మల్కాజ్గిరి పై..ఆధిపత్యం ఎవరిది.?

హైదరాబాద్ (ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ … Read more

శ్రీ సీతారాముల కళ్యాణం..కనులవిందు

పట్టు సమర్పిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి. జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 17:అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం కమనీయం రమణీయంగా జరిగింది.సీతా రామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య వేదపండితుల వేదమంత్రోచరణ మధ్య ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. … Read more

హస్తం గూటికి మరో బిఆర్ఎస్ కౌన్సిలర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 16:హుజురాబాద్ లో గులాబీ పార్టీ నుండి మెల్లమెల్లగా ఒక్కొక్క లీడర్ జారుకుంటుంన్నారు.ఇప్పటికే పలువురు అధికారం లో ఉన్న నాయకులు బిఆర్ఎస్ పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరగా,తాజా గా జమ్మికుంట పట్టణానికి చెందిన కౌన్సిలర్ శ్రీపతి నరేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.హైదరాబాద్ లో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల ప్రణవ్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోని ఆహ్వానించారు.ఈ సందర్బంగా శ్రీపతి నరేష్ మాట్లాడుతూ తన చేరికకు సహకరించిన మంత్రి పొన్నం … Read more

ఘనంగా సైదాపూర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:సైదాపూర్ మండల కేంద్రంలోని డా.బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి  సందర్భంగా గతంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం కేటాయించిన స్థలంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డా.భీంరావ్ రాంజీ అంబేడ్కర్,ఒక  సంఘసంస్కర్త  అని,అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.డాక్టర్  బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతని,అతి పెద్ద … Read more

స్పందన అనాధాశ్రమంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్థానిక పోలీస్ వారి సహకారంతో సామాజిక కార్యకర్త,  అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో,ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపించడం జరిగింది ఈ సందర్భంగా   స్పందన పిల్లల అనాధాశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ  నోట్ బుక్కులు,పెన్నులు ఫ్రూట్స్ పంపిణీ చేసి పిల్లలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని తను పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన తన త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు … Read more

బండి సంజయ్ మంత్రి  పొన్నం కాలిగోటి కూడా సరిపోడు

కరీంనగర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలకాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు,తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలలు మరియు విభజన చట్టంలో ఆమలు కాని హామీలపై ఆదివారంనాడు కరీంనగర్ లో బీసీ మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన నిరసనదీక్షలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఉండక, ఉనికి కోసం పక్క నియోజకవర్గంలో వెళ్లి సినిమా డైలాగులు కొడుతున్నాడు.ముఖ్యమంత్రి … Read more

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో వార్డ్ యూత్ అధ్యక్షులు పుల్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి మరియు కేక్ కట్ చేసి ఘనంగా జరిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ బోయిని కుమార్,పల్లపు రవి,శనిగరపు రవి,తిరుపతి శ్రీనివాస్,మిడిదొడ్డి శంకర్,రామ్ రాజబాబు,పుల్లూరి శ్యాంమూర్తి,దాసారపు వేణు మరియు వార్డు సభ్యులు రమేష్,రవి,విజయ్,కాజా తన్వీర్,రాజేందర్,శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏ ఐ ఆర్ ఆర్ ఎఫ్) జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు  దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ వేడుకల్లో దాసరి రాజేశ్వర్ పూలే మరియు అంబేద్కర్ ఆశయాలను వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి మొయినుద్దీన్,ట్రెజరర్ బి.విద్యాసాగర్,ఎండి ఖాదర్ ఖాన్,టి.వెంకటస్వామి డి.సారంగపాణి కొమురయ్య,దేశరాజు పల్లి రాజయ్య,ఎస్.మల్లేశంలతో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు.

బాబా సాహెబ్ విగ్రహానికి నివాళులు అర్పించిన వొడితల ప్రణవ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:భారత రాజ్యంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహనికి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పూలమాల వేసి,నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దళిత సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ లో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కొంకటి  రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా సమావేశానికి ముఖ్య అతిథి గా కరీంనగర్ పార్లమెంట్ ఎస్సి మోర్చా ఎన్నికల కన్వీనర్ జాడి బాల్ రెడ్డి హాజరయ్యారు.మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెలలో కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో ఎస్సి మోర్చా దళిత సమ్మేళనం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి జాతీయ … Read more