ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన,అనంతరం జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని,దేశంలో … Read more

ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అధికారుల విచారణ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ముత్యాల రమణారెడ్డి ఈజీఎస్ నిధులను ముందస్తు గా తీసుకొని స్వాహా చేశాడని ఆకునూరు గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి సమాచార చట్టం ద్వారా సమాచారం తీసుకొని నిధులను ముందస్తు గా తీసుకొని గ్రామపంచాయతీలో జమ చేయలేదని,నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్,జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం రోజున ఆకునూరు గ్రామపంచాయతీ లో అధికారులు  … Read more

లెదర్ పార్కులపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గత పదేండ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో లెదర్ పార్కులపై చిన్నచూపు చూసిందని పూర్తిగా మాదిగల పట్ల వివక్ష చూపిందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర  అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మరియు రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ అన్నారు. ఆదివారంనాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట లెదర్ పార్కు ను సందర్శించిన సందర్భంగా స్థానిక లెదర్ పార్కు కమిటి నాయకులతో కలసి వారు మీడియా తో మాట్లాడారు.కేసీఆర్ పాలనలో వెనుకబడిన మాదిగలు కాంగ్రెస్ … Read more

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు పది లక్షల విలువ చేసే ఎల్.ఒ.సీ లను,సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు,వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ భాద్యతగా అండగా ఉంటుందని అన్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ … Read more

మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ సేవలు ఆదర్శప్రాయం

హుజురాబాద్/ధనాధన్: హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్ (బ్రహ్మచారి) నిస్వార్థ ప్రజా సేవలు ఆదర్శప్రాయమని ప్రజాకవి రచయిత మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు నాగుల సత్యం గౌడ్ అన్నారు. పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో వడ్లూరి విజయ్ కుమార్ 57వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. అనంతరం మంచి మనసే దేవుడి మందిరం అనే కవిత జ్ఞాపకం అందజేసి, … Read more

నువ్వు మగాడివి ఐతే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారతీరుపై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి,మంత్రుల మీద అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని,పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల మాట్లాడే కౌశిక్ రెడ్డి నిజంగా మొగోడు అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిపి చూపించాలని అన్నారు.గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక స్కాంలు చేస్తే,10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక స్కీములు … Read more

దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ ల పంపిణీ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దేనపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో సోమవారం రోజున  ఉడిగే విజయ రాజశేఖర్  ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిపో డిఎమ్ చేతులమీదుగా దివ్యాంగులకి ఉచిత బస్ పాస్ లు  పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిఎమ్ ని శాలువాతో సన్మానించారు. అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలని,ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల … Read more

దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ ల పంపిణీ

హుజురాబాద్/ధనధాన్ న్యూస్: హుజూరాబాద్ మండలం కనుకూలగిద్ద గ్రామంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో దివ్యాంగులకి ఉచిత బస్ పాస్ లను హుజురాబాద్ డిపో మేనేజర్ చేతులమీదుగా పంపిణీ చేశారు.అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలని కోరారు.ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చునని,ట్రాఫిక్ సమస్యను  నియంత్రించడం,పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కారోబార్ ఎం.సురేందర్ మరియు ఆర్టీసీ సిబ్బంది … Read more

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఇక లేరు

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: డిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు.నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన శనివారం(అక్టోబర్ 12) తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సాయిబాబా ఈమధ్యనే జైలు నుంచి విడుదల అయ్యారు.నక్సలైట్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.ఈ కేసులో 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనతో పాటు మరో ఆరుగురికి … Read more

ప్రశాంత వాతావరణంలో దసరా పండగ జరుపుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జమ్మికుంట మండల ప్రజలు జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి ప్రజలకు సూచించారు… శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెంలో గ్రామ పెద్దలు ప్రజల తో సిఐ సమావేశం నిర్వహించి దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిఐ తెలిపారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అనవసరమైన గొడవలకు తెరలేపిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని సూచించారు. … Read more