యువతరమా జర మేలుకో..నీ దేశాన్ని ఏలుకో..!

ఎడిటర్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:ఓ పక్క దేశంలో ఎన్నికలు జరుగుతుంటే, యువత క్రికెట్ సంబరాల్లో మునిగిపోతుంది.. రాజకీయపార్టీలకు బాండ్ల రూపంలో వందలకోట్లు విరాళాలు సమర్పించే కార్పొరేట్ వ్యవస్థలు ఈ దేశ సంపదను దోచుకుంటుంటే! అవేమి పట్టనట్టుగా యువత క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తున్నారు.రక్షించేవాడు లేక చెరువులు, భూములు కబ్జాల పాలవుతుంటే! అడిగేవాడే లేదని విర్రావీగుతున్న అవినీతి నాయకుల అకలి, మనుషుల శవాలను తిన్నా తీరేది కాదు.. రాజకీయాల్లో రాణించాలన్న ఆశ, దేశ ప్రజల పక్షాన నిల్చోవాలన్న కోరిక లేని … Read more

జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన మానకొండూర్ వీధులు

మానకొండూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 24:జై శ్రీరామ్ నినాదాలతో మానకొండూర్ పుర వీధులు మారుమ్రోగాయి.మానకొండూర్ మండలంలో బాలాంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ ఐక్యత బైక్ ర్యాలీని నిర్వహించారు.యువకులంతా కాషాయ జెండాలతో జైశ్రీరామ్ నినాదాలతో మానకొండూరు వీధులలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి దేవాసాని సంపత్,సొల్లు అజయ్ వర్మ, ఎడబోయిన రామకృష్ణారెడ్డి,మియాపురం లక్ష్మణాచారి,కత్తి ప్రభాకర్ గౌడ్,కంది రాజు రెడ్డి, … Read more

పొన్నంకు బండి భయం పట్టుకుంది

వీణవంక(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 22:వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో బిజెపి జిల్లా,మండల నాయకులు పర్యటించి రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం చేయవలసిన పనుల గురించి గ్రామ నాయకులకు,కార్యకర్తలకు పలు సూచనలు చేయడం జరిగింది.అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ పార్లమెంటు కు బండి సంజయ్ ఏమీ అభివృద్ధి చేయలేదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి నాయకులు తీవ్రంగా ఖండించారు.తెలంగాణ … Read more

మల్కాజ్గిరి పై..ఆధిపత్యం ఎవరిది.?

హైదరాబాద్ (ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ … Read more

దళిత సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ లో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కొంకటి  రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా సమావేశానికి ముఖ్య అతిథి గా కరీంనగర్ పార్లమెంట్ ఎస్సి మోర్చా ఎన్నికల కన్వీనర్ జాడి బాల్ రెడ్డి హాజరయ్యారు.మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెలలో కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో ఎస్సి మోర్చా దళిత సమ్మేళనం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి జాతీయ … Read more

మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:5000 కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏభూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పొన్నగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి,ఆకుల రాజేందర్ లు మాట్లాడారు.ఈ నెల … Read more

ప్రజా సమస్యల పరిష్కారమే నా ద్యేయం

జమ్మికుంట ఏప్రిల్ 08:కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస అన్నారు.సోమవారం ఆమె జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.తాను తొలుత తన సమస్యల పరిష్కారానికి మాత్రమే పోరాటం చేశానని, ఈ క్రమంలో చాలా మంది యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారని చెప్పారు.తన ఊరిలో మాత్రమే కాకుండా రకరకాల సమస్యలతో చాలా కుటుంబాలు … Read more

ఘనంగా భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

మానకొండూర్ ఏప్రిల్ 06:భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానకొండూరు మండలంలోని అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ జెండాలను ఆవిష్కరించి టిఫిన్ బయట కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా మానకొండూర్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ బిజెపి జెండా ఆవిష్కరించారు.అనంతరం సీట్లు పంపిణీ చేశారు.అనంతరం కార్యకర్తలు అందరితో కలిసి టిఫిన్ బయట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం గర్వకారణం అని … Read more

గురుకుల పాఠశాలల నూతన భవనాలు నిర్మాణం ఎప్పుడు?

సైదాపూర్ మార్చ్ 30:సైదాపూర్ మండల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల హుజురాబాద్ మండల కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న దాన్ని వెంటనే మంత్రి స్పందించి గురుకుల పాఠశాలను సైదాపుర్ లోనే నూతన భవనం నిర్మించాలని  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ కోరారు.వెంకటేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కోనసాగుతన్నాయని నూతన భవనాలు నిర్మించాలని,ఎన్ని మార్లు కోరినా పట్టించుకోలేదని  గత కొన్ని సంవత్సరాలుగా సైదాపూర్ గురుకుల పాఠశాల హుజురాబాద్ … Read more

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి

కరీంనగర్ మార్చ్ 23:ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93 వ వర్ధంతిని పురస్కరించుకొని బోయవాడలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి, నేటి యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సామ్రాజ్యవాద పాలకుల విధానాలపై గళం విప్పేందుకు యువత నడుం బిగించాలన్నారు.భారతదేశంలో 1907 సెప్టెంబర్‌ 28న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా … Read more