సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి

సైదాపూర్ మండలం దుదేనపల్లి గ్రామంలోని  పెద్దమ్మ తల్లి దేవస్థానంలోని గుడి చుట్టూ సిసి రోడ్ పనులను బుధవారం రోజున ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గుండారపు శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుదేదనపల్లి గ్రామ ఎంపీటీసీ చాడ చైతన్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి చిన్న వెంకటేశం,కాంగ్రెస్ కార్యకర్తలు,ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజ్ కులస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

పచ్చదనం పరిశుభ్రత,మానవ సంబంధాలపై అవగాహన కల్పించాలి

ఎన్ఎస్ఎస్  వాలంటీర్లు ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత  మానవ సంబంధాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సైదాపూర్ ఎంపీపీ , ఎంపీటీసీల  పోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు.సోమవారం రోజున మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో సింగపూర్ లోని వీఎస్ఆర్  డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఎన్ఎస్ఎస్  వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజాన్ని రక్షించేది సమాజాన్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత ( … Read more

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం

సైదాపూర్ మండలానికి చెందిన వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలకు గత మూడు నెలలుగా వేతనాలు రాక మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని,ఈఎంఐ చెల్లింపులు పిల్లల కళాశాల ఫీజులు,మా ఆరోగ్యరీత్యా మెడిసిన్ ఖర్చులు,మారోజు వారి రవాణా ఖర్చుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని,మాకు వెంటనే డిసెంబర్,జనవరి,ఫిబ్రవరి మూడు మాసాల వేతనాలను విడుదల చేసి మాఖాతాలో జమ చేయగలరని  గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాతకి తెలంగాణ రెండవ ఏఎన్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం … Read more

గోడిశాల గ్రామాన్ని సందర్శించిన ఎన్ఆర్ఎస్ సైంటిస్టులు

సైదాపూర్ మండలంలోని  గొడిశాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను చూడడానికి నేషనల్ రిమోట్  సెన్సింగ్ (ఎన్ఆర్ఎస్) నుండి జోషి, బూర్ల అనిల్ కుమార్ సైంటిస్టులు మరియు సిఆర్డి నుండి అభయ్ కుమార్ వచ్చారు.ఈ కార్యక్రమంలో  భాగంగా ఫారం పాండ్స్, భూగర్భ జలాల పెంపు,ఫీడర్ ఛానెల్స్, వ్యవసాయ సాగు పెరుగుదల, హరితహరం, గ్రామంలో చేపట్టిన హార్టికల్చర్ పండ్ల తోటలు,నర్సరీ,పల్లె ప్రక్రుతి వనాలు,ఇతర ఉపాధి హామీ పథకం పనులను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి … Read more

వరి మొక్కజొన్న యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

సైదాపూర్ మండలంలోనివెన్నంపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రోజున కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి  రైతులకు వరి మరియు మొక్కజొన్న పంటల ఎరువుల యాజమాన్యం,వాటిలో వచ్చు వివిధ రకాల పురుగులు,తెగుళ్ల యాజమాన్యం మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది.డిడిఏ,ఎఫ్టిసి చత్రునాయక్  రైతులకు సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన నేలకు,రైతుకు కలిగే లాభాల గూర్చి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఏవో వైదేహి,ఏఈవో రజిత గ్రామ రైతులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఉడిగే రాజశేఖర్

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కోడం పద్మ(50)  కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్  50 కిలోల బియ్యం సహాయం అందించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా  ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్,సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్, చంద్రమోహన్ పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి పరామర్శ

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి  కేశవేణి రాయమల్లు(89) అనారోగ్యంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం రోజున పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్  25కిలోల బియ్యం అందజేయడం జరిగిందని,గ్రామ ప్రజలకు ఎల్లవేళలా  ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పేసరు సంపత్,నీల కృష్ణ,అప్పాల మల్లేష్,కుందేళ్ళ సమ్మయ్య,పర్షవేణి విజయ్,టి శ్రీనివాస్,పొన్నం వెంకటయ్య,కేశవేణి బాలయ్య  పాల్గొన్నారు.

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే తాట తిస్తాం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఉరుకునేది లేదని హుస్నాబాద్ నియెజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్ ఒక ప్రకటన లో హెచ్చరించారు.ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నరని ఎద్దేవా చేశారు.ఉద్యమం ద్రోహి కౌశిక్ రెడ్డి అని ప్రజలను బ్లాక్ మెయిల్ … Read more

బాల్యంలోనే చట్టాలపై అవగాహన అవసరం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: బాల్యంలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వెన్కేపల్లి ఎంపిటిసి సభ్యులు, న్యాయవాది జంపాల సంతోష్ తెలిపారు.సురక్షిత బాల్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా స్నేహిత కార్యక్రమం మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమంలో బాలికా,మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.లింగ సమానత్వం, బాలికా శిశు రక్షణ,పిల్లల విద్య, రక్షణ చర్యలపై హింస ప్రభావం,పిల్లలలో డ్రగ్ దుర్వినియోగం నివారణ,సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం,పిల్లల లైంగిక వేధింపుల నివారణ,పోక్సో చట్టం,జీవణా నైపుణ్యాలు,ఆత్మగౌరవం,రక్షణ,శరీర మూల్యాంకనం, ప్రవర్తనా మార్పులు,శరీర సానుకూలత,చైల్డ్ … Read more

ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్యా స్పందన

సైదాపూర్,ధనాధన్ న్యూస్: గ్రామాలల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ యాజమాని ఉడిగే విజయ రాజశేఖర్ లు తెలిపారు.ఆదివారం కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ అధ్వర్యంలో వాసుదేవా హస్పిటల్ కరీంనగర్ వారి సహాకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.ఈ సందర్భంగా ఉడిగే రాజశేఖర్ మాట్లాడుతూ మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ ఆధ్వర్యంలో ప్రజల … Read more