డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం కాన్షియస్ నెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు బొట్ల రామస్వామి అధ్యక్షతన పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం ద్వారా అనారోగ్యానికి గురవుతామని అన్నారు.విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం అవుతుందని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ వినోద్ కుమార్ అన్నారు.డ్రగ్స్ కు అలవాటు పడి డ్రగ్స్ కోసం … Read more

మత్స్యకారులపై ప్రభుత్వానికి ఇంత వివక్ష ఎందుకు?

కమలాపూర్/ధనాధన్ న్యూస్: గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సగం కూడా చేపల పంపిణీ చేయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన చేపల విషయంలో పూర్తిగా వివక్ష చూపిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం లో చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు.  హుజురాబాద్ నియోజకవర్గం లో 283 చెరువులు ఉన్నాయని అన్నారు. గతంలో కమలాపూర్ లో 16 లక్షల చాపలు … Read more

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన,అనంతరం జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని,దేశంలో … Read more

వెన్కేపల్లిలో దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం వెన్కేపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో మంగళవారం రోజున మ్యాకల రాజు  ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిఎమ్ చేతులమీదుగా దివ్యాంగులకి ఉచిత బస్ పాస్లు పంపిణీ చేశారు.ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిఎమ్ కు శాలువాతో సన్మానించారు. అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలి.ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చునని,ట్రాఫిక్ సమస్యను  నియంత్రించడం,పర్యావరణం  కాలుష్యం తగ్గుతుందని … Read more

లెదర్ పార్కులపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గత పదేండ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో లెదర్ పార్కులపై చిన్నచూపు చూసిందని పూర్తిగా మాదిగల పట్ల వివక్ష చూపిందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర  అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మరియు రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ అన్నారు. ఆదివారంనాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట లెదర్ పార్కు ను సందర్శించిన సందర్భంగా స్థానిక లెదర్ పార్కు కమిటి నాయకులతో కలసి వారు మీడియా తో మాట్లాడారు.కేసీఆర్ పాలనలో వెనుకబడిన మాదిగలు కాంగ్రెస్ … Read more

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు పది లక్షల విలువ చేసే ఎల్.ఒ.సీ లను,సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు,వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ భాద్యతగా అండగా ఉంటుందని అన్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ … Read more

మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ సేవలు ఆదర్శప్రాయం

హుజురాబాద్/ధనాధన్: హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్ (బ్రహ్మచారి) నిస్వార్థ ప్రజా సేవలు ఆదర్శప్రాయమని ప్రజాకవి రచయిత మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు నాగుల సత్యం గౌడ్ అన్నారు. పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో వడ్లూరి విజయ్ కుమార్ 57వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. అనంతరం మంచి మనసే దేవుడి మందిరం అనే కవిత జ్ఞాపకం అందజేసి, … Read more

నువ్వు మగాడివి ఐతే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారతీరుపై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి,మంత్రుల మీద అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని,పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల మాట్లాడే కౌశిక్ రెడ్డి నిజంగా మొగోడు అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిపి చూపించాలని అన్నారు.గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక స్కాంలు చేస్తే,10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక స్కీములు … Read more

దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ ల పంపిణీ

హుజురాబాద్/ధనధాన్ న్యూస్: హుజూరాబాద్ మండలం కనుకూలగిద్ద గ్రామంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో దివ్యాంగులకి ఉచిత బస్ పాస్ లను హుజురాబాద్ డిపో మేనేజర్ చేతులమీదుగా పంపిణీ చేశారు.అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలని కోరారు.ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చునని,ట్రాఫిక్ సమస్యను  నియంత్రించడం,పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కారోబార్ ఎం.సురేందర్ మరియు ఆర్టీసీ సిబ్బంది … Read more

ప్రశాంత వాతావరణంలో దసరా పండగ జరుపుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జమ్మికుంట మండల ప్రజలు జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి ప్రజలకు సూచించారు… శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెంలో గ్రామ పెద్దలు ప్రజల తో సిఐ సమావేశం నిర్వహించి దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిఐ తెలిపారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అనవసరమైన గొడవలకు తెరలేపిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని సూచించారు. … Read more