బీజేపీ గెలిస్తే మోదీయే పీఎం- మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు పీఎం

మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది.ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి.ఆ హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నరు.గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం,కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు.రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ … Read more

మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండా లో అవినీతి

మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన ఎజండ ప్రజల కోసం అభివృద్ది కోసం ఉపయోగ పడేలా లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం 12 గంటలకు వుందని సమాచారం అందించి ఆ తరువాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు మళ్ళీ సమాచారం అందించారని తెలిపారు.ఈ సమాచారం తో 11:30 కు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ గదిలోకి వెళ్ళగానే … Read more

దళితబందు రెండవ విడత ఎప్పుడు ఇస్తారో జిల్లా మంత్రి ప్రకటన చేయాలి

హుజురాబాద్ నియోజకవర్గం లోని పైలెట్ ప్రాజెక్టు అయినటువంటి దళితబందును రెండవ విడతను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పూర్తిస్థాయిలో మంజూరు చేస్తుందో జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన ద్వారా తెలపాలని హుజురాబాద్ నియోజకవర్గ దళితబందు సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.గత బి అర్ ఎస్ ప్రభుత్వం దళితబందు పూర్తిస్థాయిలో మంజూరు చేయడంలో విఫలం అయిందని రెండవ విడత కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్న దళితులకు అన్యాయం చేశారని,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన … Read more

దళిత బందు ఇచ్చేది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వమే

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్,అప్పటి ఎమ్మెల్సీ,ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని  ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “దళిత బందు” సాధన కమిటీ నాయకుల ప్రకటనల వల్ల దళిత బంద్ లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నామ్ … Read more

మా వెనుక ఎవరూ లేరు

జమ్మికుంట దళిత బంధు సాధన కమిటీ నాయకులు జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారులైన తాము రెండో విడత దళిత బంధు సాధనకై ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా అక్కడి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి తమను అక్రమంగా అరెస్టు చేసి కనీసం మహిళలు,వృద్ధులు అని కూడా చూడకుండా సిటిఎస్ కు తరలించారు.తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కానీ స్థానిక … Read more

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే తాట తిస్తాం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఉరుకునేది లేదని హుస్నాబాద్ నియెజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్ ఒక ప్రకటన లో హెచ్చరించారు.ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నరని ఎద్దేవా చేశారు.ఉద్యమం ద్రోహి కౌశిక్ రెడ్డి అని ప్రజలను బ్లాక్ మెయిల్ … Read more

దళిత బందుకై కదిలిన దళిత దండు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంద్ పథకంలో భాగంగా మొదటగా పైలట్ ప్రాజెక్టు గా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా హుజురాబాద్ లో గల 4900 కుటుంబాలకు దళిత బంద్ నిధులు మంజూరి చేసి వారివారి అకౌంట్ లలో జమచేయడం జరిగింది.దుకాణాలు పెట్టుకున్న వారికి మొదటి విడత గా 5 లక్షలు ఇవ్వగా, రెండవ విడత 5 లక్షలు ఇంకా ఇవ్వవలసి ఉండే కానీ గత ప్రభుత్వం ఇస్తాము … Read more

అసలు దళిత బంధు ఆపింది ఎవరు?

జమ్మికుంట పట్టణ కేంద్రం లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్ మాట్లాడుతూ అసలు దళిత బంధు రెండో విడత ఆపింది ఎవరో,ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.అలాగే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత బంధు రెండో విడత ఇవ్వడానికి రెండు నెలల కాలం ఉన్నప్పటికీ ఇవ్వకుండా దళిత బందుకు సంబంధించిన ఆఫీసర్లను భయభ్రాంతులకు గురిచేసి రెండో విడత ఆపి మళ్ళీ రెండో విడత మంజూరు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు.అలాగే ఇప్పుడున్న … Read more

అధైర్య పడకండి అండగా ఉంటా

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గం ఎంపిక చేసి నియోజకవర్గంలోని దళితులందరికీ సుమారు 18 వేల పై … Read more

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో.

కరీంనగర్,ధనాధన్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం స్థానిక ఇందిరా చౌక్ లో నగర ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కల్వకుంట్ల … Read more