రసమయి కి చీర,సారే ప్రధానం చేసిన బిజెపి నాయకులు

కరీంనగర్ బిఆర్ఎస్ సభలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బిజెపి మానకొండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రసమయి బాలకిషన్ కు చీరే, సారేను ప్రధానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ రసమయికి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని,బండి సంజయ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉండి … Read more

కార్పొరేషన్ల ఏర్పాటు పట్ల హర్షం

ఎన్నో ఏళ్ల ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయం అని తెలంగాణ ఓసి జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి (లోక్సత్తా) పేర్కొన్నారు. గూడూరి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత … Read more

మున్నూరు కాపుల కల నెరవేరింది

-పొనగంటి మల్లయ్య,మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మున్నూరు కాపు రాష్ట్ర కార్పొరేషన్  ఏర్పాటు చేయడంతో మున్నూరు కాపుల కల నెరవేరిందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు.బుధవారం స్థానిక మోత్కులగూడెం చౌరస్తాలో మున్నూరు కాపు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చి,స్వీట్లు పంపిణీ చేసి,సంబరాలు చేసుకున్నారు.అనంతరం పొనగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు జిల్లా … Read more

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి

సైదాపూర్ మండలం దుదేనపల్లి గ్రామంలోని  పెద్దమ్మ తల్లి దేవస్థానంలోని గుడి చుట్టూ సిసి రోడ్ పనులను బుధవారం రోజున ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గుండారపు శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుదేదనపల్లి గ్రామ ఎంపీటీసీ చాడ చైతన్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి చిన్న వెంకటేశం,కాంగ్రెస్ కార్యకర్తలు,ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజ్ కులస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ

సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో  విఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించి,లస్మన్నపల్లె ప్రజలకు ప్లాస్టిక్ కవర్ల  వాడకంపై పర్యావరణానికి పెను ప్రమాదం సంభవిస్తుందని,ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని అవగాహన కల్పించారు.ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహణలో భాగంగా మూడవ రోజు గ్రామంలోని ప్రధాన వీధులు,రహదారులను శుభ్రము చేసి గ్రామంలోని నర్సరీ కేంద్రంలో కలుపు మొక్కలను ఏరివేశారు.తదనంతరం ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీ. తిరుపతి,కోమల,హరీష్,వాలంటర్లు  పాల్గొన్నారు.

పచ్చదనం పరిశుభ్రత,మానవ సంబంధాలపై అవగాహన కల్పించాలి

ఎన్ఎస్ఎస్  వాలంటీర్లు ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత  మానవ సంబంధాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సైదాపూర్ ఎంపీపీ , ఎంపీటీసీల  పోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు.సోమవారం రోజున మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో సింగపూర్ లోని వీఎస్ఆర్  డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఎన్ఎస్ఎస్  వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజాన్ని రక్షించేది సమాజాన్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత ( … Read more

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు మురికి పూర్ణిమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో డాక్టర్ హేమలత, వావిలాల కొత్తూరు జయశ్రీ,వికారాబాద్ ప్రవచన రత్న బిరుదాంకితురాలు,గీతా ప్రచారకురాలు విశ్వహిందూ పరిషత్ జిల్లా మాతృ శక్తి సంయోజక భాగ్యలక్ష్మి, ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత చాలా స్వరూప,కొత్తపల్లి డాక్టర్ వాణి, పెళ్లి అరుణాదేవి,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ డాక్టర్ జంధ్యం మాధవి,ఆదర్శ రైతు ఆస్కార్ అవార్డు గ్రహీత,వాసవి … Read more

సిరిసేడు లో వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వరస్వామి శివాలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య కనులపండువగా జరిగింది.ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలయ కమిటీ ఛైర్మన్ కొండ విజయ్ స్వగృహం నుండి మేళతాలల మధ్య ముత్యాల తలంబ్రాలు మోసుకెళ్లి శివాలయంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణానికి సమర్పించారు.అనంతరం పాడి కౌశిక్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక అర్చన,అభిషేకాలు చేశారు.ఈ సందర్భంగా వేదపండితులు … Read more

మహాశివరాత్రి రుద్రహోమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు,రుద్ర హోమం,రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రుద్ర హోమం చేశారు.. ఆలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వొడితల … Read more

గంగిరెద్దుల భవనానికి భూమి పూజ

హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కొరకు 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఇందిరానగర్ మాజీ కోడిగూటి శారద ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి … Read more