ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజాకవి, రచయిత సామాజికవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రపంచ భారత్ … Read more

సైదాపూర్ మండల బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడిగా దెంచనాలా శ్రీనివాస్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి  గ్రామానికి చెందిన దెంచ నాలా శ్రీనివాస్ గతంలో బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులుగా,బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పని తీరును గుర్తించి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నాయకత్వం నూతన అధ్యక్షుల నియామకంలో భాగంగా దెంచనాల శ్రీనివాస్ ను గురువారం రోజున బిజెపి మండల పార్టీ అధ్యక్షులుగా సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి సారంగుల అమర్నాథ్ ప్రకటించినట్లు శ్రీనివాస్ ప్రకటన లో తెలిపారు.నూతన బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు … Read more

ఊరుగొండ లో లక్ష్మీనర్సింహస్వామి జాతర మహోత్సవం

దామెర/ధనాధన్ న్యూస్: దామెర మండలం ఊరుగొండ లక్ష్మీనర్సింహస్వామి అధ్యయన కల్యాణ మహోత్సవాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి.స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ క్రమంలో జనవరి 7 నుంచి 18 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న అధ్యయన కల్యాణ మహోత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు.స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, … Read more

పదవుల ప్రకటనతో కాంగ్రెస్ లో నయా జోష్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్,జమ్మికుంట పట్టణ,మండల,వీణవంక,ఇళ్ళందకుంట మండలాల పార్టీ అధ్యక్షుల నియామకం ఆదివారం రోజున జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ,వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి,హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి,మండల అధ్యక్షుడిగా కొల్లూరి కిరణ్ కుమార్,జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సుంకరి రమేష్,మండల అధ్యక్షుడిగా వీరమనేని పర్శరామరావు,వీణవంక మండల అధ్యక్షుడిగా ఎక్కటి రఘుపాల్ … Read more

ప్రభుత్వ పాఠశాలలోని విద్యుత్ మోటార్ ధ్వంసం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని కోరపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ మోటార్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం మంచినీటి కోసమై పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోరుతోపాటు మోటార్ మంజూరు చేయించి స్కూల్ యాజమాన్యానికి అప్పగించడం జరిగింది.దీనిలో భాగంగా ఆదివారం గుర్తు తెలియని దుండగులు హైస్కూల్లో ఉన్న మోటార్ ను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత పైపును కట్ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సమ్మయ్య … Read more

సగరుల అభివృద్ధికి కృషి చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: సగరులు ఐకమక్యంతో పని చేస్తూ వారి ఆర్థికఅభివృద్ధికి కృషి చేస్తూ ముందుకెళ్లాలని రాష్ర్ట సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సగర సంఘం ఎన్నికలు జరిగాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగరులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, సగరుల సమస్యలపై ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు అనగానే ఎవరూ కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా సోదర భావంతో తీసుకుని ఎన్నికల అనంతరం అందరూ … Read more

మాజీ పీఎం కి ఘన నివాళులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయిందనీ,మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి తీరని లోటని అన్నారు.మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏ నాటికి మరిచిపోదనీ తెలిపారు.2004 … Read more

చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ డివిజన్ పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు రైతులకు అందిస్తామని,కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని,రైతులను ఆన్ని విధాలా ఆదుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఎస్సారెస్పీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు జనవరి ఒకటి నుంచి సాగునీరు విడుదల చేస్తామని దానికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు రూపొందించారని,ఈ విషయమై ఇప్పటికే అధికారులతో మాట్లాడమని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రభుత్వ విద్యార్థుల విజ్ఞాన విహార యాత్రల కోసం స్పెషల్ బస్సులు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకు మరియు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలకు అతి తక్కువ ఖర్చుతో టీజిస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని సూపర్ లగ్జరీ ఎక్స్ ప్రెస్ మరియు పల్లె వెలుగు వంటి బస్సులు కెపాసిటీ బట్టి వినియోగించుకోవచ్చు.ఈ అవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వినియోగం చేసుకోవాలని,ఆర్టీసీ బస్ లో ప్రయాణం సురక్షితం అని హుజూరాబాద్ … Read more

స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలి

వీణవంక/ధనాధన్ న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలని, పోటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకుడు ప్రశాంత్ మద్దుల కోరారు. బుధవారం ఆయన వీణవంక మండల కేంద్రంలో  మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదికాలాలపాటు ప్రజా శ్రేయస్సుకు పనిచేయాలంటే గ్రామాల్లో యువతకు చాన్స్ ఇవ్వాలని కోరారు. యువ రక్తం హస్తం పార్టీలో ఉన్నంతగా మరే పార్టీలో లేదని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో యువతీ యువకులకు లోకల్ బాడీ … Read more