్ద మల్లారెడ్డికి సర్వే నెం. 231లో 8 … Read more

రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

వీణవంక/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ జరిగిందో వివరించాలని వీణవంక మండల కేంద్రానికి చెందిన రైతు నాయకుడు నీల పున్నం చెందర్ అన్నారు. గడిచిన సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికి కూడా రుణమాఫీ కాక లబోదిబో అంటున్న రైతులు, ఎవరికి రుణమాఫీ చేశారు. మేము రైతులం కాదా మాకెందుకు రుణమాఫీ చేయలేదు.. ఇప్పటివరకు మా గురించి కాంగ్రెస్ … Read more

42శాతం రిజర్వేషన్లు అమలు అందరి బాధ్యత

హన్మకొండ/ధనాధన్ న్యూస్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఆగదని, ఆర్డినెన్స్ తెచ్చుటకు విపక్షాలు సహకరించాలని  ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ లోని జర్నలిజం విభాగంలో ఫూలే ఆశయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి ఆధ్వర్యంలో  ఉమ్మడి జిల్లా సమావేశం జరిగింది. దీనికి పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ముఖ్యఅతిధిగా … Read more

స్కూల్ ను కాపాడడం కోసం కదం తొక్కిన మహిళలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకి తీసుకుని వెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సులను, మోడల్ స్కూల్ బస్సును, మహిళలందరూ అడ్డుకొని, బస్సు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నా చేసి,గ్రామంలోని విద్యార్థులను బస్సులో నుంచి దింపి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వెళ్లడానికి గల కారణాలు అడిగి తెలుసుకోని,విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత మాదేనని … Read more

రసమయి బాలకిషన్ నోరు అదుపులో పెట్టుకో

కరీంనగర్/ధనాధన్ న్యూస్: ఇందిరమ్మ ఇండ్ల పైన మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి పైన రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.  స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనలో మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న … Read more