హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రక్షా బంధన్ సందర్భంగా సమాజంలో సోదర భావం మరింత పెంపొందాలని,హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.మహిళల రక్షణ పట్ల,మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించామని,ఉచిత బస్ సౌకర్యం ద్వారా అనేకమంది స్త్రీలు లబ్ధి పొందారని అన్నారు.అలాగే రాబోయే రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల … Read more

సోదరభావం,పవిత్రతే రక్షాబంధన్ సందేశం

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్ ఉద్దేశ్యమని బ్రహ్మకుమారీలు  కల్పన, శ్రీవాణి అన్నారు. శుక్రవారం రాఖీ పండగ విశిష్టతను వివరిస్తూ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పలువురికి రాఖీలు కట్టారు. రాఖీ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అక్కా చెల్లెలు, అన్నదమ్ముల బంధం గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడారు.సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ పరమాత్ముని అవతరణ, దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుందన్నారు. రక్షణ అంటే విలువలను పెంపొందించుకోవడం, … Read more

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు డాక్టర్ల నియామకం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ త్వరితగతిన వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా స్పందించిన కలెక్టర్ ఏరియా హాస్పిటల్ కు నలుగురు వైద్యులు నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడించారు.హుజురాబాద్,జమ్మికుంట ఆసుపత్రులకు 15 లక్షల రూపాయలను వాటి అభివృద్ధి కొరకు కేటాయించేలా కృషి చేశారు.ఆసుపత్రులకు నిత్యం అనేకమంది రోగులు వస్తుంటారు,వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని … Read more

మానసిక దివ్యాంగ విద్యార్థులకు అండగా ఉంటా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా పిల్లలు అల్లరి చేస్తే మనం విసుక్కుంటామని,అలాంటిది దివ్యాంగులైన పిల్లలకు విద్య నేర్పడం,కోచింగ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని దాన్ని  నిర్వహిస్తున్న,శిక్షణ ఇస్తున్న సిబ్బంది గొప్ప మనసు గల వారిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని 8వ వార్డులో గల సాయి మానసిక దివ్యంగుల ప్రత్యేక పాఠశాలను ఆయన సందర్శించారు.పాఠశాలలో నూతనంగా నిర్మించినటువంటి వంటగదిని,పాఠశాలలో మరమ్మత్తు చేసిన ఇతర వాటిని ఆయన … Read more

సర్కార్ దవాఖానలో సౌలతులు ఏవి?

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వా ఆస్పత్రుల్లో ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అనే పరిస్థితి నెలకొంది.ఆస్పత్రుల్లో వైద్యులు సరిపడా కాదు కనీసంగా కూడా లేకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట మండలకేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయల,డాక్టర్‌ల కొరత ఉందని ఏడాది క్రితం నుంచి ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ చెప్తూనే ఉన్నారు. హుజూరాబాద్ … Read more

సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ఈ నెల 18వ తారీఖున జరిగే సర్వాయి పాపన్న 374 వ జయంతి గ్రామ,గ్రామాన వాడవాడల ఘనంగా నిర్వహించాలని సర్వాయి పాపన్న కీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పూదరి విజయ్ పిలుపునిచ్చారు.జమ్మికుంట పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్ పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ బడుగు,బలహీనుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న … Read more

ఘనంగా ఈటెల జమున జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మాజీ శాసన సభ్యుడు,మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధ ఆశ్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎర్ర వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశ్రమంలోనీ పిల్లలకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పసుపునూటి శివ,పరశురామ్,ప్రశాంత్,రాజు,అనిల్,కిరణ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కబ్జా భూమిపై ఆఫీసర్ల సర్వే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో ఉన్న సర్వే నం.467లో గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించిన ఘటనపై అధికారులు కదిలారు.శుక్రవారం జమ్మికుంట తహశీల్దారు జి.రమేష్ బాబు ఆధ్వర్యంలో డివిజన్ డీఐ ఫయాక్ అలీ జమ్మికుంట సర్వేయర్ మనోజ్‌తో పాటు పలువురు సిబ్బంది స్థలాన్ని సర్వే చేయడానికి వెళ్లారు.గత కొద్దిరోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న వార్తలతో పాటు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త గుర్రపు మహేందర్‌గౌడ్ తహశీల్దార్‌కు ఈ … Read more

న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జనగామ పట్టణంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హుజురాబాద్ కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని,న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ గురు,శుక్రవారాలు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియన్ ప్రధాన … Read more

ఇండియన్ యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్ష బరిలో బుడిగె శ్రీకాంత్

బోడిగే శ్రీకాంత్ జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంగా,జమ్మికుంట మండల మరియు పట్టణానికి చెందిన విద్యార్థిని విద్యార్థుల, యువతి యువకుల మద్దతుతో జమ్మికుంట అధ్యక్ష బరిలో నిలిచినట్టు తెలిపారు. తాను గతంలో విద్యార్థి నాయకునిగా, విద్యార్థుల సమస్యల పట్ల తలపెట్టిన ప్రతీ కార్యక్రమంలో పాల్గొని,నాటి నుంచి నేటి వరకు ఎంతైతే బాధ్యతతో పనిచేస్తున్నానో అంతే అంకుటిత దీక్షతో యువతి యువకుల … Read more