మీ తాటాకు సప్పుళ్లకు బయపడేటోళ్ళం కాదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట పట్టణంలో శనివారం కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ చేసిన పత్రికా ప్రకటనలో తమపై చేసిన ఆరోపణలను జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఖండించారు. వాట్సాప్ గ్రూపులో నిధులు తానే తెచ్చుకున్నట్టు చెప్పుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పుడు వాదమని ఆయన స్పష్టం చేశారు. కొలకాని రాజు మాట్లాడుతూ – “మేము బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించామని, స్పందన … Read more

అవయవదానం చేస్తే జీవితాలు నిలుస్తాయి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4:జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవయవదానం పై అవగాహన కల్పించేందుకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని కార్తికేయ ఐటీఐ కళాశాలలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ లెంకలపల్లి శరత్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నరహరి గురూజీ పాల్గొని విద్యార్థులకు అవయవదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మరణం తర్వాత శరీరం కాలిపోతే బూడిద, పూడితే మట్టిగా మారిపోతుందని, అదే అవయవాలను దానం చేస్తే మరొకరి జీవితానికి పునర్జన్మ కల్పించగలమని వారు … Read more

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4 : హుజురాబాద్ డివిజన్ పరిధిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్, విద్యుత్, వైద్య, మున్సిపల్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు, సరైన లైటింగ్, క్రేన్లు, అదనపు డ్రైవర్లు … Read more

జమ్మికుంట ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం – దంపతులకు గాయాలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,సెప్టెంబర్ 3:జమ్మికుంటలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే,తనుగుల గ్రామానికి చెందిన బొల్లు మధుకర్ రెడ్డి తన భార్య బొల్లు శ్రీలతతో కలిసి ద్విచక్ర వాహనంపై (AP 15 AY 9284) ఆగస్టు 27న జమ్మికుంటకు వచ్చారు. పని ముగించుకొని తిరిగి తనుగుల గ్రామానికి వెళ్లే క్రమంలో, జమ్మికుంట ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సరికి, వెనుక నుంచి అతివేగంగా నుంచి వచ్చిన కారు (TS 02 … Read more

జమ్మికుంటలో గణేష్ నవరాత్రుల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పడాల రాహుల్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గం, జమ్మికుంట పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా యువసేన యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్ పడాల రాహుల్ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో మాట్లాడుతూ పడాల రాహుల్, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యువతతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా … Read more

సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై … Read more

జమ్మికుంటలో ఎరుకల జాతి ఆత్మగౌరవ పోరాట జెండా ఆవిష్కరణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ పరిధి 16వ వార్డులోని ఎస్టీ కాలనీలో ఆదివారం ఎరుకల కులస్తుల సమక్షంలో ఎరుకల జాతి ప్రజల ఆత్మగౌరవ పోరాట జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ,1952 ఆగస్టు 31న క్రిమినల్ ట్రైబ్స్ (CT Act) రద్దు చేయబడిన దినాన్ని పురస్కరించుకొని ఈ జెండా ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపారు. బ్రిటిష్ పాలకులు ఎరుకల తెగల అడవి సంపదను దోచుకోవడానికి కుట్రలు పన్ని, వారి ప్రతిఘటనను అణచివేయడానికి ఈ చట్టాన్ని అమలు … Read more

జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో … Read more