రసమయి కి చీర,సారే ప్రధానం చేసిన బిజెపి నాయకులు

కరీంనగర్ బిఆర్ఎస్ సభలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బిజెపి మానకొండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రసమయి బాలకిషన్ కు చీరే, సారేను ప్రధానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ రసమయికి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని,బండి సంజయ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉండి … Read more

శనివారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం

సైదాపూర్,ఆకునూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మార్చి 9 శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 33/11 కెవి సబ్ స్టేషన్ మరమ్మతుల దృశ్య విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సైదాపూర్ ఏఈ బొమ్మ ఆంజనేయులు గౌడ్ తెలియజేశారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం

సైదాపూర్ మండలానికి చెందిన వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలకు గత మూడు నెలలుగా వేతనాలు రాక మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని,ఈఎంఐ చెల్లింపులు పిల్లల కళాశాల ఫీజులు,మా ఆరోగ్యరీత్యా మెడిసిన్ ఖర్చులు,మారోజు వారి రవాణా ఖర్చుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని,మాకు వెంటనే డిసెంబర్,జనవరి,ఫిబ్రవరి మూడు మాసాల వేతనాలను విడుదల చేసి మాఖాతాలో జమ చేయగలరని  గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాతకి తెలంగాణ రెండవ ఏఎన్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం … Read more

దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఆగడం పై బిజెపి శ్రేణుల హర్షం

ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92)  జమ్మికుంటలో ఆగడానికి రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం హర్షనీయమని, ఇది రైల్వే ప్రయాణికులకు వ్యాపారులకు శుభవార్త లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. దానాపూర్ ఎక్స్ ప్రెస్ జమ్మికుంటలో ఆపడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకున్నందున స్థానిక బిజెపి శ్రేణులు రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్,ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు … Read more

శాయంపేట లో ఐమాక్ లైట్స్ ని ప్రారంభించిన జడ్పీటీసీ శ్యాం

జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఐమాక్స్ లైట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హాజరై వాటిని ప్రారంభించారు.  ఈ సందర్భంగా జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ జమ్మికుంట మండలంలోని వావిలాల, పెద్దoపల్లె,జగ్గయ్యపల్లి,పాపక్కపల్లె శంభునిపల్లె  తనుగుల,నాగంపేట్,కోరపల్లి,వెంకటేశ్వరపల్లి, గ్రామాలలో జిల్లా పరిషత్ నిధి నుండి ఒక్కొక్క గ్రామానికి ఒక లక్ష రూపాయలు చొప్పున కేటాయించి ఆయా గ్రామాలలో ఐమాక్స్ లైట్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు.ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని  … Read more

సైదాపూర్ లో ప్రజా పాలన హెల్ప్ డెస్క్ ప్రారంభం

సైదాపూర్ మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని  రాష్ట్ర ఎంపీపీల పోరం రాష్ట్ర అధ్యక్షుడు సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన సేవ కేంద్రం దరఖాస్తు చేసుకున్నవరు వారి దరఖాస్తులలో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని, అలాగే గతంలో దరఖాస్తు చేసుకొని వారు కొత్తగా ప్రజాపాలన హెల్ప్ డెస్క్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దూలం మంజుల,ఎంపీడీవో … Read more

ఒక్క ఓటమితో ఈటల ‘ఆత్మగౌరవం’ బదిలీ?

ఈటల రాజేందర్..ఈ పేరు బహుశా తెలంగాణ రాజకీయాల్లోనే కాదు..దేశంలోనూ ప్రజానీకానికి..రాజకీయ ఓనమాలు తెలిసిన అందరికీ తెలిసిన పేరు అని చెప్పొచ్చు. హుజురాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు రాజకీయ యవనికపై స్థానం సుస్థిరం చేసుకున్న తెలివైన రాజకీయ నాయకుడిగా రాజకీయ వర్గాల్లో ఆయనకు పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ‘నాడు’ ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ కీలక భూమికను పోషించిన ధీశాలి ఈటల. ‘గులాబీ జెండా’కు ఓనర్లం … Read more

బీజేపీ గెలిస్తే మోదీయే పీఎం- మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు పీఎం

మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది.ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి.ఆ హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నరు.గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం,కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు.రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ … Read more

మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండా లో అవినీతి

మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన ఎజండ ప్రజల కోసం అభివృద్ది కోసం ఉపయోగ పడేలా లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం 12 గంటలకు వుందని సమాచారం అందించి ఆ తరువాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు మళ్ళీ సమాచారం అందించారని తెలిపారు.ఈ సమాచారం తో 11:30 కు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ గదిలోకి వెళ్ళగానే … Read more

ఎక్సైజ్ సిఐ,ఎస్సై లకు ఘన సన్మానం

సాధారణ బదిలీల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతనంగా వచ్చినటువంటి ఎక్సైజ్ సీఐ మాధవిలత,ఎస్సై సౌమ్యలను సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు మండలాల పరిధిలో ఉన్న గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని,గీత కార్మికులకు ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు పై అధికారులతో మాట్లాడి ప్రమాద బారిన పడిన కార్మికునికి న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమములో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడగొని బుచ్చయ్య గౌడ్,జిల్లా … Read more