‘ఓదెల2’ ఫస్ట్ లుక్ రిలీజ్

రెండేళ్ల క్రితం ఒటీటీ లో రిలీజ్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఓదెల2’ పేరుతో సీక్వెల్ తీస్తున్నారు. దీనికి కూడా అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా డైరెక్టర్ సంపత్ నంది రచయిత, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ పోషిస్తున్న ‘ఓదెల 2’ ఫస్ట్ లుక్ను తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చేవరకు పోరాటం ఆగదు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు.సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్‌ డే రోజున ఆడ‌ బిడ్డల ఉద్యోగాల‌కై ధ‌ర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కొచ్చిందని విమర్శించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మహిళలకు అనేక హక్కు లు కల్పించారని చెప్పారు.ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఇవాళ హైదరాబాద్‌ ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేప‌ట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … Read more

బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY)జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ నియామకం

బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY) జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ గారిని నియమిస్తూ బీసీ రాజకీయ పోరాట సమితి (BRPS) రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.బీసీల రాజకీయ అధికారం కోసం,బీసీ నాయకత్వాన్ని పెంపొందించేందుకు నిరంతరం పని చేయాలని సూచించారు.ఎంతో నమ్మకంగా తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ … Read more

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం

సైదాపూర్ మండలానికి చెందిన వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలకు గత మూడు నెలలుగా వేతనాలు రాక మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని,ఈఎంఐ చెల్లింపులు పిల్లల కళాశాల ఫీజులు,మా ఆరోగ్యరీత్యా మెడిసిన్ ఖర్చులు,మారోజు వారి రవాణా ఖర్చుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని,మాకు వెంటనే డిసెంబర్,జనవరి,ఫిబ్రవరి మూడు మాసాల వేతనాలను విడుదల చేసి మాఖాతాలో జమ చేయగలరని  గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాతకి తెలంగాణ రెండవ ఏఎన్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం … Read more

దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఆగడం పై బిజెపి శ్రేణుల హర్షం

ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92)  జమ్మికుంటలో ఆగడానికి రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం హర్షనీయమని, ఇది రైల్వే ప్రయాణికులకు వ్యాపారులకు శుభవార్త లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. దానాపూర్ ఎక్స్ ప్రెస్ జమ్మికుంటలో ఆపడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకున్నందున స్థానిక బిజెపి శ్రేణులు రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్,ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు … Read more

గోడిశాల గ్రామాన్ని సందర్శించిన ఎన్ఆర్ఎస్ సైంటిస్టులు

సైదాపూర్ మండలంలోని  గొడిశాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను చూడడానికి నేషనల్ రిమోట్  సెన్సింగ్ (ఎన్ఆర్ఎస్) నుండి జోషి, బూర్ల అనిల్ కుమార్ సైంటిస్టులు మరియు సిఆర్డి నుండి అభయ్ కుమార్ వచ్చారు.ఈ కార్యక్రమంలో  భాగంగా ఫారం పాండ్స్, భూగర్భ జలాల పెంపు,ఫీడర్ ఛానెల్స్, వ్యవసాయ సాగు పెరుగుదల, హరితహరం, గ్రామంలో చేపట్టిన హార్టికల్చర్ పండ్ల తోటలు,నర్సరీ,పల్లె ప్రక్రుతి వనాలు,ఇతర ఉపాధి హామీ పథకం పనులను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి … Read more

శాయంపేట లో ఐమాక్ లైట్స్ ని ప్రారంభించిన జడ్పీటీసీ శ్యాం

జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఐమాక్స్ లైట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హాజరై వాటిని ప్రారంభించారు.  ఈ సందర్భంగా జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ జమ్మికుంట మండలంలోని వావిలాల, పెద్దoపల్లె,జగ్గయ్యపల్లి,పాపక్కపల్లె శంభునిపల్లె  తనుగుల,నాగంపేట్,కోరపల్లి,వెంకటేశ్వరపల్లి, గ్రామాలలో జిల్లా పరిషత్ నిధి నుండి ఒక్కొక్క గ్రామానికి ఒక లక్ష రూపాయలు చొప్పున కేటాయించి ఆయా గ్రామాలలో ఐమాక్స్ లైట్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు.ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని  … Read more

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మహేందర్ గౌడ్

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగాహుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ ని నియమించారు.గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్ర స్థాయి వరకు గౌడ సంఘ అభివృద్ధికి పాటుపడాలని మహేందర్ గౌడ్ కు సూచించారు.

సైదాపూర్ లో బీఆర్ ఎస్ పార్టి ముఖ్య కార్యకర్తలు సమావేశం

సైదాపూర్ మండలం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్  బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ ,మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12 ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే  కరీంనగర్ కధన  బేరి కి సభకు మండలం నుండి 2000 వెల మంది తరలివచ్చి … Read more

రంజాన్ ఏర్పాట్లకై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం

ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న 30 రోజుల పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించిన విధంగా రంజాన్ పండుగ ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలని కోరుతూ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టి డిపార్ట్మెంట్ చైర్మన్ మహ్మద్ తాజొద్దీన్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నేతలతో కలిసి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లాలోని 4 మున్సిపాలిటిలు,16 మండలాల పరిధిలోని … Read more