మంత్రి పొన్నంని సన్మానించిన దేశిని కోటి

కరీంనగర్ లోని వి కన్వెన్షన్ హాల్ లో ఆదివారం జరిగిన గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి గజామాలతో శాల్వతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేశిని కోటిని మంత్రి దగ్గరికి తీసుకోని గుండెలకు హత్తుకున్నారు.నాటి నుండి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో తడక శ్రీకాంత్,నేరెళ్ళ మహేందర్ గౌడ్,బొంగొని వీరన్న,దేశిని సదానందం,శ్రీపతి నరేష్,పైడిపల్లి ఆనందం,రామ్మూర్తి,బుర్ర సంపత్,అయోధ్య గౌడ్,  సదానందం,రమేష్,తదితరులు పాల్గొన్నారు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు మురికి పూర్ణిమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో డాక్టర్ హేమలత, వావిలాల కొత్తూరు జయశ్రీ,వికారాబాద్ ప్రవచన రత్న బిరుదాంకితురాలు,గీతా ప్రచారకురాలు విశ్వహిందూ పరిషత్ జిల్లా మాతృ శక్తి సంయోజక భాగ్యలక్ష్మి, ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత చాలా స్వరూప,కొత్తపల్లి డాక్టర్ వాణి, పెళ్లి అరుణాదేవి,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ డాక్టర్ జంధ్యం మాధవి,ఆదర్శ రైతు ఆస్కార్ అవార్డు గ్రహీత,వాసవి … Read more

సిరిసేడు లో వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వరస్వామి శివాలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య కనులపండువగా జరిగింది.ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలయ కమిటీ ఛైర్మన్ కొండ విజయ్ స్వగృహం నుండి మేళతాలల మధ్య ముత్యాల తలంబ్రాలు మోసుకెళ్లి శివాలయంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణానికి సమర్పించారు.అనంతరం పాడి కౌశిక్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక అర్చన,అభిషేకాలు చేశారు.ఈ సందర్భంగా వేదపండితులు … Read more

మహాశివరాత్రి రుద్రహోమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు,రుద్ర హోమం,రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రుద్ర హోమం చేశారు.. ఆలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వొడితల … Read more

గంగిరెద్దుల భవనానికి భూమి పూజ

హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కొరకు 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఇందిరానగర్ మాజీ కోడిగూటి శారద ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి … Read more

శనివారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం

సైదాపూర్,ఆకునూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మార్చి 9 శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 33/11 కెవి సబ్ స్టేషన్ మరమ్మతుల దృశ్య విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సైదాపూర్ ఏఈ బొమ్మ ఆంజనేయులు గౌడ్ తెలియజేశారు.

రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వ అండదండలు (ఆశీస్సులు) కరువు

1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆబాది జమ్మికుంట మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీళ్లు రాక పంట పొలాలు ఎండుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కన్నేర చేస్తూ రైతులను విస్మరిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతు వ్యతిరేక విధివిధానాలను నిర్వహిస్తూ రైతుకి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ  రైతంగాన్ని నడ్డి విరిచే చర్యలు చేపడుతూ రైతుల కళ్ళల్లో కన్నీళ్లను నింపుతూ పరిపాలన కొనసాగిస్తుందని ఆ … Read more

‘ఓదెల2’ ఫస్ట్ లుక్ రిలీజ్

రెండేళ్ల క్రితం ఒటీటీ లో రిలీజ్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఓదెల2’ పేరుతో సీక్వెల్ తీస్తున్నారు. దీనికి కూడా అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా డైరెక్టర్ సంపత్ నంది రచయిత, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ పోషిస్తున్న ‘ఓదెల 2’ ఫస్ట్ లుక్ను తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చేవరకు పోరాటం ఆగదు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు.సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్‌ డే రోజున ఆడ‌ బిడ్డల ఉద్యోగాల‌కై ధ‌ర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కొచ్చిందని విమర్శించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మహిళలకు అనేక హక్కు లు కల్పించారని చెప్పారు.ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఇవాళ హైదరాబాద్‌ ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేప‌ట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … Read more

బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY)జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ నియామకం

బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY) జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ గారిని నియమిస్తూ బీసీ రాజకీయ పోరాట సమితి (BRPS) రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.బీసీల రాజకీయ అధికారం కోసం,బీసీ నాయకత్వాన్ని పెంపొందించేందుకు నిరంతరం పని చేయాలని సూచించారు.ఎంతో నమ్మకంగా తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ … Read more