వెల్లి విరిసిన మత సామరస్యం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే22: లౌకికవాదం,మతసామరస్య పరిరక్షణలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శం.మరీ ముఖ్యంగా పల్లెల్లో ముస్లింలు,హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా.. ఒకరికొకరు అండగా ఉంటారు.హిందువుల పండుగల్లో ముస్లింలు ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు.హిందూ ముస్లిం భాయి భాయి  అని మరోసారి రుజువు అయింది.బుధవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ మహమ్మద్ సందాని హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.ఈ సందర్భంగా సందాని మాట్లాడుతూ … Read more

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే21:సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి మాజీ ప్రధాని,భారత రత్న స్వర్గీయులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టేషన్ అవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్  ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మల వేసి ఘన నివాళి అర్పించడం … Read more

అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి

కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే18:గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని  ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో శనివారం  ప్రభుత్వాన్ని కోరారు.  ఈ సందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ మార్కెట్ కల్లాలలో,ఐకెపి కేంద్రాలలో  ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయిందని, పండ్ల తోటలు మామిడి,సపోటా బొప్పాయి తదితర కాయలు ఈదురు గాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిలిందని  ఆయన పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం  … Read more

పరకాల తిరుపతి వర్ధంతి సందర్భంగా అన్నదానం

జమ్మికుంట ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన క్రి.శే.పరకాల తిరుపతి గౌడ్ నాలుగవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు జమ్మికుంట మండలం కేంద్రంలోని స్పందన అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండల జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్  శ్యాం, సిరిసేడు మాజీ సర్పంచ్ రఫీ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వీరి చేతుల మీదుగా అనాధ పిల్లలకి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి భార్య పరకాల రేణుక,కుమారుడు సాయి కుమార్,సిరి సైడ్ మాజీ … Read more

పదేండ్ల మోడీ పాలనలో పౌర హక్కులు హరించబడ్డాయి

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే11:ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని,నరేంద్ర మోడీ ని ఓడించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు.శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో “ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం”అనే సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల సంక్షేమం,సామాజిక న్యాయానికి మన రాజ్యాంగం పెద్దపీట వేసిందని,అలాంటి రాజ్యాంగాన్ని రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రమాదంలో పడవేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం … Read more

తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతం ఆవిష్కరించిన వొడితల ప్రణవ్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే7: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సింగపూర్ లోని తన నివాసంలో సోమవారం రాత్రి తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతం సంఘమిత్ర యూట్యూబ్ ఛానల్ లో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతాన్ని ఇల్లందకుంట మండలం సీతంపేట కి చెందిన రచయిత మైస ఎల్లయ్య భారతదేశంలో ప్రస్తుత తరుణంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని, మాణిపూర్ రాష్ట్రంలో రెండు తెగలకు మధ్య జరిగిన పోరాటంలో స్త్రీల … Read more

డైలాగులతో ఓట్ల రాజకీయం

వీణవంక(ధనాధన్ న్యూస్)మే 06:డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాల పల్లి ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని,దేవుడి ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయా అంటూ రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు.పేద బడుగు బలహీన … Read more

రేపే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభ

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్29:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా జమ్మికుంట పట్టణంలో దాదాపు లక్ష మంది జనాభా తో ఏర్పాటు చేస్తున్న సభలో పాల్గొననున్నారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయలేదు.కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురావేయడమే లక్ష్యం గా రేపటి సభ లో సీఎం … Read more

మహిళామణులు మీ ప్రేమా అభిమానాలు చాటాలే!

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 28:ఈ నెల 30 న జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ కోరారు. ఆదివారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జమ్మికుంటకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ … Read more

ఈ నెల 30న జమ్మికుంటకు ముఖ్యమంత్రి రాక

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్27:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానానికి ఈనెల 30న రానున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ శనివారం డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రధాన వేదిక తో పాటు కార్యకర్తలు కూర్చోవడానికి అవసరమైన గ్యాలరీల ఏర్పాట్లను పర్యవేక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు … Read more