ఆర్యవైశ్య సంఘం జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా కె.ఆర్.వి నరసయ్య

జమ్మికుంట పట్టణంలో సోమవారం జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో 21 ఓట్ల మెజార్టీతో కె.ఆర్.వి నరసయ్య తన సమీప అభ్యర్థి గర్రెపల్లి వెంకటేశ్వర్లుపై గెలుపొందినట్లు ఎన్నికల అధికారి పబ్బతి రాజగోపాల్,కన్వీనర్ ముక్క వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 1626 ఓట్లు ఉండగా 662 ఓట్లు పోలైనవి.ఇందులో కె.ఆర్.వి నరసయ్యకు 337 ఓట్లు రాగా గర్రెపల్లి వెంకటేశ్వర్లకు 316 ఓట్లు వచ్చాయని మూడవ స్థానంలో కె.ఆర్.వి నరసయ్యకు మద్దతు తెలిపిన కొండ్లె పాపయ్యకు ఏడు ఓట్లు వచ్చాయని రెండు … Read more

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఏబూసి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నియమించారు.ఆదివారం సాయంత్రం కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు జర్నలిస్టుల సమావేశం జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ విచ్చేసి నియామక పత్రాన్ని ఏబూసి శ్రీనివాస్ కు … Read more

బీజేపీ గెలిస్తే మోదీయే పీఎం- మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు పీఎం

మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది.ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి.ఆ హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నరు.గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం,కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు.రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ … Read more

బ్రాంజ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి అక్షిత కి ఘన సన్మానం

తమిళనాడు లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడింలో ఫిబ్రవరి 27నుండి 29  జరిగిన – 46 కేజీ వయస్సులో విజయవంతంగా రెండో రౌండ్ పూర్తి చేసుకొని మూడవ రౌండ్ లో తృతీయ స్థానం సాధించి భ్రాంజ్ మెడల్ అందుకొని వచ్చిన వీణవంక మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బబ్బూరి అక్షిత వీణవంక ప్రభుత్వ హైస్కూల్ లో 10 వ తరగతి చదువుకుంటూ క్రీడలపై ఉన్న మక్కువతో తైక్వాండో అనే క్రీడను ఎంచుకొని తైక్వాండో అసోసియేషన్ కరీంనగర్ జిల్లా … Read more

మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండా లో అవినీతి

మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన ఎజండ ప్రజల కోసం అభివృద్ది కోసం ఉపయోగ పడేలా లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం 12 గంటలకు వుందని సమాచారం అందించి ఆ తరువాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు మళ్ళీ సమాచారం అందించారని తెలిపారు.ఈ సమాచారం తో 11:30 కు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ గదిలోకి వెళ్ళగానే … Read more

దళితబందు రెండవ విడత ఎప్పుడు ఇస్తారో జిల్లా మంత్రి ప్రకటన చేయాలి

హుజురాబాద్ నియోజకవర్గం లోని పైలెట్ ప్రాజెక్టు అయినటువంటి దళితబందును రెండవ విడతను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పూర్తిస్థాయిలో మంజూరు చేస్తుందో జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన ద్వారా తెలపాలని హుజురాబాద్ నియోజకవర్గ దళితబందు సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.గత బి అర్ ఎస్ ప్రభుత్వం దళితబందు పూర్తిస్థాయిలో మంజూరు చేయడంలో విఫలం అయిందని రెండవ విడత కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్న దళితులకు అన్యాయం చేశారని,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన … Read more

దళిత బందు ఇచ్చేది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వమే

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్,అప్పటి ఎమ్మెల్సీ,ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని  ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “దళిత బందు” సాధన కమిటీ నాయకుల ప్రకటనల వల్ల దళిత బంద్ లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నామ్ … Read more

మా వెనుక ఎవరూ లేరు

జమ్మికుంట దళిత బంధు సాధన కమిటీ నాయకులు జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారులైన తాము రెండో విడత దళిత బంధు సాధనకై ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా అక్కడి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి తమను అక్రమంగా అరెస్టు చేసి కనీసం మహిళలు,వృద్ధులు అని కూడా చూడకుండా సిటిఎస్ కు తరలించారు.తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కానీ స్థానిక … Read more

జమ్మికుంటలో మాదిగ హక్కుల దండోరా ఆవిర్భావ వేడుకలు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా (ఎం హెచ్ డి) సంస్థ ఆవిర్భావన జరిగి మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎం.హెచ్.డి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఎంహెచ్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలేశ్వరం సాల్మన్ మాదిగ చేతులమీదుగా జెండా ఎగరవేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో స్థానం కల్పించాలని పెద్దపల్లి ఎంపీ … Read more

గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.జమ్మికుంట మండలం అధ్యక్షునిగా వడ్లూరి ఏ పప్రా,కార్యదర్శిగా కలకోట స్టీఫెన్ రాజ్,ట్రెజరర్ కలకోట సత్యరాజు లను ఎన్నుకున్నారు.అదేవిధంగా ముఖ్య సలహాదారునిగా తాల్లపల్లి జాషువా,వైస్ ప్రెసిడెంట్ కె ప్రభాకర్,జాయింట్ సెక్రెటరీ ఎం మోజెస్,కమిటీ సభ్యులు సిహెచ్ రాజు,రవీందర్ పాలు,యెహోషువ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా నూతన కమిటీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు ఇలాంటి ఆపద వచ్చినా అండగా నూతన కమిటీ ఉంటదని తెలిపారు.ఇటీవల క్రైస్తవులు అణిచివేతకు గురవుతున్నారని … Read more