యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయండి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫార్మ్స్ కుట్టు కేంద్రాలను సోమవారం మెప్మా పిడి స్వరూప రాణి, కమీషనర్ మొహమ్మద్ అయాజ్,డిఎంసి శ్రీవాణి, ఏడిఎంసి మల్లీశ్వరిలు పరిశీలించారు.అనంతరం పలు కేంద్రాలను పరిశీలించి,యూనిఫార్మ్స్ నాణ్యతగా ఉండేలా ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో కుట్టాలని,యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు సతీష్,సీఎల్ఆర్పీలు జ్యోతి, మంజుల,ఆర్పీలు,కుట్టు మిషన్ నిర్వాహుకురాలు అభేద భాను లతో పలువురు పాల్గొన్నారు.

ఖబర్దార్ కేటీఆర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే25:మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లి బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు … Read more

నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే24:వర్షాకాలం వస్తుండడంతో రైతులు దుక్కి దున్ని పంట సాగుచేయడానికి విత్తనాలు ఎప్పుడు వస్తాయా పంట ఎప్పుడు వేయాలా అని ఎదురుచూస్తూ ఉంటారని,రైతుల అవసరాన్ని ఆసరా చేసుకునే కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారని రైతులు జాగ్రత్తగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు.హుజురాబాద్ లోని ఏసీపీ కార్యాలయం లో డివిజన్ లోని పోలీస్ అధికారులతో కలిసి జై కిసాన్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ జీ … Read more

ముస్లింలకు ఓబిసి సర్టిఫికెట్ల రద్దు పట్ల హర్షం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే24:దేశంలో ఎక్కడ లేని విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కులాలకు జారీచేసిన ఓబీసీల ధ్రువీకరణ పత్రాలను కోర్టు రద్దు చేయడం పట్ల ఓబిసి మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ  2010 సంవత్సరం లో పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసిందని, దీంతో లక్షలాదిమంది ఓబీసీలకు తమకు అందాల్సిన ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని, … Read more

ఉచిత వైద్య శిబిరానికి విశేషా స్పందన.

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే23:మర్రిపెల్లిగూడెంలో అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట వైద్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి సుమారుగా 400 ల మంది రోగులకు  వైద్య పరీక్షలు నిర్వహించి సుమారుగా 80000 రూపాయల విలువగల మందుల ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి వైద్య శిబిరంలో సూపర్ స్పెషలిటీ వైద్యులు డా.భావనా రెడ్డి నరాల వైద్య నిపుణులు,డా.ప్రశాంత్ రెడ్డి గుండె వైద్య నిపుణులు,డా.శ్రీనివాస్ జనరల్ ఫిజిషియన్,డా.విజేత … Read more

వెల్లి విరిసిన మత సామరస్యం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే22: లౌకికవాదం,మతసామరస్య పరిరక్షణలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శం.మరీ ముఖ్యంగా పల్లెల్లో ముస్లింలు,హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా.. ఒకరికొకరు అండగా ఉంటారు.హిందువుల పండుగల్లో ముస్లింలు ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు.హిందూ ముస్లిం భాయి భాయి  అని మరోసారి రుజువు అయింది.బుధవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ మహమ్మద్ సందాని హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.ఈ సందర్భంగా సందాని మాట్లాడుతూ … Read more

పట్టభద్రులారా తీన్మార్ మల్లన్న కి పట్టం కట్టండి

పరకాల(ధనాధన్ న్యూస్)మే 21:కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను నాయకులు,కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారము పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పరకాల పట్టణ మరియు … Read more

పరకాల తిరుపతి వర్ధంతి సందర్భంగా అన్నదానం

జమ్మికుంట ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన క్రి.శే.పరకాల తిరుపతి గౌడ్ నాలుగవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు జమ్మికుంట మండలం కేంద్రంలోని స్పందన అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండల జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్  శ్యాం, సిరిసేడు మాజీ సర్పంచ్ రఫీ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వీరి చేతుల మీదుగా అనాధ పిల్లలకి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి భార్య పరకాల రేణుక,కుమారుడు సాయి కుమార్,సిరి సైడ్ మాజీ … Read more

అంగ రంగవైభవంగా ద్వితీయ వార్షికోత్సవం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే15:జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా మంగళవారం నాడు ఉదయం విశ్వక్ సేన ఆరాదన,పుణ్యవచనం,రక్షా బంధనం,నవ కలుష స్థపనం,మహా హోమం తో ప్రారంభమై సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవం అధ్యంతం వైభవంగా,కన్నుల పండుగగా జరిగింది.రాములోరి కల్యాణానికి దాతలు పట్టు వస్త్రాలు,పూలు సమర్పించారు.అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.కళ్యాణ వేడుకతో గ్రామమంతా రామనామస్మరణతో మారూమ్రోగింది.ప్రతీ … Read more

ప్రమాదంలో గాయపడిన వారికి సహాయచర్యలు అందించిన ప్రణవ్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే13:జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ని మూల మలుపు వద్ద చెట్టును కారు ఢీ కొట్టిన ఘటన లో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి.వరంగల్ నుండి కాల్వశ్రీరాంపూర్ మండలం బేగంపేటకు గ్రామానికి ఓటు వేయడానికి వెళుతున్న శ్రీనివాస్-రమ దంపతుల కారు తనుగుల గ్రామంలోని మూలమలుపు వద్ద చెట్టుని డీకొట్టింది.కారు లో ప్రయాణిస్తున్న భార్యభర్తలతో పాటు చిన్న పాప కి గాయాలయ్యాయి.ఆ సమయం లో వావిలాల నుండి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల … Read more