సులోచనాదేవి దంపతులు శేషజీవితం హాయిగా గడపాలి

జమ్మికుంట మార్చ్ 31:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి టీచర్ చదువు సులోచనాదేవి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. జెడ్పీహెచ్ఎస్ పొత్కపల్లి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్య కమిటీ, హెచ్ఎంలు,స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు విద్యార్థులు,పుర ప్రముఖులు,రాజకీయ నాయకులు,విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 37 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన … Read more

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం

హుజురాబాద్ మార్చ్ 31:హుజురాబాద్ ప్రధాన తపాల కార్యాలయంలో పోస్ట్ మేన్ గా విధులు నిర్వర్తిస్తున్న ముంజాల సంపత్ పదవి విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సంపత్,రమాదేవి దంపతులను బంధువులు, సహచర ఉద్యోగులు పూల మాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.హుజురాబాద్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఊకంటి మహేందర్ మాట్లాడుతూ పోస్టల్ కార్యాలయంలో సంపత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ మంచి పేరు … Read more

జగ్గయ్యపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

జమ్మికుంట మార్చ్ 31:చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాలా వ్వాప్తిలో ఉంది.ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం.పల్లెల్లోని యువకులు,కళా అభిమానులు కలిసి ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.అలాంటి కళారూపాన్ని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు తెలిపారు.రామాయణ కళాకారుడు,కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బోల్ల కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ … Read more

గురుకుల పాఠశాలల నూతన భవనాలు నిర్మాణం ఎప్పుడు?

సైదాపూర్ మార్చ్ 30:సైదాపూర్ మండల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల హుజురాబాద్ మండల కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న దాన్ని వెంటనే మంత్రి స్పందించి గురుకుల పాఠశాలను సైదాపుర్ లోనే నూతన భవనం నిర్మించాలని  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ కోరారు.వెంకటేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కోనసాగుతన్నాయని నూతన భవనాలు నిర్మించాలని,ఎన్ని మార్లు కోరినా పట్టించుకోలేదని  గత కొన్ని సంవత్సరాలుగా సైదాపూర్ గురుకుల పాఠశాల హుజురాబాద్ … Read more

కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్

జమ్మికుంట మార్చ్ 30:జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి, ఆయన వర్గీయులు శనివారం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.దేశిని స్వప్న-కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను 1995నుండి కాంగ్రెస్ పార్టీ కార్య కర్తగా పని చేశానని,ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ … Read more

ప్రణవ్ బాబు కు సోలార్ ఫ్యాన్ టోపీని బహూకరించిన సాదుల రాంబాబు

వేసవి కాలంలో వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కాంగ్రెస్ వీరాభిమాని సాదుల రాంబాబు దుబాయ్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన సోలార్ ఫ్యాన్  పరికరంతో క్యాప్ లో ఇమిడే విధంగా సోలార్ ఫ్యాన్ తయారుచేసి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ కు సింగపూర్ లోని తన నివాసంలో బహుకరించారు.అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోలార్ ఫ్యాన్ టోపీని ఉగాది సందర్భంగా అందజేసేందుకు అవకాశం కల్పించాలని ప్రణవ్ ను కోరారు.వెంటనే స్పందించిన ప్రణవ్ ముఖ్యమంత్రి … Read more

హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గోస్కుల శ్రీనివాస్

హుజురాబాద్ మార్చ్ 28:న్యాయవాదుల సంఘం కు గురువారం జరిగిన ఎన్నికలలో హుజురాబాద్ అధ్యక్షునిగా గోస్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా బండి రమేష్,ప్రధాన కార్యదర్శి గా మట్టెల తిరుపతి , లైబ్రరీ సెక్రటరీ అప్పని రాజు, కోశాధికారి గా ఎం దివ్య,సీనియర్ ఎక్సిక్యూటివ్ మెంబర్ గా  పులుగు లింగారెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు కె.భగవాన్ రెడ్డి, సికె జేమ్స్,ఎన్. సత్యనారాయణలు తెలిపారు.మొత్తం 115   మంది ఓటర్లకు గానూ 113 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అధ్యక్ష పదవికి  పోటీ … Read more

జయత్ జయత్ సినిమాని ప్రారంభించిన ప్రణవ్

హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం జయతు జయతు సినిమా షూటింగ్ నిర్వహించారు.సినిమా షూటింగ్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సినిమా దర్శక, నిర్మాతలు యూనిట్ సభ్యులను అభినందించారు. గ్రామంలో షూటింగ్ కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులున్నారు.

గ్రామానికి అండగా విగ్రహ ప్రతిష్టాపనలు

వీణవంక మార్చ్ 27:వీణవంక మండలంలోని చల్లూరు,మామిడాలపల్లి  పలు దేవాలయాల్లో,దేవాలయ ఉత్సవాల్లో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వోడితల ప్రణవ్  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.చల్లూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక, బ్రహ్మోత్సవాలలో చివరి రోజు భాగంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు వేదమంత్రాలతో  హారతి సమర్పిస్తూ బ్రాహ్మణ ఆశీర్వచనాలు అందజేశారు.రథోత్సవం  సందర్భంగా రథంపై టెంకాయ కొట్టి పూజలు జరిపారు. అనంతరం అదే గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో  జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు పాల్గొని,మహిళలతో … Read more

బీఎస్పీ జిల్లా అధ్యక్షులుగా దొడ్డే శ్రీనివాస్ నియామకం

కరీంనగర్ మార్చ్ 27:జమ్మికుంట మండలం పెద్దoపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డె శ్రీనివాస్ ను బహుజన సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా  అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఉత్తర్వులు జారీచేశారు.మంగళవారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో దొడ్డె శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షునిగా నియమించారు. శ్రీనివాస్ పెద్దంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గా పనిచేశారు.2007లో బహుజన సమాజ్ పార్టీలో చేరిన ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా,హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా,ఇన్చార్జిగా … Read more