రైతు ఉత్సవాల పేరుతో ‘అన్నదాత’కు అవమానం

సిద్దిపేట/ధనాధన్ న్యూస్:ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతు ఉత్సవాలు’ క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పిస్తామంటూ హుజూరాబాద్ నియోజకవర్గ రైతులను సిద్దిపేటకు తరలించిన అధికారులు, కనీసం వారికి సరైన భోజన వసతి కల్పించడంలో విఫలమయ్యారు. అధికారుల అతి ఉత్సాహం, నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ రైతు ఉత్సవాల పేరుతో పిలిచి రైతులను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం … Read more

సెయింట్ థామస్ పాఠశాలలో  గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సెయింట్ థామస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే  ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూసెయింట్ థామస్ పాఠశాల ప్రారంభం నుండి చుట్టు పక్కల గ్రామాల పేద పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించి ఎంతో … Read more

పాత పద్ధతిలో హుజూరాబాద్‌ను మళ్లీ చేసుకుందాం

కమలాపూర్/ధనాధన్ న్యూస్:హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం శనిగరం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి కొత్తపల్లి రాజు (ఉంగరం గుర్తు), వార్డు మెంబర్ల తరఫున గ్రామంలో భారీ రోడ్ షో నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తావిస్తూ, ఈటల రాజేందర్ తమ కృషిని గుర్తు చేశారు. “హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఫోర్ లైన్ రోడ్లు వేయించాం. ఎప్పుడూ … Read more

ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లిలో సుదీర్ఘకాలం ఆంగ్ల ఉపాధ్యాయులుగా సేవలందించిన కనపర్తి రమేష్ ఉద్యోగ విరమణ సమావేశం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి (DEO) శ్రీరామ్ మొండయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులని అన్నారు. వారి యొక్క క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం పిల్లల భవిష్యత్తుపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.పదవీ విరమణ పొందిన కనపర్తి రమేష్ సేవలను … Read more

రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వీణవంక/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కుతూ యావత్ ప్రజానీకాన్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు దిశగా చర్యలు చేపట్టాలని యువతకు రాజీవ్ యువ వికాసం పథకం 2025 దరఖాస్తు  ఏప్రిల్ 14,  ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను ఇస్తానని చెప్పి మోసం చేసి నేటి వరకు … Read more

అవయవదానం చేస్తే జీవితాలు నిలుస్తాయి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4:జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవయవదానం పై అవగాహన కల్పించేందుకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని కార్తికేయ ఐటీఐ కళాశాలలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ లెంకలపల్లి శరత్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నరహరి గురూజీ పాల్గొని విద్యార్థులకు అవయవదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మరణం తర్వాత శరీరం కాలిపోతే బూడిద, పూడితే మట్టిగా మారిపోతుందని, అదే అవయవాలను దానం చేస్తే మరొకరి జీవితానికి పునర్జన్మ కల్పించగలమని వారు … Read more

ఆర్టీవో నూతన భవన నిర్మాణానికి కృషి

హుజురాబాద్, సెప్టెంబర్ 03 (ధనాధన్ న్యూస్):హుజురాబాద్ ఆర్టీవో కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంప్‌లో గల ఆర్టీవో కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పడాల రాహుల్ మాట్లాడుతూ, హుజురాబాద్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన … Read more