ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై భగ్గుమన్న హుజురాబాద్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో హుజురాబాద్ నియోజకవర్గం ఒక్కసారిగా భగ్గుమంది.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు జగదీశ్ రెడ్డి లతోపాటు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులను అక్రమ అరెస్టులను నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట కేంద్రంగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.దీంతో పోలీసులు వారిని నివారించే ప్రయత్నం చేశారు.అనంతరం టిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు పలువురు … Read more

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ హేయమైన చర్య

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  హైదరాబాదులోతన నివాసంలో పోలీసులు అరెస్టు చేయడం హేయమైన  చర్య అని మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ అన్నారు.తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారని బంజారా హిల్స్ ఏసిపి అనుమతి తోనే ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లారని అన్నారు.పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇయ్యడానికి వెళ్తే విధులకు ఆటంకం కలిగించారని సిఐ ఫిర్యాదు చేయడం పోలీసుల విజ్ఞతికేవదిలేస్తున్నామన్నారు.ఎమ్మెల్యే ఇంటి  … Read more

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా బోడిగె శ్రీకాంత్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట మండల అధ్యక్షునిగా 21 మంది పోటీ చేయగా ఆ ఫలితాలను యువజన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిసెంబరు 4 బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 870 మెజారిటీ ఓట్లతో జమ్మికుంట పట్టణానికి చెందిన బుడిగె శ్రీకాంత్ హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో … Read more

విద్యార్థులకు మెరుగైన భోజనం అందించడం మనందరి బాధ్యత

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల మంగళవారం ఎమ్మార్సీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఎంఈఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన,రుచికరమైన,పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని,ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన  భోజనం అందించాలని వంట చేసే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాజా కూరగాయలు వినియోగించాలని తహశీల్దార్ దూలం మంజుల సూచించారు.త్వరలో మధ్యాహ్నం భోజన కార్మికులకు వంట సామాగ్రి మంజూరు కానుందని వారి సమస్యలను పై … Read more

బస్ డిపోలో కార్తీక మాస వనబోజనాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో గురువారం రోజున కార్తీక మాస వనబోజన కార్యక్రమంలో భాగంగా  ఆర్టీసీ మరియు పీహెచ్బీ ఉద్యోగులందరు ఒక్కచోట చేరి పలురకాల ఆటలు,పాటల  పోటీ నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్యక్రమం ఉద్యోగులందరి మానసిక ఉత్సాహం కోసం ఆర్టీసీ ఈ కార్యక్రమంను ఆర్టీసీ ఎండి సజ్జనార్ కార్తీకమాస వన భోజన కార్యక్రమం   రెండు రోజులు నిర్వహించాలనే ఆదేశాల మేరకు , … Read more

పోగొట్టుకున్న 50 సెల్ ఫోన్లు స్వాధీనం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా సెల్ ఫోన్ పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం  సాంకేతిక పరిజ్ఞానాన్ని (CEIR portal) ఉపయోగించి సుమారు 50  ఫోన్లు కనిపెట్టి బుధవారం హుజురాబాద్ ఏసీపీ  కార్యాలయంలో ఫోన్లు తిరిగి బాధితులందరికీఅందజేశారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుంటే దొంగిలించిన ఫోన్లతో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం ఉంటుందని అన్నారు. … Read more

దేశద్రోహులం కాదు..మేము దళితులం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: దళిత బంధు కోసం పోరాడే మేమంతా దేశద్రోహులం కాదని, దళితులమని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, కరీంనగర్ పర్యటనలో భాగంగా ముందస్తుగా అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 5000 … Read more

డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం కాన్షియస్ నెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు బొట్ల రామస్వామి అధ్యక్షతన పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం ద్వారా అనారోగ్యానికి గురవుతామని అన్నారు.విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం అవుతుందని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ వినోద్ కుమార్ అన్నారు.డ్రగ్స్ కు అలవాటు పడి డ్రగ్స్ కోసం … Read more

మత్స్యకారులపై ప్రభుత్వానికి ఇంత వివక్ష ఎందుకు?

కమలాపూర్/ధనాధన్ న్యూస్: గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సగం కూడా చేపల పంపిణీ చేయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన చేపల విషయంలో పూర్తిగా వివక్ష చూపిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం లో చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు.  హుజురాబాద్ నియోజకవర్గం లో 283 చెరువులు ఉన్నాయని అన్నారు. గతంలో కమలాపూర్ లో 16 లక్షల చాపలు … Read more

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన,అనంతరం జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని,దేశంలో … Read more