జెఎస్అర్ కూలింగ్ చలివేంద్రం ప్రారంభం

సైదాపూర్ మండలం:సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ అవరణలో గురువారం రోజున వేసవి కాలం దృశ్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతియేటా ఏర్పాటు చేసిన విధంగానే ప్రస్తుత సంవత్సరం కూడా  జెఎస్అర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బస్టాండ్ వద్ద చల్లని నీటిని అందించేందుకు ఫ్రిజ్ లు ఏర్పాటు చేశారు.కూలింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేసి మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చే  జెఎస్అర్ సేవ భావానికి కృతజ్ఞతలు … Read more

ఈటెల రాజేందర్ జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు చేసిన మైనార్టీ నాయకులు

బిజీగీర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట ముస్లిం మైనార్టీ నాయకులు బుధవారం రోజున దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించారు.మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మైనార్టీ నాయకుడు మహమ్మద్ నసిరుద్దీన్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఆయురారోగ్యం బాగుండాలని,రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలవాలని దర్గాలో ప్రార్థించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మొహమ్మద్ … Read more

ఈటలకు జన్మదిన శుభాకాంక్షలు బీజేపీ నాయకులు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ షామీర్పేట్ లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి అత్యధిక మెజార్టీ తో ఈటల రాజేందర్ గెలుపు తత్యం అయిందని అన్నారు.ఈ కార్యక్రమంలో  బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబల్లి సంపత్ రావు, జమ్మికుంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఎర్రంరాజు సురేందర్ రాజ్,ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి,ఇనగాల రత్నాకర్, బొంతల అమరేందర్,జక్కుల రమేష్,బుర్ర కరుణాకర్, అరవింద్,రజనీకాంత్,తదితరులు … Read more

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరిగింది. పాత కార్యవర్గం యొక్క కాల పరిమితి ముగిసినందున, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడుగా దాసరి రాజేశ్వరరావు, కార్యదర్శిగా మొహమ్మద్ మొయినుద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షుని గా టీ వెంకటస్వామి, సంయుక్త్య కార్యదర్శిగా శీలం మల్లేశం, సహాయ కార్యదర్శులుగా ఏం పరశురాములు, జి.మొగిలి, బి.సమ్మయ్య, డి. సారంగపాణి, ఎస్.రామచందర్, ఎస్.రాజయ్య కోశాధికారిగా బి.విద్యాసాగర్ సహాయ కోశాధికారిగా ఎండి ఖాదర్ ఖాన్ గౌరవ సలహాదారులుగా … Read more

రసమయి కి చీర,సారే ప్రధానం చేసిన బిజెపి నాయకులు

కరీంనగర్ బిఆర్ఎస్ సభలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బిజెపి మానకొండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రసమయి బాలకిషన్ కు చీరే, సారేను ప్రధానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ రసమయికి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని,బండి సంజయ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉండి … Read more

శనివారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం

సైదాపూర్,ఆకునూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మార్చి 9 శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 33/11 కెవి సబ్ స్టేషన్ మరమ్మతుల దృశ్య విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సైదాపూర్ ఏఈ బొమ్మ ఆంజనేయులు గౌడ్ తెలియజేశారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం

సైదాపూర్ మండలానికి చెందిన వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలకు గత మూడు నెలలుగా వేతనాలు రాక మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని,ఈఎంఐ చెల్లింపులు పిల్లల కళాశాల ఫీజులు,మా ఆరోగ్యరీత్యా మెడిసిన్ ఖర్చులు,మారోజు వారి రవాణా ఖర్చుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని,మాకు వెంటనే డిసెంబర్,జనవరి,ఫిబ్రవరి మూడు మాసాల వేతనాలను విడుదల చేసి మాఖాతాలో జమ చేయగలరని  గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాతకి తెలంగాణ రెండవ ఏఎన్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం … Read more

దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఆగడం పై బిజెపి శ్రేణుల హర్షం

ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92)  జమ్మికుంటలో ఆగడానికి రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం హర్షనీయమని, ఇది రైల్వే ప్రయాణికులకు వ్యాపారులకు శుభవార్త లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. దానాపూర్ ఎక్స్ ప్రెస్ జమ్మికుంటలో ఆపడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకున్నందున స్థానిక బిజెపి శ్రేణులు రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్,ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు … Read more

శాయంపేట లో ఐమాక్ లైట్స్ ని ప్రారంభించిన జడ్పీటీసీ శ్యాం

జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఐమాక్స్ లైట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హాజరై వాటిని ప్రారంభించారు.  ఈ సందర్భంగా జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ జమ్మికుంట మండలంలోని వావిలాల, పెద్దoపల్లె,జగ్గయ్యపల్లి,పాపక్కపల్లె శంభునిపల్లె  తనుగుల,నాగంపేట్,కోరపల్లి,వెంకటేశ్వరపల్లి, గ్రామాలలో జిల్లా పరిషత్ నిధి నుండి ఒక్కొక్క గ్రామానికి ఒక లక్ష రూపాయలు చొప్పున కేటాయించి ఆయా గ్రామాలలో ఐమాక్స్ లైట్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు.ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని  … Read more

సైదాపూర్ లో ప్రజా పాలన హెల్ప్ డెస్క్ ప్రారంభం

సైదాపూర్ మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని  రాష్ట్ర ఎంపీపీల పోరం రాష్ట్ర అధ్యక్షుడు సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన సేవ కేంద్రం దరఖాస్తు చేసుకున్నవరు వారి దరఖాస్తులలో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని, అలాగే గతంలో దరఖాస్తు చేసుకొని వారు కొత్తగా ప్రజాపాలన హెల్ప్ డెస్క్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దూలం మంజుల,ఎంపీడీవో … Read more