గుండె పోటుకి గురై ఆర్టీసీ డ్రైవర్ మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దేనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ రమేష్ సింగ్ తండ్రి రాధా కిషన్ సింగ్ వయస్సు 46,ఆదివారం రోజున విధి నిర్వహణలో భాగంగా హుజరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ఉదయం హైదరాబాద్ వెళ్తుండగా మార్గం మధ్యలో గుండె పోటు రావడంతో,బస్సులో ఉన్న ప్రయాణికులు హాస్పిటల్స్ లో తరలించారు,చికిత్స పొందుతూ మృతి చెందాడు,ఆయనకు భార్య మంజుల,ముగ్గురు కుమార్తెలు అర్చన,అఖిల,అన్విత ఉన్నారు.ఆయన మృతి పట్ల  కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఆర్టీసీ ఉద్యోగులు,గ్రామ ప్రజలు,సంతాపం తెలిపారు.ఆయన కుటుంబానికి … Read more

నీట్ లో 492 మార్కులు సాధించిన గిరిజన బిడ్డ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని రాయికల్ తండకు చెందిన బానోతు శృతిక నీట్ లో 492 మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు రావడం పట్ల తల్లిదండ్రుల పాటు గ్రామస్తులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ రాయికల్ తండా గ్రామానికి చెందిన బానోతు మమత రమేష్ నాయక్ ల కుమార్తె శృతిక నీటిలో 492 మార్కులు సాధించి రాయికల్ తండాకు చెందిన విద్యార్ధి  ఏంబిబిఎస్ లో సీటు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం … Read more

డ్రోన్ స్పేయర్ కు యువకులకు రుణ సదుపాయం

సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి లో సోమవారం రోజున విశాల సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో  అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించినట్లయితే రైతులకు ఆర్థిక భారం తగ్గి సంఘ అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని, ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో డ్రోన్ స్పేయర్ అవసరం అవుతుంది గ్రామంలో రైతులు పండించే వరి మొక్కజొన్న పత్తి పంటలకు చీడపీడల నివారణ కోసం పిచికారి చేసేందుకు … Read more

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు జన్మదిన వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ అవరణలో బారాస అధ్యక్షులు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు జన్మదిన వేడుకలను మరియు మండలం కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కేక్ కట్ చేసిన తరువాత నాయకులూ కార్యకర్తలు స్వీట్ పంపిణి చేశారు.వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు.సతీష్ బాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని … Read more

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 93వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల రాజేశ్వర్ రావు విగ్రహానికి  వారి కుమారులు కిషన్ రావు,శ్రీనివాస రావు,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు,కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.పేదల పక్షాన నిలబడి వారికి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాడని,గల్లి నుండి ఢిల్లీ వరకు … Read more

సైదాపూర్ ఎస్ఐగా సిహెచ్ తిరుపతి నియామకం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల ఎస్ఐగా సి.హెచ్ తిరుపతిని నియమించినట్లు కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మహంతి ఉత్తర్వులు జారి చేశారు.గతంలో సైదాపూర్ ఎస్సై గా విధులు నిర్వహించిన జన్ను ఆరోగ్యంని జమ్మికుంట ఎస్ఐగా బదిలీ చేయగా కరీంనగర్ వీఆర్ లో ఉన్న సిహెచ్ తిరుపతి సైదాపూర్ ఎస్ఐగా నియమించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రతి పథకం ప్రజలకు చేరడమే ప్రభుత్వ ధ్యేయం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో రైతువేదికలో  అగ్రికల్చర్ ఆఫీసర్ వైదేహి అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ విభాగాల అధికారులురైతులు పెట్టుబడి తక్కువగా ఉండి అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని, పాడి పశువుల పోషణ,చేపలు పెంపకం,పండ్ల, గొర్రెలు,నాటు కోళ్లు,తోటలు,ఆయిల్ ఫాం,డ్రాగన్ ఫ్రూట్,పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమం … Read more

మండల అధికారులతో ఆర్డీవో సమీక్ష సమావేశం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున మధ్యాహ్నం ఎస్ రమేష్ హుజురాబాద్ ఆర్డీవో మరియు మండల ప్రత్యేక అధికారి బి.శ్రీనివాస్ మండలంలోని వివిధ అభివృద్ధి పనులపై మరియు గ్రామ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం మండల స్థాయి అధికారులు,గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు అంగన్వాడి టీచర్స్ , ఏఎన్ఎంమ్ ,సూపర్ వైజర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు గ్రామాలలో ఉన్న సమస్యలను పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంమ్,ఏడబ్ల్యుటి లను గ్రామాల వారీగా … Read more

మోడల్ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం సోమవారం  మోడల్ స్కూల్  లో బుదవారం రోజున అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్ డిఎస్) అధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఉమ్మడి జిల్లా  ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ సభ్యత్వం నమోదు చేయించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వర్షాకాల సమయంలో వర్షాలు భారీగా కురిస్తే క్లాస్ రూమ్ లోకి వర్షపు నీరు వస్తుందని,పాములు,తేళ్లు కప్పలు స్కూల్ లోపలికి వస్తూన్నాయని,చుట్టుపక్కల గడ్డి బాగా పెరిగిందని,రాత్రి సమయంలో గర్ల్స్ హాస్టల్లో చీకటిగా ఉందని స్కూల్ … Read more

విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్చదనం పచ్చదనము కార్యక్రమాన్ని రెండవ రోజు కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ కుమార్  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కరీంనగర్ ఇంటర్మీడియట్ విద్య అధికారి (డిఐఈఓ) జగన్మోహన్ రెడ్డి హాజరై కళాశాలలో మొక్కలు నాటినా తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86వ జయంతి సందర్బంగా పూలమాలవేసి నివాళి అందించాడు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఐఈఓ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల మొక్కలు నాటడముతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత … Read more