అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు ఘనంగా శ్రీమంతం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో శుక్రవారం రోజున అంగన్వాడీ కేంద్రంలో  శుక్రవారం సభ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రాసన,అక్షరాభ్యాసం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీవో ఎండీ బషీరొదిన్ మాట్లాడుతూ గర్భవతులు  క్రమం తప్పకుండా అంగన్వాడి నుంచి పంపిణీ చేస్తున్న  పాలు,గుండ్లు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమం అనంతరం డ్రై డే ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి … Read more

భవిష్యత్తు మున్నేరుపాలు..!!

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హతల సర్టిఫికెట్లు మున్నేరుపాలయ్యాయి.టెన్త్‌ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టుకుపోయాయి.దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.ఖమ్మం నగరం,ఖమ్మం రూరల్‌ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా 50 కాలనీల్లోకి నీరు చేరింది. అందులో కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా..కొన్ని నేలమట్టమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో వెళ్లిపోయారు. వరద తగ్గాక … Read more

బి.సిల హక్కుల కోసం బి.సి న్యాయవాదులు ముందుండాలి

•హుజూరాబాద్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బి.సిల హక్కుల సాధన కోసం చట్టం,న్యాయం, రాజ్యాంగం తెలిసిన బి.సి న్యాయవాదులు ముందుండాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ అన్నారు.బి.సి హక్కుల సాధన ఉద్యమంలో బి.సి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న  తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సును పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ … Read more

సోదరభావం,పవిత్రతే రక్షాబంధన్ సందేశం

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్ ఉద్దేశ్యమని బ్రహ్మకుమారీలు  కల్పన, శ్రీవాణి అన్నారు. శుక్రవారం రాఖీ పండగ విశిష్టతను వివరిస్తూ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పలువురికి రాఖీలు కట్టారు. రాఖీ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అక్కా చెల్లెలు, అన్నదమ్ముల బంధం గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడారు.సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ పరమాత్ముని అవతరణ, దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుందన్నారు. రక్షణ అంటే విలువలను పెంపొందించుకోవడం, … Read more

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు డాక్టర్ల నియామకం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ త్వరితగతిన వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా స్పందించిన కలెక్టర్ ఏరియా హాస్పిటల్ కు నలుగురు వైద్యులు నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడించారు.హుజురాబాద్,జమ్మికుంట ఆసుపత్రులకు 15 లక్షల రూపాయలను వాటి అభివృద్ధి కొరకు కేటాయించేలా కృషి చేశారు.ఆసుపత్రులకు నిత్యం అనేకమంది రోగులు వస్తుంటారు,వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని … Read more

మానసిక దివ్యాంగ విద్యార్థులకు అండగా ఉంటా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా పిల్లలు అల్లరి చేస్తే మనం విసుక్కుంటామని,అలాంటిది దివ్యాంగులైన పిల్లలకు విద్య నేర్పడం,కోచింగ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని దాన్ని  నిర్వహిస్తున్న,శిక్షణ ఇస్తున్న సిబ్బంది గొప్ప మనసు గల వారిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని 8వ వార్డులో గల సాయి మానసిక దివ్యంగుల ప్రత్యేక పాఠశాలను ఆయన సందర్శించారు.పాఠశాలలో నూతనంగా నిర్మించినటువంటి వంటగదిని,పాఠశాలలో మరమ్మత్తు చేసిన ఇతర వాటిని ఆయన … Read more

సర్కార్ దవాఖానలో సౌలతులు ఏవి?

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వా ఆస్పత్రుల్లో ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అనే పరిస్థితి నెలకొంది.ఆస్పత్రుల్లో వైద్యులు సరిపడా కాదు కనీసంగా కూడా లేకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట మండలకేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయల,డాక్టర్‌ల కొరత ఉందని ఏడాది క్రితం నుంచి ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ చెప్తూనే ఉన్నారు. హుజూరాబాద్ … Read more

వర్షాకాలంలో వైరల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో డెంగ్యూ,మలేరియా లాంటి వైరల్ జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ఆ భాధ్యత ఆయా మండలాల ఎంపిడిఓలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.జమ్మికుంట,హుజురాబాద్ మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరారు.ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసరాల్లో చెత్త,నీరు నిల్వఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.అంతేకాకుండా గ్రామాల్లో పారిశుధ్యంపై ఎంపిడిఓలు ఆయా శాఖల అధికారులతో సమన్వయపరుస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని,మిషన్ … Read more

కబ్జా భూమిపై ఆఫీసర్ల సర్వే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో ఉన్న సర్వే నం.467లో గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించిన ఘటనపై అధికారులు కదిలారు.శుక్రవారం జమ్మికుంట తహశీల్దారు జి.రమేష్ బాబు ఆధ్వర్యంలో డివిజన్ డీఐ ఫయాక్ అలీ జమ్మికుంట సర్వేయర్ మనోజ్‌తో పాటు పలువురు సిబ్బంది స్థలాన్ని సర్వే చేయడానికి వెళ్లారు.గత కొద్దిరోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న వార్తలతో పాటు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త గుర్రపు మహేందర్‌గౌడ్ తహశీల్దార్‌కు ఈ … Read more

మండల అధికారులతో ఆర్డీవో సమీక్ష సమావేశం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున మధ్యాహ్నం ఎస్ రమేష్ హుజురాబాద్ ఆర్డీవో మరియు మండల ప్రత్యేక అధికారి బి.శ్రీనివాస్ మండలంలోని వివిధ అభివృద్ధి పనులపై మరియు గ్రామ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం మండల స్థాయి అధికారులు,గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు అంగన్వాడి టీచర్స్ , ఏఎన్ఎంమ్ ,సూపర్ వైజర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు గ్రామాలలో ఉన్న సమస్యలను పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంమ్,ఏడబ్ల్యుటి లను గ్రామాల వారీగా … Read more