వరద బాధితులను ఓదార్చిన వోడితల ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 23వ వార్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది.ఈ కాలనీలో దాదాపు 300 మంది బుడగ జంగాల ప్రజలు,పిల్లాపాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాల నుండి నిరుపేద జీవితాలను గడుపుతున్నారు.నిన్న మొన్నటి భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో కూరుకుపోవడంతో వస్తువులు, దుస్తులు,పక్క బట్టలు,రేషన్ బియ్యం ఇతర … Read more

క్రీ.శే.బెజగం చంద్రమౌళి చూపు సజీవం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి నివాసి అయిన బెజగం చంద్రమౌళి ఈ నెల 21 రోజున రాత్రి మృతి చెందడం జరిగింది.సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి  నేత్రదానంపై అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో, వరంగల్  ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన  కుమారుడు కోడలు బెజగం రమేష్,జ్యోతి లకు,కూతుర్లు అల్లుండ్లు రజిత,సుధాకర్ … Read more

ఉమెన్స్ కమిషన్ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన కరీంనగర్ సెర్ప్ నాయకులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెర్ప్ నాయకులు సోమవారం బుద్ధ భవన్ లోని తన చాంబర్లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుర్రం రమేష్ గౌడ్,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మొలుగూరి సంపత్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అనపురం రమేష్ గౌడ్,కరీంనగర్ జిల్లా నాయకులు గంప సంపత్ కళ్ళపెళ్లి మల్లేశంలు ఉన్నారు.

గమనిస్తూ వానకాలం గడిపేయ్..
కనిపెడ్తూ ప్రమాదాలు అరికట్టేయ్..

అనపురం రమేశ్ ఎంఏ రచయిత. ఈగలతో ఇబ్బందులుంటయ్ ఈగ కాలం కదాదోమలతో దొబ్బులాటలుంటయ్ దోమ కాలం కదా కప్పలు బెక బెక మంటయ్బురుద కాలం కదావానపాములు తిర్గుతయ్ వాన కాలం కదానేల మీద ఎప్పుడు నడిచినట్టేనడువకు చూసుకుంట నడువ్ లేకపోతే కాళ్ళు రెక్కలు ఇర్గుతయ్ పాకురు పట్టి వుంటుంది కదా నేల జాగ్రత్తరైతులు పొలాల వద్ద కరెంట్ పోల్లకాడ పైలంపాతిండ్లు గోడలపొంటి పెద్దచెట్ల తోటి భద్రం.సైకిల్ బైక్ ల ప్రయాణం చేసేటోల్లు నిమ్మలం వాన కాలమెల్లేదాక మురికి … Read more

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతు వేదికలు సంబరాలకు ముస్తాబవుతున్నాయని,ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని,రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  వోడితల ప్రణవ్ అన్నారు.గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు,రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ … Read more

గీత కార్మిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మాచర్ల నగేష్ గౌడ్ బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందాడు మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.అదేవిధంగా సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటివరకు … Read more

జర కరుణించ రాదమ్మ వానమ్మా
ఎదురు సూడవట్టే నీకై నేలమ్మా

అనపురం రమేశ్ గౌడ్ ఎంఏ. ఆ పాదాలు బురదలో దిగితేనే అన్నం మెతుకులు లేకుంటే అన్నమో రామచంద్రా ఆ చేతులు మట్టిని తాకితేనేఆకలి దూరంలేకుంటే ఆగం బతుకులుఆ శరీరం వానలో తడుస్తనేలోకానికి ఆశలులేకుంటే అడియాశలు ఆ జీవి పోలంలోన సెమట చిందిస్తేనేజనాలకు వెలుగులులేకుంటే చిమ్మ చీకట్లుఆ జీవి ఆరుగాలం శ్రమిస్తేనేఅందరికీ ఆనందంలేకుంటే ఆకలి కేకలుమరి ఆ జీవికి ఎన్ని ఇక్కట్లో వాన చినుకుల కోసం ఎదురు చూపులు పెట్టుబడి కోసం పడిగాపులుఅతివృష్టి అనావృష్టిల పోరాటంవిషపురుగులతో చెలగాటంలోకం కోసం … Read more

బిస్లరీ వాటర్ ప్లాంట్ ను సందర్శించిన స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట లోని బిస్లరీ వాటర్ ప్లాంట్ ను స్రవంతి జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులు మంగళవారం సందర్శించినట్లు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు తెలిపారు..ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ బిస్లరీ వాటర్ ప్లాంట్  సందర్శించిన సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ తయారీ, ప్యాకేజింగ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారని తెలియజేశారు. కార్మికులు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎలా పని … Read more

మీరు చల్లని బీర్ ప్రియులా..జర ఇది చూడండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బీర్ ప్రియులకు బీర్ తాగాలంటే జంక్ పుడుతుంది. చల్లని బీర్లో హాయిగా దర్శనమిస్తున్నాయి పురుగులు. పక్కా ప్రణాళిక తో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్న బీర్లలో పురుగులు దర్శనమివ్వడంతో మద్యం ప్రియులు జడుసుకుంటున్నరు.తాజాగా హుజురాబాద్ పట్టణంలోని ఆర్ఆర్ వైన్స్ లో బీర్ కొని మజాగా తాగుతున్న బీర్ ప్రియునికి పురుగు దర్శనం ఇవ్వడం తో ఖంగు తిన్నాడు.జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లి కి చెందిన పుల్లూరి సంపత్ హుజురాబాద్ కి పని … Read more

ఆల్ఫోర్స్ లో ఘనంగా మెహందీ వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మెహేంది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు వివిధ డిజైన్లలో మెహందీ పెట్టుకొని పెట్టుకొని ప్రదర్శించారు. మెహందీ పెట్టుకున్న విద్యార్థుల పిల్లల చేతులు ఎర్రబడి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయం పండుగలో మెహందీ పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు.మెహందీ లేకుండా మన భారత దేశంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకోరని  గుర్తు చేశారు.మన … Read more