రాజ్యాంగ విలువలు బీజేపీ కాలరాస్తుంది

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ,రాజ్యాంగ విలువలను కాలరాస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.బుదవారం రోజున జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గల 13,14 వార్డులో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని వీధి,వీధిలా నిర్వహించారు.రాజ్యాంగం అంటే దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని,అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానపరుస్తూ,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచారని వెంటనే కేంద్ర హోం మంత్రి … Read more

ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం

వరంగల్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ పార్టీ రజతోఉత్సవ సభ పరిశీలన సందర్భంగా వరంగల్ మీదుగా ఎలుకతుర్తికి వచ్చిన కే కవితక్కని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు  ( నాంచారమ్మ )  ఎరుకల బుట్టను ఇచ్చి  స్వాగతం  పలికారు.కవితక్క  ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ … Read more

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు గ్రామ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలనీ బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కానీ విని ఎరుగని రీతిలో జరగనుందని రవీందర్ పటేల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా … Read more

మూడోసారి మాల సంఘం అధ్యక్షునిగా వేలంగి ప్రేమ్ సాగర్ ఎన్నిక

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో మాల సంఘం అధ్యక్షుడిగా వేలంగి ప్రేమ్  సాగర్ మూడవసారి మాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.మాల సంఘం నాయకులు గ్రామ ప్రజలు సర్వాయిపేట మాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన వేలంగి ప్రేమ్ సాగర్ కు ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వేలంగి ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ మూడవసారి సర్వాయిపేట మాల సంఘం అధ్యక్షునిగా కొనసాగింపు పట్ల సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రతిక్షణం ప్రతి … Read more

పేదవారి కడుపునింపేలా కాంగ్రెస్ పాలన

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ లోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతుల శ్రీవాణి-శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణవ్ వెళ్ళారు.ప్రణవ్ రాకతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా తమ ఇంటికి ఎ రాజకీయ … Read more

శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 05:కరీంనగర్ టౌన్ జ్యోతి నగర్ శ్రీ సంతోషి మాత పంచముఖ వినాయక శ్రీ హనుమాన్ దేవాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు పులిహోర ప్రసాద వితరణ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చవిటి రామశర్మ, అర్చకులు రాంపల్లి రాజేశ్వర శర్మ, కార్తీక్ శర్మ, హనుమాన్ భక్తులు కోడిపల్లి కృష్ణ కృష్ణ స్వామి … Read more

నీటి విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు

కమలాపూర్/ధనాధన్ న్యూస్: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ,ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వంగపల్లి,నేరెళ్ళ,శనిగరం,గోపాల్ పూర్ గ్రామాల్లో ఉన్న రైతులు సాగునీరుకు ఇబ్బంది పడుతున్నారని ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ప్రణవ్ అక్కడికి స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు.చేతికొచ్చిన పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఆ విషయాన్ని ప్రణవ్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి సంభందిత ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేసిన ప్రణవ్ … Read more

అనాధ పిల్లలతో ఉగాది వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్ రావు- లక్ష్మీ దంపతులు ఆదివారం ఉగాది వేడుకలను జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు లక్ష్మీ దపతులు సుమారు 30 మంది అనాధ పిల్లలకు బట్టలు అందజేసి పండ్లు పంపిణీ చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా అనాధ పిల్లలకు మధ్య ఉగాది వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తల్లి తండ్రి … Read more

షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో  నిర్వహించిన  గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కే తారకరామారావు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 29న 12:00 గంటలకు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 29న ఉదయం 10: 00 గంటల వరకు రూ. 5000 చిన్న షెటర్ గాను 10000 పెద్ద షెటర్ గాను డిపాజిట్ చెల్లించాలని … Read more

ఇళ్ళందకుంటలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ మండల స్థాయి సన్నాహక సమావేశం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ రెండు నుండి జరిగే రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.గురువారం రోజున ఇళ్ళందకుంట మండల కేంద్రంలో పాదయాత్రకు సంబంధించిన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ బీజేపీ నాయకులు పార్లమెంట్ సాక్షిగా అమిత్ … Read more