నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన జీడి మల్లేష్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే 09:బుధవారం బిజెపి బహిరంగ సభకు వేములవాడ కు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి హెలిప్యాడ్ వద్ద బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ స్వాగతం పలకడం జరిగింది.నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని,అంత గొప్ప నాయకున్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని,ఈ అవకాశం కల్పించిన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి లకు మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి ఊర్లో నరేంద్ర మోడీ మాటే!

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే09:జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఉపాధి పని కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుప్పాల  రఘు,ఓబీసీ మోర్చా  జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ ప్రతి ఉపాధి హామీ  కార్మికులను పలకరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పథకం కల్పిస్తూ,ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందిస్తూ,స్మశాన వాటికలు,ఉజ్వల గ్యాస్ యోజన,అనేక రకాల  పథకాలు అందిస్తున్నారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు … Read more

ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు.మహిళలకు 2500 పెన్షన్, … Read more

తెలంగాణ జన సమితి
పార్లమెంటరీ కమిటీ నియామకం

పార్లమెంటరీ ఇంచార్జి ముక్కెర రాజు పార్లమెంటరీ కో ఆర్డినేటర్ అరికిల్ల స్రవంతి కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే 06:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంటరీ కమిటీ ఇంచార్జి గా ముక్కెర రాజు,కో ఆర్డినేటర్ గా జగ్గారెడ్డి,అరికిల్ల స్రవంతి, కర్రే సతీష్ యాదవ్,మోరే గణేష్,పల్లెర్ల శ్రీనివాస్,రమేష్ లను నియమించడం జరిగింది.తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లో భాగంగా ప్రస్తుతం … Read more

మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు.బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు.సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు … Read more

డైలాగులతో ఓట్ల రాజకీయం

వీణవంక(ధనాధన్ న్యూస్)మే 06:డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాల పల్లి ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని,దేవుడి ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయా అంటూ రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు.పేద బడుగు బలహీన … Read more

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ప్రత్యేక పూజలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే 06:హుజురాబాద్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని తనుగుల గ్రామంలో శివాలయం గుడిలో ప్రత్యేక పూజలు జరిపి ప్రచారం మొదలు చేయడం జరిగింది.అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప పథకం ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి అందరూ ఆ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ … Read more

కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే06:సైదాపూర్ మండలం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో అమ్మనగుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా పోలు శ్రీనివాస్ ని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది.గత ఐదు సంవత్సరాలుగా చేసిన సేవాను గుర్తించి శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశాడు.అలాగే తన అధ్యక్ష ఎన్నికకి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఎంపిటిసి మల్లయ్య కి,మండల అధ్యకుడు దొంత సుధాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

అవినీతి పోవాలంటే- సామాన్యుడు మారాలి   

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)మే03:నేటి సమాజ పరిస్థితి ఎలా తయారయింది అంటే..! మనం మారద్దు కానీ మార్పు రావాలి, అవినీతి లేని సమాజం కావాలి, ప్రభుత్వాల ద్వారా ఉచితాలు రావాలి, మనం ఏం పని చేయొద్దు, మన ఇంటి వద్దకే అన్ని రావాలి, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే మా ఓటు… మరి డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మనం కోరుకునే అవినీతి రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది. ఎవరో రావాలి ఏదో … Read more

కాంగ్రెస్ ప్రచారంలో ప్రణవ్ మార్క్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే02:ఓవైపు మండుటెండలు దంచి కొడుతున్న అదే మండుటెండల్లో ఎండకు తగ్గట్టుగా తన స్పీచ్ తో సభకు వచ్చిన ప్రజలను ఉత్సాహ పరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం వోడితల ప్రణవ్.గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే తమ ప్రభుత్వం ఏం చేసిందో,చేసిన ఆరు గ్యారెంటిలను ప్రజలకు వివరించి చెప్తున్నారు.ప్రణవ్ బాబుకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడం దానికి తగ్గట్టుగా అందరినీ కలుపుకొనిపోయే ప్రణవ్ బాబు ఈ సారి హుజురాబాద్ … Read more