భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణానికి ‘కోటి గోటి తలంబ్రాలు’ సమర్పణ

జమ్మికుంట/ఇల్లందకుంట, మార్చి 22:కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఈ నెల 27న (మార్చి 27, 2026) జరగనున్న శ్రీరామనవమి కల్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుక కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన శ్రీరామదాసు భక్త మండలి (చెల్పూర్) వారు అత్యంత భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన ‘కోటి గోటి తలంబ్రాలను’ ఆదివారం ఆలయ అధికారులకు సమర్పించారు. నియమ నిష్ఠలతో తలంబ్రాల తయారీగత పది సంవత్సరాలుగా భద్రాచలం మరియు … Read more

“పులి బక్కపడినా చారలు పోవు…” – జన్మదిన వేడుకల్లో ఈటల రాజేందర్ ఆత్మవిశ్వాస గర్జన

శామీర్‌పేట/ధనాధన్ న్యూస్: “ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని గాయాలైనా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. పులి బక్కపడినంత మాత్రాన దాని ఒంటి మీద చారలు పోవు” అని మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తన పోరాట పటిమపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజలే నా బలం..వారి … Read more

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు విప్ బాధ్యతలు…ఇల్లందకుంటలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు విప్ బాధ్యతలు రావడంతో ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.కరీంనగర్ జిల్లా ఫిషర్‌మెన్ చైర్మన్ బండి మల్లేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గడ్డివానిపల్లి సర్పంచ్ గడ్డి శ్రీనివాస్, వంగ రామకృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కృషి చేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించి ఉన్నత … Read more

మత సామరస్యానికి ప్రత్యేకగా రంజాన్ వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో ముస్లిం పాత్రికేయులకు అధికారులకు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ములుగు ప్రశాంత్, పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్, హాజరై వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు. రంజాన్ మాసంలో సూర్యాస్తమయం తర్వాత ముస్లింలు తమ రోజా (ఉపవాసం) విరమించే భోజనాన్ని “ఇఫ్తార్” … Read more

జై భీమ్ కాలనీలో ఎస్సీ కమిటీ ఏర్పాటు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు జై భీమ్ కాలనీలో యువతలో మంచి మార్పు తీసుకురావడం, సమాజంలో పోటీ తత్వం పెంపొందించడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం లక్ష్యంగా నూతనంగా ఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్ సురంజన్ ని ఘనంగా సన్మానించారు. అదే వేదికపై కమిటీకి ఎన్నికైన సభ్యులను కూడా కౌన్సిలర్ సురంజన్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. … Read more

మహిళల రక్షణ కోసం మగవారే ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జేఎన్‌టీయూ క్యాంపస్:సమాజంలో మహిళల రక్షణ కోసం పురుషులే ముందుండి బాధ్యత తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి A. Revanth Reddy పిలుపునిచ్చారు. మహిళల భద్రత కేవలం ఫిర్యాదులు, కేసుల నమోదుతో మాత్రమే పరిమితం కాకుండా అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు.హైదరాబాద్‌లోని Jawaharlal Nehru Technological University Hyderabad ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “Stand With Her” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా … Read more