గంగిరెద్దుల భవనానికి భూమి పూజ

హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కొరకు 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఇందిరానగర్ మాజీ కోడిగూటి శారద ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి … Read more

శనివారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం

సైదాపూర్,ఆకునూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మార్చి 9 శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 33/11 కెవి సబ్ స్టేషన్ మరమ్మతుల దృశ్య విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సైదాపూర్ ఏఈ బొమ్మ ఆంజనేయులు గౌడ్ తెలియజేశారు.

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారని ఈ తరుణంలో మహిళా లోకం మరింత … Read more

రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వ అండదండలు (ఆశీస్సులు) కరువు

1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆబాది జమ్మికుంట మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీళ్లు రాక పంట పొలాలు ఎండుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కన్నేర చేస్తూ రైతులను విస్మరిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతు వ్యతిరేక విధివిధానాలను నిర్వహిస్తూ రైతుకి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ  రైతంగాన్ని నడ్డి విరిచే చర్యలు చేపడుతూ రైతుల కళ్ళల్లో కన్నీళ్లను నింపుతూ పరిపాలన కొనసాగిస్తుందని ఆ … Read more

బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY)జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ నియామకం

బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY) జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ గారిని నియమిస్తూ బీసీ రాజకీయ పోరాట సమితి (BRPS) రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.బీసీల రాజకీయ అధికారం కోసం,బీసీ నాయకత్వాన్ని పెంపొందించేందుకు నిరంతరం పని చేయాలని సూచించారు.ఎంతో నమ్మకంగా తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ … Read more

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం

సైదాపూర్ మండలానికి చెందిన వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలకు గత మూడు నెలలుగా వేతనాలు రాక మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని,ఈఎంఐ చెల్లింపులు పిల్లల కళాశాల ఫీజులు,మా ఆరోగ్యరీత్యా మెడిసిన్ ఖర్చులు,మారోజు వారి రవాణా ఖర్చుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని,మాకు వెంటనే డిసెంబర్,జనవరి,ఫిబ్రవరి మూడు మాసాల వేతనాలను విడుదల చేసి మాఖాతాలో జమ చేయగలరని  గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాతకి తెలంగాణ రెండవ ఏఎన్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం … Read more

దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఆగడం పై బిజెపి శ్రేణుల హర్షం

ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92)  జమ్మికుంటలో ఆగడానికి రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం హర్షనీయమని, ఇది రైల్వే ప్రయాణికులకు వ్యాపారులకు శుభవార్త లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. దానాపూర్ ఎక్స్ ప్రెస్ జమ్మికుంటలో ఆపడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకున్నందున స్థానిక బిజెపి శ్రేణులు రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్,ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు … Read more

గోడిశాల గ్రామాన్ని సందర్శించిన ఎన్ఆర్ఎస్ సైంటిస్టులు

సైదాపూర్ మండలంలోని  గొడిశాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను చూడడానికి నేషనల్ రిమోట్  సెన్సింగ్ (ఎన్ఆర్ఎస్) నుండి జోషి, బూర్ల అనిల్ కుమార్ సైంటిస్టులు మరియు సిఆర్డి నుండి అభయ్ కుమార్ వచ్చారు.ఈ కార్యక్రమంలో  భాగంగా ఫారం పాండ్స్, భూగర్భ జలాల పెంపు,ఫీడర్ ఛానెల్స్, వ్యవసాయ సాగు పెరుగుదల, హరితహరం, గ్రామంలో చేపట్టిన హార్టికల్చర్ పండ్ల తోటలు,నర్సరీ,పల్లె ప్రక్రుతి వనాలు,ఇతర ఉపాధి హామీ పథకం పనులను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి … Read more

శాయంపేట లో ఐమాక్ లైట్స్ ని ప్రారంభించిన జడ్పీటీసీ శ్యాం

జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఐమాక్స్ లైట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హాజరై వాటిని ప్రారంభించారు.  ఈ సందర్భంగా జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ జమ్మికుంట మండలంలోని వావిలాల, పెద్దoపల్లె,జగ్గయ్యపల్లి,పాపక్కపల్లె శంభునిపల్లె  తనుగుల,నాగంపేట్,కోరపల్లి,వెంకటేశ్వరపల్లి, గ్రామాలలో జిల్లా పరిషత్ నిధి నుండి ఒక్కొక్క గ్రామానికి ఒక లక్ష రూపాయలు చొప్పున కేటాయించి ఆయా గ్రామాలలో ఐమాక్స్ లైట్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు.ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని  … Read more

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మహేందర్ గౌడ్

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగాహుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ ని నియమించారు.గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్ర స్థాయి వరకు గౌడ సంఘ అభివృద్ధికి పాటుపడాలని మహేందర్ గౌడ్ కు సూచించారు.