ప్రజా పాలనలో కొలువుల జాతర

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా 90 రోజుల్లోనే ప్రజలు మెచ్చే విధంగా తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 5192 మంది కి జూనియర్ లెక్చరర్, గురుకుల టీచర్లు గా ఉద్యోగ నియామక పత్రాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదే కాకుండా ఎన్నో … Read more

బీజేపీ గెలిస్తే మోదీయే పీఎం- మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు పీఎం

మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది.ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి.ఆ హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నరు.గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం,కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు.రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ … Read more

పురుషుల పొదుపు సంఘం సమితి అధ్యక్షుడి ఏకగ్రవ ఎన్నిక

సైదాపూర్ పురుషులు పొదుపు సంఘం సమితి అధ్యక్షుడుగా పైడిపల్లి రవీందర్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 8 సంఘల పరిదిలోని అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహవికాస ప్రతినిదులు కవిత  లక్ష్మణ్,  సమితి పాలకవర్గ సభ్యుల ఆద్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.సమితి ఉపాధ్యక్షుడుగా బత్తుల భూమయ్య  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో 8 సంఘాల అధ్యక్షులు సంఘాల పాలకవర్గాలు మరియు ఘణకులు పోగు రమేష్,జేల్ల శ్రీనివాస్,బత్తుల భూమయ్య,ఇందులకంటి మాధవరెడ్డి,తిరుపతి,వాసుదేవ రెడ్డి,మదన్ మొహన్,చెంచాల దిలీప్,రాజిరెడ్డి,వెల్ది రాజు తదితరులు పాల్గొన్నారు.

మా వెనుక ఎవరూ లేరు

జమ్మికుంట దళిత బంధు సాధన కమిటీ నాయకులు జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారులైన తాము రెండో విడత దళిత బంధు సాధనకై ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా అక్కడి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి తమను అక్రమంగా అరెస్టు చేసి కనీసం మహిళలు,వృద్ధులు అని కూడా చూడకుండా సిటిఎస్ కు తరలించారు.తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కానీ స్థానిక … Read more

బండి సంజయ్ కి మతి బ్రమించింది

కరీంనగర్,ధనాధన్ న్యూస్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న చిగురుమామిడి మండలంలో జరిగిన ప్రజాహిత యాత్రలో రాష్ట్ర  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని,దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప వ్యక్తిగత దూషణలతో పాటు మహిళ లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.తక్షణమే మంత్రి పొన్నం కి క్షమాపణలు చెప్పనియెడల బండి ప్రజాహిత యాత్ర ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కేవలం … Read more

తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ సాధించిన ఐదు నెలల చిన్నారి

రాజన్న సిరిసిల్ల జిల్లా,ధనాధన్ న్యూస్: పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది. అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి ప్రశంసలు అందు కోవడమే గాక,తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు చోటు కూడా సంపాదించింది ఆ చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల … Read more

పెండింగ్ ఫీజ్ బకాయిలను వెంటనే చెల్లించాలి

కామారెడ్డి,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ బి.ఎడ్ ప్రొఫెషనల్ కళాశాలకు సంబంధించిన 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం … Read more

ఎలాగందుల ఎంపీ స్థానం హస్తగతం అయ్యేనా?

ఎడిటర్ డెస్క్,ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది.ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కరీంనగర్ నే టార్గెట్ చేస్తున్నాయి. కాగా, ఈ సారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం తప్పనిసరిగా కాంగ్రెస్ ఖాతాలోనే నమోదయ్యే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు తప్పనిసరిగా ఎక్కువగానే … Read more

బాలవికాస స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అభినందనీయం

బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన వికాస బాలల పుట్టినరోజు వేడుకల్లో ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.బాల వికాస కోఆర్డినేటర్లు సభ్యులు వొడితల ప్రణవ్ కి పూలు చల్లుతూ బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బాల … Read more

సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఒడితల ప్రణవ్

వీణవంక, ధనాధన్ న్యూస్: వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శనివారం పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జాతర కమిటీ అధ్యక్షున్ని ఆదేశించారు. భక్తుల కోసం మంచి నీరు, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అన్నారు. అనంతరం జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ జాతర … Read more