సైదాపూర్ లో బీఆర్ ఎస్ పార్టి ముఖ్య కార్యకర్తలు సమావేశం

సైదాపూర్ మండలం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్  బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ ,మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12 ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే  కరీంనగర్ కధన  బేరి కి సభకు మండలం నుండి 2000 వెల మంది తరలివచ్చి … Read more

వరి మొక్కజొన్న యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

సైదాపూర్ మండలంలోనివెన్నంపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రోజున కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి  రైతులకు వరి మరియు మొక్కజొన్న పంటల ఎరువుల యాజమాన్యం,వాటిలో వచ్చు వివిధ రకాల పురుగులు,తెగుళ్ల యాజమాన్యం మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది.డిడిఏ,ఎఫ్టిసి చత్రునాయక్  రైతులకు సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన నేలకు,రైతుకు కలిగే లాభాల గూర్చి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఏవో వైదేహి,ఏఈవో రజిత గ్రామ రైతులు పాల్గొన్నారు.

రంజాన్ ఏర్పాట్లకై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం

ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న 30 రోజుల పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించిన విధంగా రంజాన్ పండుగ ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలని కోరుతూ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టి డిపార్ట్మెంట్ చైర్మన్ మహ్మద్ తాజొద్దీన్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నేతలతో కలిసి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లాలోని 4 మున్సిపాలిటిలు,16 మండలాల పరిధిలోని … Read more

ఆర్యవైశ్య సంఘం జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా కె.ఆర్.వి నరసయ్య

జమ్మికుంట పట్టణంలో సోమవారం జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో 21 ఓట్ల మెజార్టీతో కె.ఆర్.వి నరసయ్య తన సమీప అభ్యర్థి గర్రెపల్లి వెంకటేశ్వర్లుపై గెలుపొందినట్లు ఎన్నికల అధికారి పబ్బతి రాజగోపాల్,కన్వీనర్ ముక్క వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 1626 ఓట్లు ఉండగా 662 ఓట్లు పోలైనవి.ఇందులో కె.ఆర్.వి నరసయ్యకు 337 ఓట్లు రాగా గర్రెపల్లి వెంకటేశ్వర్లకు 316 ఓట్లు వచ్చాయని మూడవ స్థానంలో కె.ఆర్.వి నరసయ్యకు మద్దతు తెలిపిన కొండ్లె పాపయ్యకు ఏడు ఓట్లు వచ్చాయని రెండు … Read more

సైదాపూర్ లో ప్రజా పాలన హెల్ప్ డెస్క్ ప్రారంభం

సైదాపూర్ మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని  రాష్ట్ర ఎంపీపీల పోరం రాష్ట్ర అధ్యక్షుడు సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన సేవ కేంద్రం దరఖాస్తు చేసుకున్నవరు వారి దరఖాస్తులలో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని, అలాగే గతంలో దరఖాస్తు చేసుకొని వారు కొత్తగా ప్రజాపాలన హెల్ప్ డెస్క్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దూలం మంజుల,ఎంపీడీవో … Read more

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఏబూసి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నియమించారు.ఆదివారం సాయంత్రం కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు జర్నలిస్టుల సమావేశం జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ విచ్చేసి నియామక పత్రాన్ని ఏబూసి శ్రీనివాస్ కు … Read more

ఒక్క ఓటమితో ఈటల ‘ఆత్మగౌరవం’ బదిలీ?

ఈటల రాజేందర్..ఈ పేరు బహుశా తెలంగాణ రాజకీయాల్లోనే కాదు..దేశంలోనూ ప్రజానీకానికి..రాజకీయ ఓనమాలు తెలిసిన అందరికీ తెలిసిన పేరు అని చెప్పొచ్చు. హుజురాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు రాజకీయ యవనికపై స్థానం సుస్థిరం చేసుకున్న తెలివైన రాజకీయ నాయకుడిగా రాజకీయ వర్గాల్లో ఆయనకు పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ‘నాడు’ ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ కీలక భూమికను పోషించిన ధీశాలి ఈటల. ‘గులాబీ జెండా’కు ఓనర్లం … Read more

బీజేపీ గెలిస్తే మోదీయే పీఎం- మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు పీఎం

మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది.ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి.ఆ హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నరు.గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం,కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు.రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ … Read more

మహిళల ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.శనివారం రాష్ట్ర,ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఎన్.ఏ.సి ను సందర్శించి మహిళలకు రెండవ బ్యాచ్ కుట్లు, అల్లికల శిక్షణను ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం … Read more

బ్రాంజ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి అక్షిత కి ఘన సన్మానం

తమిళనాడు లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడింలో ఫిబ్రవరి 27నుండి 29  జరిగిన – 46 కేజీ వయస్సులో విజయవంతంగా రెండో రౌండ్ పూర్తి చేసుకొని మూడవ రౌండ్ లో తృతీయ స్థానం సాధించి భ్రాంజ్ మెడల్ అందుకొని వచ్చిన వీణవంక మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బబ్బూరి అక్షిత వీణవంక ప్రభుత్వ హైస్కూల్ లో 10 వ తరగతి చదువుకుంటూ క్రీడలపై ఉన్న మక్కువతో తైక్వాండో అనే క్రీడను ఎంచుకొని తైక్వాండో అసోసియేషన్ కరీంనగర్ జిల్లా … Read more