గోనె సంచిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని శంభునిపల్లె గ్రామ శివారులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.పోలీసుల అంచనా ప్రకారం, మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని,మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి,గోనె సంచిలో కట్టి,అనంతరం వాహనంలో తీసుకువచ్చి శంభునిపల్లె శివారులో పడేసినట్లు తెలుస్తోంది.కేసు నమోదు చేసి ఈ ఘటనపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హత్యకు గురైన వ్యక్తిని గుర్తించేందుకు మరియు ఈ దారుణానికి … Read more

చెక్ డ్యాం కుంగడంపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాం కుంగిపోయిన సంఘటనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం తీవ్రంగా ఖండించారు. రామభద్ర స్వామి సాక్షిగా బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు.జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రణవ్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైనే చర్యలుచెక్ డ్యాం కుంగడంపై ప్రస్తుతం విచారణ … Read more

ఇసుక మాఫియా చెలరేగిపోతోంది: హరీష్ రావు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, ముఖ్యంగా చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తూ టెర్రరిస్టులను మించిపోయే విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రూ. 24 కోట్లతో నిర్మించిన తనుగుల చెక్‌డ్యామ్‌ను ఇసుక మాఫియా బాంబులతో పేల్చివేయడాన్ని ఆయన ఖండించారు.తనుగుల చెక్‌డ్యామ్‌ను శుక్రవారం సందర్శించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, చెక్‌డ్యామ్‌ను పేల్చివేయడం వేలాది మంది రైతులపై జరిగిన ప్రత్యక్ష దాడి అని … Read more

స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు: ఒడితెల ప్రణవ్ బాబు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా,గ్రామీణ ప్రాంతాల్లోనీ మహిళ స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని,హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 3,952 లబ్ధిదారులకు 3 కోట్ల 83 లక్షల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేసామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ అభివృద్ధి ప్రాధాన్యతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గృహలక్ష్మి,మహాలక్ష్మి లాంటి అనేక … Read more

గురుకులంలో బాలిక మృతి బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజురాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు ఆయన రాంపూర్ గ్రామానికి వెళ్ళి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాలిక తల్లితండ్రులు … Read more

రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వీణవంక/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కుతూ యావత్ ప్రజానీకాన్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు దిశగా చర్యలు చేపట్టాలని యువతకు రాజీవ్ యువ వికాసం పథకం 2025 దరఖాస్తు  ఏప్రిల్ 14,  ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను ఇస్తానని చెప్పి మోసం చేసి నేటి వరకు … Read more

సిరిసేడులో బాడీ ఫ్రీజర్ బాక్స్ వితరణ

ఇల్లందకుంట,అక్టోబర్21: ఇల్లందకుంట మండలం సిరిసేడు ప్రజల అవసరార్థం బాడీ ఫ్రీజర్ బాక్స్ ని షఫీ ఖాన్  తన సొంత నిధులతో కొనుగోలు చేసి మంగళవారం గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ కి వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా షఫీ ఖాన్ మాట్లాడుతూ… తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు సౌకర్యం కోసం సుమారు 61వేల రూపాయల విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ని అందజేసినట్లు తెలిపారు. ప్రజల కోరిక మేరకు భవిష్యత్ లో వైకుంఠ రథం కూడా … Read more

పెన్షనర్స్ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ అక్టోబర్ 10:జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఏఐఆర్ఆర్ఎఫ్, ఎన్సిసిపిఏ, ఫోరమ్ ఆఫ్ నేషనల్ పెన్షనర్స్ అసోసియేషన్, ఎఫ్ ఓ సి పి ఏ పిలుపుమేరకు జమ్మికుంట బ్రాంచి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ అధ్యక్షులు, జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దాసరి రాజేశ్వర్ మాట్లాడుతూ పెన్షనర్స్ యొక్క న్యాయమైన డిమాండ్లు అయినటువంటి పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలి,అందరికి … Read more