పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు:దాసరి రాజేశ్వర్ ధ్వజం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, డిసెంబర్ 17:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పెన్షనర్ల హక్కులు హరించుకుపోతున్నాయని రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ ప్రెసిడెంట్, AIRRF సీఈసీ సభ్యులు దాసరి రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. AIRF, NCCCIPA, AISCCON సంఘాల పిలుపు మేరకు బుధవారం జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ‘పెన్షనర్స్ డే’ను బహిష్కరించి, ప్రభుత్వ తీరుకు నిరసనగా ‘పెన్షన్ రక్షణ దినోత్సవాన్ని’ శాంతియుతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెన్షనర్లు తమ న్యాయమైన … Read more

అధికారుల వైఖరికి నిరసనగా అంబేద్కర్ కు వినతిపత్రం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: విద్యాశాఖ అధికారుల తీరుకు నిరసనగా హుజరాబాద్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ మండల విద్యాధికారి పై విద్యాశాఖలో పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంలో గల ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని హుజరాబాద్ మండలం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య … Read more

కనగర్తి ప్రజలారా! ఇది కేవలం ఎన్నిక కాదు, మన గ్రామానికి ‘పునర్జన్మ’!

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: గ్రామ చరిత్రలో కనీవినీ ఎరుగని అభివృద్ధి, పారదర్శక పాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచిన శ్రీమతి బండి సంధ్యారాణి మల్లేష్ తీవ్ర ఉద్వేగంతో గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ఈ ఎన్నికను కేవలం పదవి కోసం కాదని, గ్రామానికి పునర్జన్మ ఇవ్వడం కోసం జరుగుతున్న చారిత్రక పోరాటంగా అభివర్ణించారు.జిల్లా కాంగ్రెస్ ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్ సతీమణి అయిన సంధ్యారాణి మల్లేష్ మాట్లాడుతూ, “మీరు నన్ను 10 ఏళ్లుగా … Read more

జమ్మికుంటలో రికార్డింగ్ స్టూడియో ప్రారంభం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల కేంద్రంలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పుల్లా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా, అత్యంత నూతన పరికరాలతో నేడు జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై రికార్డింగ్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, అత్యంత మెరుగైన పరికరాలతో రికార్డింగ్ స్టూడియో ను అందుబాటులోకి తీసుకోవచ్చామని … Read more

హుజురాబాద్ ఎంఈఓ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు ఫిర్యాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండల విద్యాధికారి పై కమిషనర్ మరియు సంచాలకులు పాఠశాల విద్య తెలంగాణ కి ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు మండల విద్యాధికారి మరియు గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. అధికార దుర్వినియోగం జరిగింది … Read more

కొత్తపల్లిలో మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామం నిన్న (మంగళవారం) ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. స్థానిక నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో పోరెడ్డి రవీందర్ రెడ్డి తన 18వ పడి సందర్భంగా మహా దివ్య పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగింది. పండితుల మంత్రోచ్ఛారణల మధ్యమోతే తిరుపతి గురుస్వామి, కే వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో … Read more

దళిత బంధు నిధులపై వివక్ష ఏంది!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దళిత బంధు పథకం రెండో విడత నిధులు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జమ్మికుంట మండలంలోని దళిత లబ్ధిదారులు, దళిత బంధు పోరాట సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు అందనందున, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తూ తమ సమితి సభ్యులు మండలంలోని దళితవాడల్లో ప్రచారం చేయనున్నట్లు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్ ఒక ప్రకటనలో తెలిపారు. నాయకుడిపై కోపాన్ని … Read more

హుజురాబాద్‌లో ఆధ్యాత్మిక శోభ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా,హుజురాబాద్ ప్రాంతంలో ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రముఖ రైస్ మిల్లు వ్యాపారులు కాళ్ళ సంతోష్ మరియు ఆయన ధర్మపత్ని అనిమ దంపతులు తమ స్వంత ఆర్థిక సహకారంతో మహా దివ్య పడిపూజ మరియు స్వాములకు భిక్ష కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వరంగల్ రోడ్డులోని పరకాల క్రాస్ సమీపంలో గల వాసవి ఇండస్ట్రీస్‌ (ఎం.ఆర్.ఎం) ప్రాంగణం ఈ దివ్య కార్యక్రమానికి వేదికైంది. కల్లూరు వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో … Read more

ఇసుక మాఫియా దొంగలు మీరు

జమ్మికుంట/ధననాధన్ న్యూస్: కొబ్బరికాయల దొంగేవడు అంటే భుజాలు తడుముకున్నట్లు బీఆర్ఎస్ నాయకుల వ్యవహార తీరు ఉందని పత్తి కృష్ణా రెడ్డి తెలిపారు.ఆదివారం రోజున తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియాను మొదలు పెట్టిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మాణ లోపంతో కుంగిపోయిన చెక్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే బాంబులతో కూల్చేశారని మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జమ్మికుంట మండలం తనుగుల శంభుని పల్లి గ్రామం … Read more

ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టదా?

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పట్టణ ప్రజల ప్రాణాల పట్ల వారి ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనంగా మారింది జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతం. బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ఒకవైపు రిలయన్స్ పెట్రోల్ పంపుకు ముందు, మరొకవైపు బస్టాండ్‌కు వెళ్లే దారిలో భారీగా, ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు గత కొంతకాలంగా వాహనదారులకు,స్థానికులకు నరకాన్ని చూపుతున్నాయి.ప్రజల నుంచి పన్నుల వసూళ్లలో మాత్రం మున్సిపాలిటిని రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉంచుతున్న మున్సిపల్ అధికారులు , పట్టణ … Read more