బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 2:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ వెనుక కారణాలు ఇటీవల కాలంలో కవిత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణలో లోపం ప్రదర్శించినందుకు … Read more

చెన్నూర్ ఎస్బీఐలో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం – 44 మంది అరెస్టు

చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 23న ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు పోలీస్‌లు దర్యాప్తు చేసి, ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ (క్యాషియర్) ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టి, నష్టాన్ని పూడ్చుకునేందుకు బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల … Read more

కౌశిక్ రెడ్డి దృష్టి చిల్లర రాజకీయాల మీద-మా దృష్టి అభివృద్ధి మీద

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కేసీఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని,అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య,వైద్య … Read more

నాకు ప్రాణహాని ఉంది

శంకరపట్నం/ధనాధన్ న్యూస్: శంకరపట్నం మండలం, మొలంగూర్ (గుడాటిపల్లె) గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భూ వివాదాల నేపథ్యంలో గుర్రం సంజీవ్ రెడ్డి, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి తమకు న్యాయం కావాలని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. శ్రీధర్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, 2006లో గుర్రం కిషన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి తమ తండ్రి పెద్ద మల్లారెడ్డికి సర్వే నెం. 231లో 8 … Read more

రసమయి బాలకిషన్ నోరు అదుపులో పెట్టుకో

కరీంనగర్/ధనాధన్ న్యూస్: ఇందిరమ్మ ఇండ్ల పైన మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి పైన రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.  స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనలో మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న … Read more

సైదాపూర్ వైద్యాధికారి పై వేటు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి గత కొద్ది నెలలుగా విధుల పట్ల నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కృష్ణ కుమార్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వేటు వేశారు.మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా కృష్ణ కుమార్  వీధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయన … Read more

జాతీయజెండాను అవమాన పరిచిన పంచాయతీ కార్యదర్శి

సైదాపూర్ మండలంలోని సోమవారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించే క్రమంలో జెండా ఊడి నేలపై పడింది.గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం ద్వారానే జాతీయ జెండా ఆవిష్కరించే క్రమంలో నేలపై పడ్డది అని జాతీయ జెండా అవమాన పరిచిన పంచాయతీ కార్యదర్శి ఊసకోయిల రాజీవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ ని కోరారు.పంచాయతీ కార్యదర్శి రాజీవ్ మండలంలోని సీనియర్ నాయకుడి కి కుటుంబ సభ్యుడు కావడం వల్ల,ఏం జరిగినా ఆయన చూసుకుంటాడనే ధోరణి తో తన … Read more

నువ్వు మొగోడివి అయితే.. రాజీనామా చేసి మళ్ళీ గెలువు

ఫైల్ ఫోటో హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన దాడిని ఖండిస్తున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వారు మాట్లాడుతూ పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర పనులు ఏరోజు చేయలేదని పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెట్టే ఎమ్మెల్యే తను ఏ పార్టీ నుంచి ఫిరాయించి బిఆర్ఎస్ లో చేరాడో తెలుసుకోవాలని సూచించారు.సంవత్సరం గడుస్తున్నా కౌశిక్ రెడ్డికి అధికారం మదం … Read more

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా బోడిగె శ్రీకాంత్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట మండల అధ్యక్షునిగా 21 మంది పోటీ చేయగా ఆ ఫలితాలను యువజన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిసెంబరు 4 బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 870 మెజారిటీ ఓట్లతో జమ్మికుంట పట్టణానికి చెందిన బుడిగె శ్రీకాంత్ హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో … Read more