దళితుల పట్ల కౌశిక్ రెడ్డికి వివక్ష తగ్గదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: దళితుల పట్ల కౌశిక్ రెడ్డి వివక్ష చూపెట్టడం తగదని,నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ప్రస్థానంలో ఉన్న సీనియర్ నాయకుడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల శాసన సభ వేదికగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు అసభ్యకరమని,దీనిపై వెంటనే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి దళితులపై … Read more

అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ – వడ్డెర సంఘం నేత ఆగ్రహం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా, వడ్డెర సంఘం జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లపు రవిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పల్లపు రవి మాట్లాడుతూ, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.అలాగే, వడ్డెర కులాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. … Read more

ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి

జమ్మికుంట/ధనధన్ న్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని బీఆర్ఎస్వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా “ఆరు గ్యారంటీలు” ప్రకటించిందని గుర్తుచేశారు. అందులో ఉద్యమకారులకు గుర్తింపు కార్డు,250 గజాల ఇల్లు స్థలం, ₹25,000 పెన్షన్ ఇవ్వాలని హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ఈ హామీల … Read more

భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణానికి ‘కోటి గోటి తలంబ్రాలు’ సమర్పణ

జమ్మికుంట/ఇల్లందకుంట, మార్చి 22:కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఈ నెల 27న (మార్చి 27, 2026) జరగనున్న శ్రీరామనవమి కల్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుక కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన శ్రీరామదాసు భక్త మండలి (చెల్పూర్) వారు అత్యంత భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన ‘కోటి గోటి తలంబ్రాలను’ ఆదివారం ఆలయ అధికారులకు సమర్పించారు. నియమ నిష్ఠలతో తలంబ్రాల తయారీగత పది సంవత్సరాలుగా భద్రాచలం మరియు … Read more

మత సామరస్యానికి ప్రత్యేకగా రంజాన్ వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో ముస్లిం పాత్రికేయులకు అధికారులకు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ములుగు ప్రశాంత్, పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్, హాజరై వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు. రంజాన్ మాసంలో సూర్యాస్తమయం తర్వాత ముస్లింలు తమ రోజా (ఉపవాసం) విరమించే భోజనాన్ని “ఇఫ్తార్” … Read more

మహిళా మండలి భూమి కబ్జా నిరూపణ ఐతే..

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళ మండలి స్థలంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, మహిళ మండలి స్థలం కబ్జాకు గురైందని కొందరు సామాజిక కార్యకర్తలు మరియు 28వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంబంధిత స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. అలాగే స్థానిక ప్రజల … Read more

జై భీమ్ కాలనీలో ఎస్సీ కమిటీ ఏర్పాటు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు జై భీమ్ కాలనీలో యువతలో మంచి మార్పు తీసుకురావడం, సమాజంలో పోటీ తత్వం పెంపొందించడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం లక్ష్యంగా నూతనంగా ఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్ సురంజన్ ని ఘనంగా సన్మానించారు. అదే వేదికపై కమిటీకి ఎన్నికైన సభ్యులను కూడా కౌన్సిలర్ సురంజన్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. … Read more