జమ్మికుంటలో బీజేపీ ముమ్మర ప్రచారం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే10:జమ్మికుంట పట్టణంలోని మోత్కల గూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వెనక్కిపోయిన భారతదేశాన్ని,కేవలం పది సంవత్సరాలలోనే ప్రపంచం లో దేశాన్ని ముందు వరుసలో ఉంచాడని ఆకుల రాజేందర్ అన్నాడు.ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్  అధ్యక్షులు పొనగంటి రవి,ఆకుల కిషన్,రావుల మహిపాల్,ఆకుల పోచయ్య, తాటి కంటి మల్లేశం,పొనగంటి సతీష్, పొన్నగంటి  ప్రశాంత్,మల్లయ్య,ఆదర్శ్, అరుణ్,విజయ్,వెంకటేష్,అంజి,దేవ ప్రకాష్, ఉయ్యాల శ్రీనివాస్,మధు పాల్గొన్నారు.జై బీజేపీ,జై మోడీ,జై బండి … Read more

నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన జీడి మల్లేష్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే 09:బుధవారం బిజెపి బహిరంగ సభకు వేములవాడ కు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి హెలిప్యాడ్ వద్ద బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ స్వాగతం పలకడం జరిగింది.నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని,అంత గొప్ప నాయకున్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని,ఈ అవకాశం కల్పించిన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి లకు మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు.బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు.సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు … Read more

అవాస్తవాల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్):జమ్మికుంట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనికిమాలిన రాజకీయ ఉపన్యాసం చేశారనీ, రిజర్వేషన్ల అంశంపై అవాస్తవాలను ప్రచారం చేయడానికి సీఎం బ్రాండ్ అంబాసిడర్ గా మారారని బిజెపి జిల్లా అధ్యక్షుడి గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు.జమ్మికుంటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులాలను రెచ్చగొడుతున్నాడనీ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం మాట్లాడారు, వాస్తవమేందో ఆ వాస్తవమైందో తెలుసుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమన్నారు.సోషల్ మీడియాలో … Read more

జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన మానకొండూర్ వీధులు

మానకొండూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 24:జై శ్రీరామ్ నినాదాలతో మానకొండూర్ పుర వీధులు మారుమ్రోగాయి.మానకొండూర్ మండలంలో బాలాంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ ఐక్యత బైక్ ర్యాలీని నిర్వహించారు.యువకులంతా కాషాయ జెండాలతో జైశ్రీరామ్ నినాదాలతో మానకొండూరు వీధులలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి దేవాసాని సంపత్,సొల్లు అజయ్ వర్మ, ఎడబోయిన రామకృష్ణారెడ్డి,మియాపురం లక్ష్మణాచారి,కత్తి ప్రభాకర్ గౌడ్,కంది రాజు రెడ్డి, … Read more

పొన్నంకు బండి భయం పట్టుకుంది

వీణవంక(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 22:వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో బిజెపి జిల్లా,మండల నాయకులు పర్యటించి రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం చేయవలసిన పనుల గురించి గ్రామ నాయకులకు,కార్యకర్తలకు పలు సూచనలు చేయడం జరిగింది.అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ పార్లమెంటు కు బండి సంజయ్ ఏమీ అభివృద్ధి చేయలేదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి నాయకులు తీవ్రంగా ఖండించారు.తెలంగాణ … Read more

మల్కాజ్గిరి పై..ఆధిపత్యం ఎవరిది.?

హైదరాబాద్ (ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ … Read more

దళిత సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ లో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కొంకటి  రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా సమావేశానికి ముఖ్య అతిథి గా కరీంనగర్ పార్లమెంట్ ఎస్సి మోర్చా ఎన్నికల కన్వీనర్ జాడి బాల్ రెడ్డి హాజరయ్యారు.మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెలలో కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో ఎస్సి మోర్చా దళిత సమ్మేళనం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి జాతీయ … Read more

మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:5000 కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏభూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పొన్నగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి,ఆకుల రాజేందర్ లు మాట్లాడారు.ఈ నెల … Read more

ప్రజా సమస్యల పరిష్కారమే నా ద్యేయం

జమ్మికుంట ఏప్రిల్ 08:కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస అన్నారు.సోమవారం ఆమె జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.తాను తొలుత తన సమస్యల పరిష్కారానికి మాత్రమే పోరాటం చేశానని, ఈ క్రమంలో చాలా మంది యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారని చెప్పారు.తన ఊరిలో మాత్రమే కాకుండా రకరకాల సమస్యలతో చాలా కుటుంబాలు … Read more