నూతన మార్కెట్ కార్యదర్శి మల్లేశంకు సహకరిస్తాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బదిలీపై వచ్చిన ఆర్. మల్లేశంకు సంపూర్ణంగా సహకరిస్తామని జమ్మికుంట అడ్తిదారుల సంఘం, దాడ్వాయిల  సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం భవనంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న గుగులోతు రెడ్యా నాయక్ కు వీడ్కోలు పలుకుతూ.. నూతన కార్యదర్శి మల్లేశంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీగా సమస్తవంతంగా రెడ్డి నాయక్ పని చేశారని … Read more

క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మడిపల్లి  గ్రామంలో క్లోరోఫీల్ ఆర్గానిక్స్ వారు పత్తి  మరియు వరి పొలాలపై అవగాహన సదస్సు  నిర్వహించారు.వరిలో వచ్చే మొగి పురుగు,అగ్గి తెగులు నివారణకు మరియు వరిలో అధిక పీలికలు రావడానికి వసుధ 1కేజీ  మరియు క్లెన్సర్ 4కేజీ మోగి పురుకు గుళికలు వరిలో వచ్చే అగ్గి తెగులు + జింక్ + పురుగు నివారణకు మరియు పత్తి పంటలో రసం పీల్చే పురుగులకు  కాయ తొలుచు పురుగులకు గోల్డ్ లీఫ్,విటమిన్ ఎస్పీ ప్రొడక్ట్స్  రైతులు … Read more

జగ్గయ్యపల్లిలో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని జగ్గయ్యపల్లిలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని మహిళా సంఘాలతో స్వచ్చదనం గురించి అవగాహన కల్పించారు.అయిదు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాలలో పరిశుభ్రతకు వర్షాకాలం కావడంతో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ దగ్గర వేసిన ముగ్గుల పోటీ కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమములో గ్రామ స్పెషల్ ఆఫీసర్ శైలజా దేవి,పంచాయతీ కార్యదర్శి స్వప్న ప్రియ,ఏఎన్ఎం శ్యామల,కారోబర్ రాజేశ్వర్ రావు,అంగన్వాడి టీచర్లు సంధ్య,రజిత,సీఏ … Read more

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన జీవన్ కుమార్ తన భార్యకు వైద్యం చేయించడం కోసం తన స్తోమత మేరకు డబ్బులు వెచ్చించారు. ఇప్పుడు ట్రీట్‌మెంట్‌కు మరిన్ని డబ్బులు అవసరం కాగా, డబ్బులు లేక … Read more

ఘనంగా తల్లిపాల దినోత్సవం

వీణవంక/ధనాధన్ న్యూస్:వీణవంక  మండలంలోని అంగన్వాడి కేంద్రంలో మండల సెక్టార్ ఇంచార్జ్ శ్యామలదేవి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ ఒరేం శ్రావణి తల్లిపాల దినోత్సవాల్లో భాగంగా పిల్లలకు అన్నప్రాసన  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ పుట్టిన పాపకు తల్లిపాలనే తాగించాలని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

విద్యార్థుల జుట్టు కట్ చేసిన ఉపాధ్యాయురాలు

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్‌ చేయడం కలకలం రేపింది.దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.టీచర్ కత్తిరించడంతో విద్యార్దులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరియైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడు వద్ద ఆందోళన చేశారు.ప్రభుత్వ హై స్కూల్ లో 6,7,8,9,10 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌ టీచర్ కత్తెరతో … Read more

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వృత్తి రీత్యా తాడిచెట్లు ఎక్కి జీవనం సాగించే గౌడ కులస్తులు నిత్యం ప్రమాదాలు జరగడం కొంత బాధ కలిగిస్తుందని,ఇటీవల జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో మాచర్ల నాగేశ్వర్ గౌడ్ మృతి తీవ్ర బాధను కలిగించిందని,వారికి అండగా నిలవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక … Read more

నిరుపేదల నివేషణ స్థలంలో డంపింగ్ యార్డ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275,76,77,78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివేషణ స్థలం మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది.ఈ స్థలాలలో  కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు.స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను … Read more

అక్బరుద్దీన్ ఓవైసీ కీ ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: హైద‌రాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని,ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణ గుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లా డుతూ.. అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానిం చారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి దగ్గరుండి నామినే షన్ వేయిస్తానని..గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు.కాగా,అంతకు ముందు … Read more

మాజీ జెడ్పిటిసి కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికీ చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జెడ్పిటిసి గుండారపు శోభ శ్రీనివాస్ తల్లి గుండారపు కనకమ్మ ఇటీవల మరణించడంతో  కుటుంబాన్ని మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ,మాజీ ఎంపిటిసి చాడా చైతన్య కొండల్ రెడ్డి,మాజీ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్,గ్రామ అధ్యక్షులు తాళ్లపెళ్లి వెంకటేశం,యూత్ కాంగ్రెస్ నాయకులు పూదారి హరీష్ గౌడ్,బోనగిరి అనిల్,మాడెపు రాహుల్ … Read more