బిస్లరీ వాటర్ ప్లాంట్ ను సందర్శించిన స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట లోని బిస్లరీ వాటర్ ప్లాంట్ ను స్రవంతి జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులు మంగళవారం సందర్శించినట్లు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు తెలిపారు..ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ బిస్లరీ వాటర్ ప్లాంట్  సందర్శించిన సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ తయారీ, ప్యాకేజింగ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారని తెలియజేశారు. కార్మికులు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎలా పని … Read more

అగ్ని ప్రమాద చిరు వ్యాపారులకు పోలీసుల చేయూత

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: నిన్న రాత్రి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు హుజురాబాద్ పోలీసులు అండగా నిలిచారు.హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి మంగళవారం సాయంత్రం తన కార్యాలయం వద్ద రేక్కాడితే గానీ డొక్కాడని 10 మంది అగ్ని ప్రమాద బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి తక్షణ సహాయంగా రూ.3000 చొప్పున 30,000 నగదును పదిమందికి అందజేశారు.అగ్ని ప్రమాదం సంభవించి చిరు వ్యాపారుల జీవనోపాధి లేకుండా చేయడం అత్యంత … Read more

అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో సోమవారం రాత్రి జరిగినటువంటి అగ్నిప్రమాదం చాలా బాధాకరమని నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం అగ్నిప్రమాదం జరిగిన చోటును ప్రణవ్ పరిశీలించారు.ఈ సందర్బంగా తమ జీవనాధారమైన షాపులను కోల్పోవడం జరిగిందని ప్రణవ్ ముందు ఆవేదన చెందగా వారికి నేనున్నా అని ధైర్యం చెప్పి ఓదార్చారు.అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను చిరు వ్యాపారస్తులతో,అధికారులతో మాట్లాడి,బాధితులకు న్యాయం జరిగేలా మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వంతో మాట్లాడి … Read more

మీరు చల్లని బీర్ ప్రియులా..జర ఇది చూడండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బీర్ ప్రియులకు బీర్ తాగాలంటే జంక్ పుడుతుంది. చల్లని బీర్లో హాయిగా దర్శనమిస్తున్నాయి పురుగులు. పక్కా ప్రణాళిక తో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్న బీర్లలో పురుగులు దర్శనమివ్వడంతో మద్యం ప్రియులు జడుసుకుంటున్నరు.తాజాగా హుజురాబాద్ పట్టణంలోని ఆర్ఆర్ వైన్స్ లో బీర్ కొని మజాగా తాగుతున్న బీర్ ప్రియునికి పురుగు దర్శనం ఇవ్వడం తో ఖంగు తిన్నాడు.జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లి కి చెందిన పుల్లూరి సంపత్ హుజురాబాద్ కి పని … Read more

ఆల్ఫోర్స్ లో ఘనంగా మెహందీ వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మెహేంది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు వివిధ డిజైన్లలో మెహందీ పెట్టుకొని పెట్టుకొని ప్రదర్శించారు. మెహందీ పెట్టుకున్న విద్యార్థుల పిల్లల చేతులు ఎర్రబడి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయం పండుగలో మెహందీ పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు.మెహందీ లేకుండా మన భారత దేశంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకోరని  గుర్తు చేశారు.మన … Read more

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన మిత్రులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: స్నేహమంటే బ్రతికుండగా చట్టపట్టలేసుకొని తిరగడం కాదు,స్నేహితుడు మరణించిన తర్వాత కూడా తన కుటుంబానికి అండగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంటకు చెందిన పలువురు యువకులు.వివరాల్లోకి వెళితే ఇటీవలజమ్మికుంట పట్టణం దుర్గా కాలనీలో నివసించే తిప్పిరెడ్డి సురేష్ అనే యువకుడు నాలుగు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించగా మృతుని కుటుంబానికి తనతోపాటు పాఠశాలలో  చదువుకున్న  స్నేహితులు 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఆకుల తిరుపతి,కోడూరు రాజేష్,రవి కృష్ణ రచ్చ, భాషవేనీ … Read more

సైదాపూర్ లో బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో  మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు  బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా పాత బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి,స్వీట్లు పంపిణీ చేసి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జంపాల సంతోష్,మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీ సీనియర్ నాయకులు ముత్యాల రమణారెడ్డి,జెల్ల మల్లేశం ఓబీసీ మర్చ మండల అధ్యక్షులు నెల్లి శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి … Read more

ప్రభుత్వ భూమిని కాపాడండి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని సర్వే నెంబర్ 629లో ఉన్న ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు రేణికుంట్ల సాగర్ డిమాండ్ చేశారు.గత మూడు రోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న భూ కబ్జాపై స్పందించిన సాగర్ గురువారం జమ్మికుంట తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,నిలువ నీడలేని పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారని 60 … Read more

ఘనంగా కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు

భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలని జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టి కేక్ కట్ చేస్తూ,చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా  జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు  లు పాల్గొని … Read more

భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై చర్యలు చేపట్టాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్,జమ్మికుంట పట్టణాల్లో విచ్చలవిడిగా ఆసుపత్రులు వెలిసాయని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఒక్క హాస్పటల్ లేదని పేదప్రజల ఆరోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు టేకుల శ్రావణ్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్,జమ్మికుంట కేంద్రాలుగా భ్రూణ హత్యలు పెరిగాయని జిల్లా వైద్య శాఖ అధికారులు వాటిని అరికట్టడంలో చూసిచూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు.హుజురాబాద్,జమ్మికుంట లో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఏర్పాటు … Read more