సిరిసేడు గ్రామపంచాయతీ పాలక మండలి కి పదవి విరమణ సన్మానం.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ పంచాయతీ పాలకమండలికి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి అంకుస్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ గ్రామంలో అన్ని వీధులకు సిసి రోడ్లు, … Read more

రెండవ విడత దళిత బంద్ వెంటనే విడుదల చేయాలి.

దళితబందు రెండవ విడత మంజూరు చేయాలనీ ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు దళితబంద్ లబ్ధిదారులు వినతిపత్రం అందించడం జరిగింది. 2021 సంవత్సరంలో బీ అర్ ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు గా ప్రవేశపెట్టిన దళితబందు హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రతి కుంటుంబానికి 10లక్షల చొప్పున వారి వారి ఖాతాలలో జమచేయడం జరిగింది.మొదటి విడతగా 5లక్షలు రెండవ విడిడతగా 5లక్షలు ఇస్తామని కలెక్టర్ చెప్పడం జరిగింది.కానీ అనుకోకుండా ఎన్నికల నియామావలి రావడంతో దళితబందు ని … Read more

పెరకపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సర్పంచ్ బత్తుల కొమరయ్య.

సైదాపూర్ మండల కేంద్రంలోని పెర్కపల్లె గ్రామంలో పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ బత్తుల కొమరయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించిన ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని జంట గ్రామాలు అయిన గొల్లగూడెం పెర్కపల్లి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించడం కోటి రూపాయలతో వాడ వాడకు సిసి రోడ్డు నిర్మాణం చేయడం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలనలో … Read more

బిజిగిరి దర్గాలో ప్రత్యేక పూజలు.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు,పేద ప్రజలకు అన్నదానం,కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలోని దర్గాలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎండి సలీం పాషా,మాజీ జెడ్పీటిసీ అరుకాల వీరేశలింగం,జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు … Read more

బీఆర్ఎస్ పార్టీకి జమ్మికుంట కౌన్సిలర్ల రాజీనామా.

జమ్మికుంట మున్సిపాలిటీ కి చెందిన 13 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన వారిలో బొంగోని వీరన్న,మారపెల్లి బిక్షపతి, మేడిపల్లి రవీందర్,ఎలాగందుల స్వరూప,పిట్టల శ్వేత, పొనగంటి రాము,పొనగంటి సారంగం,బిట్ల కళావతి,కుతాడి రాజయ్య,దేశిని రాధ,గుళ్లి పూలమ్మ,దిడ్డి రాము,రావికంటి రాజ్ కుమార్ ఉన్నారు.మున్సిపాలిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ల వైఖరిలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నామని లేఖలో తెలిపారు.

కాంగ్రెస్ లోకి జమ్మికుంట బీఆర్ఎస్ కౌన్సిలర్లు.

జమ్మికుంట మున్సిపాలిటీ లో మళ్ళీ కలవరం మొదలైంది.మొన్నటి వరకు చైర్మన్ పై అవిశ్వాసం తో పరిపాలన అస్తవ్యస్తంగా జరిగింది. మొన్నటి వరకు ఒక వర్గం లో ఉన్న 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేడు కాంగ్రెస్ లో చేరడానికి హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బీ ఫామ్ హామీతో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు సమాచారం.మొన్నటి వరకు పెట్టిన అవిశ్వాసం లో కీలక పాత్ర వహించిన కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో … Read more

కుల సంఘ భవనాలకు లక్కీ డ్రా తీసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ లో కుల సంఘాల లక్కీ డ్రా లో పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారమే నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో కుల సంఘాల భవనాలు కట్టించారని అన్నారు. కుల సంఘాల భవనాలను గతంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారని ఆయన అన్నారు. కుల సంఘాల … Read more