మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు.బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు.సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు … Read more

తెలంగాణ కు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 30:దేవుడు గుడిలో ఉండాలి ,భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సాంప్రదాయానికి మాయని కి మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ,అయోధ్య రామాలయం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ … Read more

రేపే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభ

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్29:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా జమ్మికుంట పట్టణంలో దాదాపు లక్ష మంది జనాభా తో ఏర్పాటు చేస్తున్న సభలో పాల్గొననున్నారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయలేదు.కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురావేయడమే లక్ష్యం గా రేపటి సభ లో సీఎం … Read more

నూజివీడు సీడ్స్ నూతన వంగడం క్షేత్ర ప్రదర్శన

రామడుగు(ధనాధన్ న్యూస్)ఏప్రిల్25:రామడుగు మండలంలోని వెధిర గ్రామంలో బుధవారం రోజున నూజివీడు సీడ్స్ కంపెనీ వరి పుష్కల్ (ఎన్ పి 9153) దొడ్డు రకమును గ్రామానికి చెందిన వాసు రావు వ్యవసాయ పొలంలో రైతులతో క్షేత్రస్థాయి ప్రదర్శన  నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పుష్కల్ వరి వంగడం మిగతా రకాల వరి వంగడాల కంటే నాలుగైదు క్వింటాలు అధిక దిగుబడి వస్తుందని అన్నారు.ఈ రకం వానాకాలం,యాసంగి రెండు కాలాలకు … Read more

జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన మానకొండూర్ వీధులు

మానకొండూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 24:జై శ్రీరామ్ నినాదాలతో మానకొండూర్ పుర వీధులు మారుమ్రోగాయి.మానకొండూర్ మండలంలో బాలాంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ ఐక్యత బైక్ ర్యాలీని నిర్వహించారు.యువకులంతా కాషాయ జెండాలతో జైశ్రీరామ్ నినాదాలతో మానకొండూరు వీధులలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి దేవాసాని సంపత్,సొల్లు అజయ్ వర్మ, ఎడబోయిన రామకృష్ణారెడ్డి,మియాపురం లక్ష్మణాచారి,కత్తి ప్రభాకర్ గౌడ్,కంది రాజు రెడ్డి, … Read more

మల్కాజ్గిరి పై..ఆధిపత్యం ఎవరిది.?

హైదరాబాద్ (ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ … Read more

స్పందన అనాధాశ్రమంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్థానిక పోలీస్ వారి సహకారంతో సామాజిక కార్యకర్త,  అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో,ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపించడం జరిగింది ఈ సందర్భంగా   స్పందన పిల్లల అనాధాశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ  నోట్ బుక్కులు,పెన్నులు ఫ్రూట్స్ పంపిణీ చేసి పిల్లలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని తను పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన తన త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు … Read more

ఒలింపియాడ్ లో సత్తా చాటిన శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు

హుజురాబాద్, ఏప్రిల్ 08:జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ఐ.ఎన్.టి.ఎస్.ఓ) పరీక్షలో హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు 315 మంది ఒలంపియాడ్ పరీక్షలు రాయగా 271 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు.జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో పచ్చిమట్ల అనన్య, రెండవ స్థానంలో గూడూరి ఆశిష్ … Read more

ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

కరీంనగర్ ఏప్రిల్08:ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు,మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డి ఆర్ డి ఓ ఉప్పుల శ్రీధర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో ఉపాధిహామీ కూలీలకు … Read more

ఆ కార్పోరేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ కరీంనగర్ ఏప్రిల్ 06:జిల్లాల్లో  ప్రైవేట్  జూనియర్ కళాశాలలలు ఇంటర్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ముందస్తు అడ్మిషన్లు,వేసవి తరగతులు నిర్వహిస్తున్నారని  జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే  ప్రైవేట్  జూనియర్ కళాశాలల ఆగడాలు అరికట్టాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల ముందు ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ ఒక ప్రకటనలో  అన్నారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రామారపు … Read more