నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే … Read more

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 13వ వర్థంతి

రాజకీయ దురంధరుడు,స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని,వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానలు పొంది వారికి సేవ చేస్తాననీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు,మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు ఆరపల్లి మోహన్ పాల్గొన్నారు.ఈ … Read more

వరద బాధితులను ఓదార్చిన వోడితల ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 23వ వార్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది.ఈ కాలనీలో దాదాపు 300 మంది బుడగ జంగాల ప్రజలు,పిల్లాపాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాల నుండి నిరుపేద జీవితాలను గడుపుతున్నారు.నిన్న మొన్నటి భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో కూరుకుపోవడంతో వస్తువులు, దుస్తులు,పక్క బట్టలు,రేషన్ బియ్యం ఇతర … Read more

క్రీ.శే.బెజగం చంద్రమౌళి చూపు సజీవం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి నివాసి అయిన బెజగం చంద్రమౌళి ఈ నెల 21 రోజున రాత్రి మృతి చెందడం జరిగింది.సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి  నేత్రదానంపై అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో, వరంగల్  ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన  కుమారుడు కోడలు బెజగం రమేష్,జ్యోతి లకు,కూతుర్లు అల్లుండ్లు రజిత,సుధాకర్ … Read more

ఉమెన్స్ కమిషన్ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన కరీంనగర్ సెర్ప్ నాయకులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెర్ప్ నాయకులు సోమవారం బుద్ధ భవన్ లోని తన చాంబర్లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుర్రం రమేష్ గౌడ్,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మొలుగూరి సంపత్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అనపురం రమేష్ గౌడ్,కరీంనగర్ జిల్లా నాయకులు గంప సంపత్ కళ్ళపెళ్లి మల్లేశంలు ఉన్నారు.

గమనిస్తూ వానకాలం గడిపేయ్..
కనిపెడ్తూ ప్రమాదాలు అరికట్టేయ్..

అనపురం రమేశ్ ఎంఏ రచయిత. ఈగలతో ఇబ్బందులుంటయ్ ఈగ కాలం కదాదోమలతో దొబ్బులాటలుంటయ్ దోమ కాలం కదా కప్పలు బెక బెక మంటయ్బురుద కాలం కదావానపాములు తిర్గుతయ్ వాన కాలం కదానేల మీద ఎప్పుడు నడిచినట్టేనడువకు చూసుకుంట నడువ్ లేకపోతే కాళ్ళు రెక్కలు ఇర్గుతయ్ పాకురు పట్టి వుంటుంది కదా నేల జాగ్రత్తరైతులు పొలాల వద్ద కరెంట్ పోల్లకాడ పైలంపాతిండ్లు గోడలపొంటి పెద్దచెట్ల తోటి భద్రం.సైకిల్ బైక్ ల ప్రయాణం చేసేటోల్లు నిమ్మలం వాన కాలమెల్లేదాక మురికి … Read more

రైతు ఋణమాఫి పట్ల యువజన కాంగ్రెస్ సంబరాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు బ్యాండు భాజాలతో, టపాసులు కాల్చి మిఠాయిలు పంచినృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు  మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన మరియు యువజన కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.రైతు రుణ మాఫీకి కృషిచేసిన … Read more

గీత కార్మిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మాచర్ల నగేష్ గౌడ్ బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందాడు మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.అదేవిధంగా సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటివరకు … Read more

జర కరుణించ రాదమ్మ వానమ్మా
ఎదురు సూడవట్టే నీకై నేలమ్మా

అనపురం రమేశ్ గౌడ్ ఎంఏ. ఆ పాదాలు బురదలో దిగితేనే అన్నం మెతుకులు లేకుంటే అన్నమో రామచంద్రా ఆ చేతులు మట్టిని తాకితేనేఆకలి దూరంలేకుంటే ఆగం బతుకులుఆ శరీరం వానలో తడుస్తనేలోకానికి ఆశలులేకుంటే అడియాశలు ఆ జీవి పోలంలోన సెమట చిందిస్తేనేజనాలకు వెలుగులులేకుంటే చిమ్మ చీకట్లుఆ జీవి ఆరుగాలం శ్రమిస్తేనేఅందరికీ ఆనందంలేకుంటే ఆకలి కేకలుమరి ఆ జీవికి ఎన్ని ఇక్కట్లో వాన చినుకుల కోసం ఎదురు చూపులు పెట్టుబడి కోసం పడిగాపులుఅతివృష్టి అనావృష్టిల పోరాటంవిషపురుగులతో చెలగాటంలోకం కోసం … Read more

బిస్లరీ వాటర్ ప్లాంట్ ను సందర్శించిన స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట లోని బిస్లరీ వాటర్ ప్లాంట్ ను స్రవంతి జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులు మంగళవారం సందర్శించినట్లు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు తెలిపారు..ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ బిస్లరీ వాటర్ ప్లాంట్  సందర్శించిన సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ తయారీ, ప్యాకేజింగ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారని తెలియజేశారు. కార్మికులు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎలా పని … Read more