తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్, ఆగష్టు 26: తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ కోసం కీలకమైన ఓటర్ల జాబితా సవరణ పనులను ప్రారంభించింది. హైకోర్టు కీలక తీర్పు 2024 జనవరి 31తోనే తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ చెక్ పవర్ నిలిచిపోగా, … Read more

బండి సంజయ్ అహంకార పూరిత మాటల్ని ఆపాలే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.మాజీ దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి ఈ దేశానికి సేవలందించిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ని ఉగ్రవాది తో పోల్చడంపై బండి సంజయ్ వాఖ్యలను జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం నీతిమాలిన … Read more

ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజాకవి, రచయిత సామాజికవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రపంచ భారత్ … Read more

సైదాపూర్ మండల బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడిగా దెంచనాలా శ్రీనివాస్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి  గ్రామానికి చెందిన దెంచ నాలా శ్రీనివాస్ గతంలో బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులుగా,బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పని తీరును గుర్తించి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నాయకత్వం నూతన అధ్యక్షుల నియామకంలో భాగంగా దెంచనాల శ్రీనివాస్ ను గురువారం రోజున బిజెపి మండల పార్టీ అధ్యక్షులుగా సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి సారంగుల అమర్నాథ్ ప్రకటించినట్లు శ్రీనివాస్ ప్రకటన లో తెలిపారు.నూతన బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు … Read more

దేవీ న‌వ‌రాత్రుల్లో ఎనిమిదో రోజు కన్యా పూజ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్ లోని 24 వ వార్డు నందు రాజేష్ ఠాకూర్ రాకేష్ ఠాగూర్ ఆధ్వర్యంలో కన్య పూజ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారు  ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తార‌ని దుర్గామాత అని తలవగానే మన మదిలో త్రిశూలధారియై దుర్గాష్టమి నాడే 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పూజ చేసి, తాంబూలాలు,కానుకలు ఇస్తారు.దీన్ని కన్యా పూజ అంటారు.బాలికల్లో దుర్గాదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు.అందుకే … Read more

పోస్ట్ ద్వారా సీఎం కి వినతిపత్రం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ నియోజకవర్గం రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి పోస్ట్ ద్వారా వినతి పత్రం పంపడం జరిగింది.ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గం దళిత బంధు పైలెట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది.అందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం … Read more

యశ్వంత్ మృతి అత్యంత బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇంటర్ విద్యార్థి విద్యుద్ఘాతంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ తెలిపారు. శనివారం ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనతో ఊరంతా విషాదచాయలు నెలకొన్నాయని పేర్కొన్నారు.ఈ దుర్ఘటనపైన చింతిస్తూ,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెంకట్ తెలిపారు.ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాల్లో నవరాత్రుల కోసం మండపాల అలంకరణ,నిమజ్జనం సమయాల్లో నిర్వాహకులు తగు జాగ్రత్తలు … Read more

కార్యకర్తలే బీజేపీ పార్టీకి బలం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సభ్యత్వ నమోదు అనేది పార్టీకి పునాది లాంటిదని,కార్యకర్తలే బిజెపి పార్టీ బలం అని  జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు.ఈరోజు వీణవంక మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యాశాల (సన్నాహక సమావేశం)  జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎరబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు కొంత మంది వ్యక్తుల మీద ఆధారపడి ముందుకు … Read more