విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం స్థానిక కేసీ క్యాంపులోని మహాత్మ జ్యోతిరావు పూలే,మైనార్టీ గురుకుల పాఠశాలలో కాస్మోటిక్ చార్జీల పెంపు,కామన్ డైట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని,విద్యార్థుల సమస్యలను నేరుగా మా వద్దకు తీసుకురావాలని కోరారు.విద్యారంగ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం … Read more

మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి అమానుషం

కొమ్మెర తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు కుడితాడు బాపూరావు, జిల్లా కార్యదర్శి కరీంనగర్/ధనాధన్ న్యూస్: మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న మీడియాకు జవాబుదారిగా ఉండాల్సిన వ్యక్తులు అసహనంతో బౌతికదాడులకు పాల్పడడం సరైంది కాదని ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్మెర తిరుపతిరెడ్డి, కుడితాడు బాపురావు లు  పేర్కొన్నారు.సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో … Read more

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హుజురాబాద్  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్( బాలికలు ) లో చదువుతున్న 140 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 13 సంవత్సరముల నుండి గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు నిర్వాహకులు … Read more

హుజురాబాద్ డిపోను సందర్శించిన ఆర్ఎం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక డిపోను కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు మంగళవారం రోజున సందర్శించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటి ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఆర్ఏం మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో లాభాల బాటలో నడుస్తుందని, దీనికి ప్రధాన పాత్ర పోషిస్తుంది డ్రైవర్,కండక్టర్,మెకానిక్ లని,ఎంతో శ్రమ ఒడ్చి వారు కార్పొరేషన్ కోసం కృషి చేస్తున్నారని,ఆర్టీసీ డిపోలో ప్రశాంతమైన వాతావరణం … Read more

ఇక అంగన్వాడీలోనూ యూనిఫామ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అంగన్‌వాడీ స్కూళ్లలోనూ ఇక నుంచి యూనిఫామ్‌ ఉండనుంది.ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు యూనిఫామ్‌ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఒక్కో విద్యార్థికి జత చొప్పున పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే క్లాత్‌ జిల్లాకు చేరుకుంది. వచ్చే నెల మొదటి వారంలో యూనిఫామ్‌ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌ అందిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో … Read more

సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,బండి మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం తెలిపారు.జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో సాయంత్రం సైబర్ క్రైమ్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నేను సైతం కార్యక్రమంలో సోలార్ సీసీ కెమెరాల పట్ల ప్రజల మరింత బాధ్యతగా ముందుకు వెళ్లాలని,దాతలు సహకరించాలని,మంచి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారులు జలీల్,సోని,బ్లూ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఆనందోత్సహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.2003-04 సంవత్సరం లో పదవ తరగతి చదివిన విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాటి పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరడంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి. అనంతరం అప్పటి  ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపకలను అందజేశారు.20 … Read more

రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా,కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున,రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు  రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను బందు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని,ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి … Read more

ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో అన్నిరకాల సౌకర్యాలు చేపడుతున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక,సైదాపూర్ మండలాల పరిధిలోగల ఎంజెపిబిటి బాలుర పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వసతులపై ఆరాతీసి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.గతానికంటే భిన్నంగా విద్యార్థుల డైట్ విషయంలో అనేక రకాల చర్యలు … Read more

దోషులను కఠినంగా శిక్షించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో గురువారం రాత్రి శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రజక యువజన సంఘం జిల్లా నాయకులు కైలాసకోటి గణేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా పత్రిక ప్రకటనలో గణేష్ మాట్లాడుతూ రజక కుల బాంధవుడు శ్రీ మల్లేశ్వర స్వామి విగ్రహాల ధ్వంసం చేసి రజక కుల బాంధవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.తెలంగాణ రాష్ట్రంలో   … Read more